వరిస్తూనే ఉంటుంది. ఏపీ విపక్షం తెలుగుదేశం పని కూడా ఇప్పుడు అలానే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా క్లీన్ స్వీప్ చేశారో లేదో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయభేరీ మోగించారు. వైసీపీ ఎమ్మెల్యేలే క్రాస్ ఓటింగ్ చేసి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను గెలిపించడమే విపక్ష పార్టీ గ్రేట్ సక్సెస్..
విజయం తెచ్చిన జోష్ ఇప్పుడు టీడీపీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందే డిసైడ్ చేసుకున్న ఇద్దరు కాకుండా మరో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేయడంతో నాలుగు తమకు లక్కి నెంబర్ అని, దానికి మంచి 23 లక్కీయెస్ట్ నెంబర్ అని చెప్పుకుంటున్నారు. దీనితో అనుక్షణం పార్టీ నేతలు దూకుడును ప్రదర్శిస్తున్నారు. జగన్ మినహా వైసీపీ ఎమ్మెల్యేలంతా తమ వైపే చూస్తున్నారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు. గెట్లు తెరిచి చిటికేస్తే అందరూ వచ్చి తమ పక్కన కూర్చుంటారని, చంద్రబాబు చెప్పినట్లు వింటారని అంటున్నారు..
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నారు. నాలుగు కాదు నలభై అని వాళ్లు చెప్పుకుంటున్నారు. టీడీపీ ఓటేసిన నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసిన తీరును విమర్శిస్తూ వైసీపీ నుంచి ఇేంకా నలభై మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని అనిత వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా కొందరు టీడీపీ నేతలు ఇదే మాట చెప్పుకున్నారు. కనీసం 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమకు ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే చంద్రబాబే వద్దని వారించారని డైలాగులు వదిలారు.
టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు కూడా అనిత తరహాలోనే పంచ్ డైలాగులు కొట్టారు. తమతో కలిసిపోయేందుకు 40 మంది రెడీగా ఉన్నారని ఆయన చెప్పుకున్నారు. అసలు జగనే తమకు ఓటేసి ఉండొచ్చని అచ్చెన్న అంటున్నారు. మరి విజయం తెచ్చిన జోష్ అలాంటిది కదా… టీడీపీ వాళ్లు కొన్ని రోజులు ఏమైనా మాట్లాడతారనుకోవాలి…
This post was last modified on March 29, 2023 11:58 am
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…