ఔను.. ఈ పరిస్థితిని వైసీపీ అధినేత, సీఎం జగన్ అస్సలు ఊహించి ఉండరు. ఎందుకంటే.. ఇటీవలే ఉత్తరాంధ్ర, రాయలసీమ తూర్పు, పశ్చిమ ప్రాంతాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే.. దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. ఇది అసలు ఎన్నికే కాదని… తమ నుంచి పథకాలు అందుకుంటున్న ప్రజలు తమకు అనుకూలంగానే ఉన్నారని.. వైసీపీ నేతలు భాష్యం చెప్పారు.
దీంతో సరేలే.. వైసీపీ చెప్పిన దానిలోనూ ఏదో కొంత లాజిక్ ఉందికదా.. అని రాజకీయ విశ్లేషకులు సరిపు చ్చుకున్నారు. అయితే.. వారం తిరిగే సరికి.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మేల్యేలే ఓటువేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు.. ఏమాత్రం తేడా జరగకూడదని.. పార్టీ అధినేత, సీఎం జగన్ భావించారు. కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. అయితే.. అవన్నీ కూడా పటాపంచలు అయ్యాయి. ఎవరైతే..తాను గీసిన గీత దాటరని భావించారో. వారే ఇప్పుడు జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా ఎన్నికల్లో ఏకంగా.. నలుగురు ఎమ్మెల్యేలు కట్టు తప్పారు. ఎందుకంటే.. టీడీపీకి నైతికంగా ఉన్న బలం 19 మంది ఎమ్మెల్యేలే. టెక్నికల్గా 23 మంది అభ్యర్థుల బలం ఉన్నా.. నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీపంచన చేరిపోయారు. అయితే.. ఇప్పుడు ఆ నలుగురు వైసీపీ నుంచి టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికలను లైట్ తీసుకున్న వైసీపీ అధినేతకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే గట్టి.. షాక్ ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు.
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…