Political News

ఎమ్మెల్సీ ఎన్నిక‌.. వైసీపీలో గుబులు.. టీడీపీలో హుషారు!

రాష్ట్రంలో ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అధికార పార్టీ నుంచి ఏడుగురు సభ్యులు, ప్రతిపక్షం టీడీపీ నుంచి ఒకరు బరిలో ఉన్నారు. అయితే.. ఇక్క‌డ కీల‌క విష‌యం ఏంటంటే.. టీడీపీ ఓడిపోయినా..వచ్చే ఇబ్బంది లేదు. అలాగ‌ని గెల‌వ‌ద‌ని గ్యారెంటీ కూడా లేదు. ఎటొచ్చీ.. వైసీపీ శిబిరంలోనే గుబులు ప‌ట్టుకుంది. ఇటీవ‌ల గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల్లో మూడు స్థానాల్లోనూ పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత‌.. వ‌చ్చిన ఎన్నిక కావ‌డంతో ఇక్క‌డ ఏమైనా తేడా కొడితే.. సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. స‌ర్కారును ఓడించే ప్ర‌మాదం ఉంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

మ‌రోవైపు ఏడుగురు సభ్యుల్నీ గెలిపించుకునే బలం తమకుందని అధికార పక్షం ధీమా వ్యక్తం చేస్తుంటే.. అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేసే ఎమ్మెల్యేలతో తమ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ గెలుస్తుందని టీడీపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఒక్కో అభ్యర్థి గెలుపు కోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు కావాల్సి ఉన్నందున.. విప్‌ లేకుండా జరిగే రహస్య బ్యాలెట్‌లో ఏ ఓటు ఎటు పడుతుందనే ఉత్కంఠ చర్చనీయాంశమైంది.

వైసీపీ సాంకేతికంగా 6 స్థానాలు మాత్రమే గెలుచుకునే బలం ఉన్నా 7 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టింది. అయితే, ఇటీవల 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన అధికార పార్టీ.. ఎమ్మెల్యే కోటా ఎన్నికను ప్రతిష్ఠాత్మ కంగా తీసుకుంది. అసంతృప్తి ఎమ్మెల్యేలపై ప్రత్యేక నిఘా పెట్టి క్రాసింగ్ ఓటింగ్ చేస్తారనే అనుమానం ఉన్నవారి లిస్ట్ తయారు చేసుకుని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తోంది. టీడీపీ సాంకేతికంగా ఒకటి గెలుచుకునే అవకాశం ఉన్నా.. నైతిక మద్దతు లేనికారణంతో తటపటాయిస్తోంది. ఎందుకంటే.. 23 మంది ఎమ్మెల్యేల్లో న‌లుగురు వైసీపీ శిబిరానికి అండ‌గా నిలిచారు.

ఒక్కొక్క‌రికీ 22 ఓట్లు చాలు!

ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యేల సంఖ్య, ఖాళీ స్థానాలకు అదనంగా ఒకటి జోడించి భాగించాల్సి ఉంది. ఈ లెక్కన మొత్తం శాసనసభ్యులున్న 175 సంఖ్యను 8తో భాగిస్తే ఒక్కో అభ్యర్థి గెలుపుకోసం 22 మొదటి ప్రాధాన్యం ఓట్లు అవసరం. ఏ ఇద్దరు అభ్యర్థులైనా 22 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించకపోతే.. రెండో ప్రాధాన్యత ఓట్లు కీలకం కానున్నాయి. టీడీపీ అభ్యర్థికి రెండో ప్రాధాన్యత ఓట్లు పడే అవకాశం లేనప్పటికీ.. అధికార పార్టీ నుంచి ఒక్క ఓటు క్రాస్ అయినా అభ్యర్థి గెలుపు లాంఛనమేన‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

గొడవలతో భార్యతో మాట్లాడకపోతే గృహ హింస కాదు

గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…

1 hour ago

ప్రభాస్ సినిమా పోతుందని ముందే తెలుసట

‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…

4 hours ago

లెనిన్ మీద మెగాభిమానుల గుస్సా

అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…

6 hours ago

చిరుకు తండ్రిగా గ‌ర్వం… న‌టుడిగా క‌ష్టం

రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే తాను తండ్రికి త‌గ్గ త‌న‌యుడిని అని చాటుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇక…

7 hours ago

పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి స‌వాల్‌గా కేసు!

ఏపీ ప్ర‌భుత్వానికి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసుల‌కు కూడా ఓ కేసు స‌వాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…

8 hours ago

కంగనా క్రేజ్ మటాష్

ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…

9 hours ago