ఔను.. ఈ పరిస్థితిని వైసీపీ అధినేత, సీఎం జగన్ అస్సలు ఊహించి ఉండరు. ఎందుకంటే.. ఇటీవలే ఉత్తరాంధ్ర, రాయలసీమ తూర్పు, పశ్చిమ ప్రాంతాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ ఘోరంగా పరాజయం పాలైంది. అయితే.. దీనిని పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే.. ఇది అసలు ఎన్నికే కాదని… తమ నుంచి పథకాలు అందుకుంటున్న ప్రజలు తమకు అనుకూలంగానే ఉన్నారని.. వైసీపీ నేతలు భాష్యం చెప్పారు.
దీంతో సరేలే.. వైసీపీ చెప్పిన దానిలోనూ ఏదో కొంత లాజిక్ ఉందికదా.. అని రాజకీయ విశ్లేషకులు సరిపు చ్చుకున్నారు. అయితే.. వారం తిరిగే సరికి.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మేల్యేలే ఓటువేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు.. ఏమాత్రం తేడా జరగకూడదని.. పార్టీ అధినేత, సీఎం జగన్ భావించారు. కట్టుదిట్టమైన నిఘా పెట్టారు. అయితే.. అవన్నీ కూడా పటాపంచలు అయ్యాయి. ఎవరైతే..తాను గీసిన గీత దాటరని భావించారో. వారే ఇప్పుడు జగన్ ఝలక్ ఇచ్చారు.
తాజా ఎన్నికల్లో ఏకంగా.. నలుగురు ఎమ్మెల్యేలు కట్టు తప్పారు. ఎందుకంటే.. టీడీపీకి నైతికంగా ఉన్న బలం 19 మంది ఎమ్మెల్యేలే. టెక్నికల్గా 23 మంది అభ్యర్థుల బలం ఉన్నా.. నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం వైసీపీపంచన చేరిపోయారు. అయితే.. ఇప్పుడు ఆ నలుగురు వైసీపీ నుంచి టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు పట్టభద్రుల ఎమ్మెల్యే ఎన్నికలను లైట్ తీసుకున్న వైసీపీ అధినేతకు.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే గట్టి.. షాక్ ఇచ్చారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 23, 2023 8:28 pm
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…
సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…
పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…