Political News

ఏకమవుతున్న ప్రతిపక్షాలు…థ్యాంక్స్ టు బీజేపీ

గడచిన తొమ్మిదేళ్ళలో బీజేపీకి వ్యతిరేకంగా దేశంలోని ప్రతిపక్షాలు ఏకమైన ఘటన దాదాపు లేదనే చెప్పాలి. అలాంటిది ఇపుడు అన్నీ ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయి. అదికూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా. ఇంతకీ విషయం ఏమిటంటే లోక్ సభ ఎంపీగా రాహూల్ గాంధీపై లోక్ సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేసింది. 2019 కర్నాటక ఎన్నికల ప్రచారంలో రాహూల్ మాట్లాడుతు దొంగలకంతా మోడీ ఇంటిపేరే ఎందుకుంటుంది అని సెటైర్లు వేశారు. ఆర్ధిక నేరాలకు పాల్పడి దేశం వదిలి పారిపోయిన నీరవ్ మోడీ, లలిత్ మోడీలని రాహూల్ ఉద్దేశ్యం.

అయితే రాహూల్ మరచిపోయిందేమంటే మోడీ అనేది కేవలం ఇంటిపేరు మాత్రమే. గుజరాత్ రాష్ట్రంలో మోడీ అనే ఇంటిపేరున్న వాళ్ళు లక్షల సంఖ్యలో ఉంటారు. వాళ్ళకంతా బీజేపీతో కానీ నరేంద్రమోడీతో కానీ ఎలాంటి సంబంధాలుండవు. అయితే బీజేపీ ఎంఎల్ఏ ఒకళ్ళు రాహూల్ తమ పరువుకు భంగం కలిగించారని సూరత్ కోర్టులో కేసువేశారు. ఆ కేసులోనే రాహూల్ కు రెండేళ్ళ జైలుశిక్షపడింది. రెండేళ్ళు జైలుశిక్ష పడిందన్న కారణంగా లోక్ సభ సెక్రటేరియట్ ఓవర్ యాక్షన్ చేసి రాహూల్ పై అనర్హత వేటువేసింది.

దీన్నే ఇపుడు దేశంలోని అన్నీ ప్రతిపక్షాలు ఉమ్మడిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇపుడు రాహూల్ పైన పడిన అనర్హత వేటే రేపు ఏదో రూపంలో తమ సభ్యులపైన కూడా పడటం ఖాయమని ప్రతిపక్షాలు ఆందోళన పడుతున్నాయి. అందుకనే వీళ్ళు వాళ్ళు అని కాకుండా అన్నీ పార్టీలు ఏకమవుతున్నాయి. ఢిల్లీలో జరగబోయే నిరసన ర్యాలీలో అన్నీ పార్టీలు పాల్గొనబోతున్నాయి. రాహూల్ పై అనర్హత వేటు పడటాన్ని కేసీయార్ కూడా తీవ్రంగా ఖండించారంటేనే ఆశ్చర్యంగా ఉంది.

ఢిల్లీలో జరగబోయే ప్రతిపక్షాల సమావేశంలో పాల్గొనాలని, నిరసనల్లో భాగం కావాలని కేసీయార్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయే మీటింగుకు మమతాబెనర్జీ, నితీష్ కుమార్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, ఉత్ధవ్ థాక్రే లాంటి ప్రముఖులందరు సమావేశంలో పాల్గొనబోతున్నారని ప్రచారం జరుగుతోంది. యూపీఏ పక్షాలు ఎలాగూ పాల్గొంటాయి. అంటే ఢిల్లీ మీటింగులోను తర్వాత జరగబోయే ర్యాలీలోనే కాకుండా తర్వాత రాష్ట్రాల్లో జరగబోయే ఆందోళనల్లో కూడా ప్రతిపక్షాలు పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిపక్షాలన్నింటినీ ఏకంచేసిన ఘనత బీజేపీకి కాకుండా ఇంకెవరికి దక్కుతుంది ?

This post was last modified on March 25, 2023 10:12 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

9 hours ago

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

10 hours ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

11 hours ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

12 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

12 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

13 hours ago