ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ స్పీకర్ ఒక టీడీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన పాత రాజీనామా లేఖను ఆమోదించారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలాకాలం కిందట టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు.
అయితే.. ఉప ఎన్నిక వస్తే తమకు ఇబ్బంది అనే కోణంలో అప్పట్లో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉండడంతో టీడీపీకి ఒక ఓటు తగ్గించే ఉద్దేశంతో ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరుగుతోంది.
దీనిపై స్వయంగా గంటా కూడా స్పందించారు. తన రాజీనామాను ఇప్పుడు ఆమోదిస్తే అది చెల్లదని… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా తమ పేర్లన్నీ ప్రకటించిన తరువాత రాజీనామా ఆమోదిస్తే అది టెక్నికల్గా కుదరదని చెప్పారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని… తన ఓటు తగ్గడం వల్ల టీడీపీ ఎలాగూ గెలవదని చెప్తూ వైసీపీ అసంతృప్తులు టీడీపీకి ఓటేయకుండా ఆపేందుకు ఈ మైండ్ గేమ్ ఆడుతోందని చెప్పారు. వైసీపీకి దుర్భుద్ధి ఉన్నా స్పీకర్ ఆ పని చేయలేరని.. చేస్తే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మచ్చ ఆయనపై పడుతుందని పరిశీలకులు అంటున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా అప్పట్లో రాజీనామా చేశారు. కానీ, స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. తన రాజీనామా ఆమోదించాలని గంటా కోరినా అది జరగలేదు. అయితే… గంటా అప్పట్లో పంపిన రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లోనే ఉండడంతో దాన్ని ఇప్పుడైనా ఆమోదించే అవకాశం ఉంది.
అయితే, ఇక్కడ సమస్యంతా నైతిక విలువలు. పూర్తిగా రాజకీయమే చేయాలనుకుంటే పాలక వైసీపీ చెప్పినట్లు స్పీకర్ ఈ రాజీనామాను ఆమోదిస్తారు. అలాకాకుండా నైతికతపై ఆధారపడితే స్పీకర్ ఈ రాజీనామాను ఆమోదించకపోవచ్చు. ఒకవేళ స్పీకర్ తమ్మినేని కనుక ఈ రాజీనామాను ఆమోదిస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఒకరకంగా ఆయన రాజకీయ జీవితంలో అది మచ్చగా మిగిలిపోయే ప్రమాదముంది.
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…