Political News

రాహుల్ ఎఫెక్ట్‌: మోడీ బిగ్ ప్లాన్‌

“భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం లేదు. ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కుతున్నారు. మీడియా గ‌ళానికీ తాళం వేస్తున్నారు. నియంతృత్వ పాలనకు ప్ర‌తీక‌గా మారింది” అని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. దాదాపు 20 రోజుల కింద‌ట బ్రిట‌న్‌లో చేసిన వ్యాఖ్య‌లు.. భార‌త్ లో ముఖ్యంగా పార్ల‌మెంటులో మంట‌లు రేపిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై రాహుల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ దాదాపు వారం రోజులుగా ఎలాంటి కార్య‌క్ర‌మాలూ జ‌ర‌గ‌కుండా.. పోయింది. కానీ, రాహుల్ మాత్రం క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేదు.

అయితే.. విశ్వ‌గురువుగా భార‌త్‌ను ప్ర‌పంచ దేశాల్లో ఆవిష్క‌రిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి రాహుల్ వ్యాఖ్య‌ల ఎఫెక్ట్ బాగానే త‌గిలింది. చైనా ప‌త్రిక‌లు.. రాహుల్ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. ఇటీవల ప‌తాక వార్త‌లు రాశాయి. నిజానికి బ్రిట‌న్ మీడియా బీబీసీ.. గుజ‌రాత్ అల్ల‌ర్ల‌ను కేంద్రంగా చేసుకుని మోడీ ప‌రువు తీసేసింద‌ని.. బీజేపీ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న నేప‌థ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత‌గా మోడీ ని ప్ర‌పంచ దేశాల ముందు ఇరుకున ప‌డేశాయి. దీంతో రాహుల్‌తోనే క్ష‌మాప‌ణ‌లు చెప్పించ‌డం ద్వారా.. ఏదో ఒక‌ర‌కంగా ఈ న‌ష్టం నుంచి బ‌య‌ట ప‌డాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నించింది.

కానీ, రాహుల్ త‌న ప‌ట్టు వీడ‌లేదు. దీంతో ఇప్పుడు బీజేపీ స‌హా ప్ర‌ధాని మోడీ.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ధాని మోడీ గ‌ళం వినిపించేలా ప్లాన్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ రేడియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్స‌ 100వ ఎడిసోడ్ ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కానుంది. ఇందుకోసం బీజేపీ భారీ సన్నాహాలు చేస్తోంది.

పైకి ఏం చెబుతున్నారంటే..

”ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు గ్లోబల్ నేత. ఆ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం ప్రసారం చేయనున్నాం. మోడీ పనితీరును ప్రపంచ దేశాలన్నీ అభినందిస్తున్నాయి. ప్రజలు ఆయన మాటలను వినాలనుకుంటున్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సాధ్యమైనన్ని దేశాల్లో ప్రసారం చేయడమే మా లక్ష్యం” అని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 100 ప్రాంతాల్లో 100 మంది చొప్పున కూర్చుని ప్రధాని మన్‌కీ బాత్ వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రంగాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, ఇతర వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే.. ఈ సారి స్థానిక అంశాలు అంటే దేశీయ అంశాలు కాకుండా..రాహుల్ స‌హా.. బీబీసీకి కౌంట‌ర్ ఇచ్చే అంశాలు ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మొత్తానికీ ఈ ప్లాన్ కోసం.. ప్ర‌ధాని మూడు రోజులుగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇది.. వ‌చ్చే ఆదివారం ప్ర‌సారం కానుంది.

This post was last modified on March 23, 2023 7:20 am

Share

Recent Posts

అనుప‌మ ఆ రోజు ఏడ్చింది అందుకా?

గ‌త కొన్ని రోజులుగా మ‌ల‌యాళ క‌థానాయిక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ్రేకప్ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే.…

3 hours ago

తమిళ ప్రేక్షకుల ప్రేమ ఎందుకు తక్కువంటే

తాజాగా విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగులో చూపిస్తున్న జోరు తమిళంలో ప్రదర్శించడం లేదన్నది వాస్తవం. ఓపెనింగ్స్ నెంబర్లు పోల్చుకుని…

3 hours ago

సోష‌ల్ మీడియా ఎటాక్… ఫరియా క‌న్నీళ్లు

జాతిర‌త్నాలు సినిమాతో మంచి గుర్తింపు సంపాదించి, తెలుగులో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్న క‌థానాయిక‌.. ఫ‌రియా అబ్దుల్లా. థియేట‌ర్ బ్యాగ్రౌండ్ నుంచి…

5 hours ago

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5…

5 hours ago

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

6 hours ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

6 hours ago