ఔను.. ఈ పరిస్థితిని వైసీపీ అధినేత, సీఎం జగన్ అస్సలు ఊహించి ఉండరు. ఎందుకంటే.. ఇటీవలే ఉత్తరాంధ్ర, రాయలసీమ తూర్పు, పశ్చిమ ప్రాంతాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే.. దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. ఇది అసలు ఎన్నికే కాదని… తమ నుంచి పథకాలు అందుకుంటున్న ప్రజలు తమకు అనుకూలంగానే ఉన్నారని.. వైసీపీ నేతలు భాష్యం చెప్పారు.
దీంతో సరేలే.. వైసీపీ చెప్పిన దానిలోనూ ఏదో కొంత లాజిక్ ఉందికదా.. అని రాజకీయ విశ్లేషకులు సరిపు చ్చుకున్నారు. అయితే.. వారం తిరిగే సరికి.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మేల్యేలే ఓటువేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు.. ఏమాత్రం తేడా జరగకూడదని.. పార్టీ అధినేత, సీఎం జగన్ భావించారు. కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. అయితే.. అవన్నీ కూడా పటాపంచలు అయ్యాయి. ఎవరైతే..తాను గీసిన గీత దాటరని భావించారో. వారే ఇప్పుడు జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా ఎన్నికల్లో ఏకంగా.. నలుగురు ఎమ్మెల్యేలు కట్టు తప్పారు. ఎందుకంటే.. టీడీపీకి నైతికంగా ఉన్న బలం 19 మంది ఎమ్మెల్యేలే. టెక్నికల్గా 23 మంది అభ్యర్థుల బలం ఉన్నా.. నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీపంచన చేరిపోయారు. అయితే.. ఇప్పుడు ఆ నలుగురు వైసీపీ నుంచి టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికలను లైట్ తీసుకున్న వైసీపీ అధినేతకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే గట్టి.. షాక్ ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 23, 2023 8:28 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…