Political News

నాలుగు కాదు నలభై ..!

వరిస్తూనే ఉంటుంది. ఏపీ విపక్షం తెలుగుదేశం  పని కూడా ఇప్పుడు అలానే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా క్లీన్ స్వీప్ చేశారో లేదో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయభేరీ మోగించారు. వైసీపీ ఎమ్మెల్యేలే క్రాస్  ఓటింగ్  చేసి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను  గెలిపించడమే  విపక్ష  పార్టీ గ్రేట్ సక్సెస్..

విజయం తెచ్చిన జోష్ ఇప్పుడు టీడీపీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందే డిసైడ్ చేసుకున్న  ఇద్దరు కాకుండా మరో ఇద్దరు క్రాస్  ఓటింగ్  చేయడంతో నాలుగు తమకు లక్కి నెంబర్ అని, దానికి మంచి  23  లక్కీయెస్ట్ నెంబర్ అని చెప్పుకుంటున్నారు. దీనితో అనుక్షణం పార్టీ నేతలు దూకుడును ప్రదర్శిస్తున్నారు. జగన్  మినహా వైసీపీ ఎమ్మెల్యేలంతా తమ వైపే చూస్తున్నారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గెట్లు తెరిచి చిటికేస్తే అందరూ వచ్చి  తమ పక్కన కూర్చుంటారని, చంద్రబాబు చెప్పినట్లు వింటారని అంటున్నారు..

టీడీపీ  ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు  మహిళ  అధ్యక్షురాలు  వంగలపూడి అనిత ఇప్పుడు  కొత్త  నినాదం అందుకున్నారు. నాలుగు కాదు నలభై అని వాళ్లు  చెప్పుకుంటున్నారు. టీడీపీ ఓటేసిన నలుగురిని వైసీపీ సస్పెండ్   చేసిన తీరును విమర్శిస్తూ  వైసీపీ  నుంచి ఇేంకా నలభై మంది ఎమ్మెల్యేలు  తమతో టచ్ లో ఉన్నారని అనిత  వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల  సమయంలో కూడా కొందరు టీడీపీ నేతలు ఇదే మాట చెప్పుకున్నారు.  కనీసం 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు  ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే చంద్రబాబే వద్దని వారించారని డైలాగులు వదిలారు. 

టీడీపీ   పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు కూడా అనిత తరహాలోనే పంచ్ డైలాగులు కొట్టారు.  తమతో కలిసిపోయేందుకు 40 మంది రెడీగా ఉన్నారని ఆయన చెప్పుకున్నారు. అసలు జగనే తమకు ఓటేసి ఉండొచ్చని అచ్చెన్న అంటున్నారు.  మరి  విజయం తెచ్చిన జోష్ అలాంటిది కదా… టీడీపీ  వాళ్లు కొన్ని రోజులు ఏమైనా మాట్లాడతారనుకోవాలి…

This post was last modified on March 29, 2023 11:58 am

Share

Recent Posts

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

2 hours ago

టాలీవుడ్ ఆగస్ట్ కిరీటం – ఎవరికో అవకాశం!

కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…

5 hours ago

మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను

జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

7 hours ago

పవన్… కళాకారులకో వరం

నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…

9 hours ago

మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…

10 hours ago

ట్విట్టర్ టాక్స్… ప్రీమియర్ మాటలు… నిజాలు కావా

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…

16 hours ago