ఏపీలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న టీడీపీ కార్యాలయాల్లో సంబరాలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీ చేయడమే ఎక్కువ అనే స్థాయి నుంచి విజయం దక్కించుకునే పరిస్థితి కి పార్టీ చేరడం అంటే.. ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీకి భారీ ఎత్తున ఆక్సిజన్ అందించినట్టుగానే అవుతుందని అంటున్నారు పరిశీలకులు. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా.. పార్టీ రంగంలోకి దగింది.
భారీ ఎత్తున ఓట్లు కైవసం చేసుకుని పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం దక్కించుకోవడంతో పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీ ప్రధాన కార్యాలయం మంగళగిరిలో అధినేత చంద్రబాబు కేక్ కట్ చేసి నాయకులకు తినిపించారు. అదేవిధంగా జిల్లాల స్థాయిలోనూ నాయకులు.. పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాథ 23 ఓట్లతో విజయం దక్కించుకున్నారు.
ఇప్పటికే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడుకు మూడు స్థానాల్లోనూ వైసీపీ కోల్పోయి.. టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. దీంతో అప్పుడు కూడా టీడీపీ సంబరాల్లో మునిగిపోయారు. భారీ ఎత్తున జిల్లాల్లో కార్యకర్తలు టపాసులు కాల్చుకుని.. మిఠాయిలు పంచుకుని ఆనందంగా వేడుకలు చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా.. అత్యంత కీలకమని భావిస్తున్న ఎమ్మెల్యే కోటాలోనూ విజయం దక్కించుకోవడంతో టీడీపీ సంబరాలు అంబరాన్నంటాయి.
This post was last modified on March 23, 2023 8:32 pm
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…