రాష్ట్రంలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ నుంచి ఏడుగురు సభ్యులు, ప్రతిపక్షం టీడీపీ నుంచి ఒకరు బరిలో ఉన్నారు. అయితే.. ఇక్కడ కీలక విషయం ఏంటంటే.. టీడీపీ ఓడిపోయినా..వచ్చే ఇబ్బంది లేదు. అలాగని గెలవదని గ్యారెంటీ కూడా లేదు. ఎటొచ్చీ.. వైసీపీ శిబిరంలోనే గుబులు పట్టుకుంది. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మూడు స్థానాల్లోనూ పార్టీ ఘోర పరాజయం తర్వాత.. వచ్చిన ఎన్నిక కావడంతో ఇక్కడ ఏమైనా తేడా కొడితే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. సర్కారును ఓడించే ప్రమాదం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.
మరోవైపు ఏడుగురు సభ్యుల్నీ గెలిపించుకునే బలం తమకుందని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసే ఎమ్మెల్యేలతో తమ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తుందని టీడీపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సి ఉన్నందున.. విప్ లేకుండా జరిగే రహస్య బ్యాలెట్లో ఏ ఓటు ఎటు పడుతుందనే ఉత్కంఠ చర్చనీయాంశమైంది.
వైసీపీ సాంకేతికంగా 6 స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా 7 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. అయితే, ఇటీవల 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అధికార పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎన్నికను ప్రతిష్ఠాత్మ కంగా తీసుకుంది. అసంతృప్తి ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా పెట్టి క్రాసింగ్ ఓటింగ్ చేస్తారనే అనుమానం ఉన్నవారి లిస్ట్ తయారు చేసుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. టీడీపీ సాంకేతికంగా ఒకటి గెలుచుకునే అవకాశం ఉన్నా.. నైతిక మద్దతు లేనికారణంతో తటపటాయిస్తోంది. ఎందుకంటే.. 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీ శిబిరానికి అండగా నిలిచారు.
ఒక్కొక్కరికీ 22 ఓట్లు చాలు!
ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్య, ఖాళీ స్థానాలకు అదనంగా ఒకటి జోడించి భాగించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం శాసనసభ్యులున్న 175 సంఖ్యను 8తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం. ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించకపోతే.. రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. టీడీపీ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు పడే అవకాశం లేనప్పటికీ.. అధికార పార్టీ నుంచి ఒక్క ఓటు క్రాస్ అయినా అభ్యర్థి గెలుపు లాంఛనమేనని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on March 23, 2023 9:54 am
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…