Political News

రాహుల్ ఎఫెక్ట్‌: మోడీ బిగ్ ప్లాన్‌

“భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం లేదు. ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్కుతున్నారు. మీడియా గ‌ళానికీ తాళం వేస్తున్నారు. నియంతృత్వ పాలనకు ప్ర‌తీక‌గా మారింది” అని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ.. దాదాపు 20 రోజుల కింద‌ట బ్రిట‌న్‌లో చేసిన వ్యాఖ్య‌లు.. భార‌త్ లో ముఖ్యంగా పార్ల‌మెంటులో మంట‌లు రేపిన విష‌యం తెలిసిందే. అయితే.. దీనిపై రాహుల్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని బీజేపీ పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తోంది. పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ దాదాపు వారం రోజులుగా ఎలాంటి కార్య‌క్ర‌మాలూ జ‌ర‌గ‌కుండా.. పోయింది. కానీ, రాహుల్ మాత్రం క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌లేదు.

అయితే.. విశ్వ‌గురువుగా భార‌త్‌ను ప్ర‌పంచ దేశాల్లో ఆవిష్క‌రిస్తున్న ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి రాహుల్ వ్యాఖ్య‌ల ఎఫెక్ట్ బాగానే త‌గిలింది. చైనా ప‌త్రిక‌లు.. రాహుల్ వ్యాఖ్య‌ల‌ను కోట్ చేస్తూ.. ఇటీవల ప‌తాక వార్త‌లు రాశాయి. నిజానికి బ్రిట‌న్ మీడియా బీబీసీ.. గుజ‌రాత్ అల్ల‌ర్ల‌ను కేంద్రంగా చేసుకుని మోడీ ప‌రువు తీసేసింద‌ని.. బీజేపీ స‌హా కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తున్న నేప‌థ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు మ‌రింత‌గా మోడీ ని ప్ర‌పంచ దేశాల ముందు ఇరుకున ప‌డేశాయి. దీంతో రాహుల్‌తోనే క్ష‌మాప‌ణ‌లు చెప్పించ‌డం ద్వారా.. ఏదో ఒక‌ర‌కంగా ఈ న‌ష్టం నుంచి బ‌య‌ట ప‌డాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నించింది.

కానీ, రాహుల్ త‌న ప‌ట్టు వీడ‌లేదు. దీంతో ఇప్పుడు బీజేపీ స‌హా ప్ర‌ధాని మోడీ.. వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌ధాని మోడీ గ‌ళం వినిపించేలా ప్లాన్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ రేడియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్స‌ 100వ ఎడిసోడ్ ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ప్రసారం కానుంది. ఇందుకోసం బీజేపీ భారీ సన్నాహాలు చేస్తోంది.

పైకి ఏం చెబుతున్నారంటే..

”ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పుడు గ్లోబల్ నేత. ఆ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం ప్రసారం చేయనున్నాం. మోడీ పనితీరును ప్రపంచ దేశాలన్నీ అభినందిస్తున్నాయి. ప్రజలు ఆయన మాటలను వినాలనుకుంటున్నారు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమాన్ని సాధ్యమైనన్ని దేశాల్లో ప్రసారం చేయడమే మా లక్ష్యం” అని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో 100 ప్రాంతాల్లో 100 మంది చొప్పున కూర్చుని ప్రధాని మన్‌కీ బాత్ వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా రంగాలకు చెందిన డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, సామాజిక కార్యకర్తలు, ఇతర వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే.. ఈ సారి స్థానిక అంశాలు అంటే దేశీయ అంశాలు కాకుండా..రాహుల్ స‌హా.. బీబీసీకి కౌంట‌ర్ ఇచ్చే అంశాలు ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మొత్తానికీ ఈ ప్లాన్ కోసం.. ప్ర‌ధాని మూడు రోజులుగా క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం. ఇది.. వ‌చ్చే ఆదివారం ప్ర‌సారం కానుంది.

This post was last modified on March 23, 2023 7:20 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మహిళా కమిషన్ నుండి ఎమ్మెల్యే టికెట్ వైపు?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ ప‌ర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…

39 minutes ago

సునీల్ వ‌ర్సెస్ RRR.. మ‌రింత ముదిరిందిగా!

ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న సునీల్‌కు రఘురామకు…

4 hours ago

`న‌వ` నాయ‌కులు… టీడీపీకి ప్ల‌స్సా-మైన‌స్సా.. !

టీడీపీలో నాయ‌కులు.. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోనే మెలుగుతున్నారా?  ఆయ‌న చెప్పిన‌ట్టే చేస్తున్నారా? అంటే.. మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…

7 hours ago

చ‌క్క‌ని అవ‌కాశం చేజార్చుకున్న వైసీపీ!

అవ‌కాశాలు.. అదృష్టాలు.. ప‌దే ప‌దే రావ‌ని అంటారు. అవి వ‌చ్చిన‌ప్పుడు వాటిని స‌ద్వినియోగం చేసుకునేందుకు వ్య‌క్తులైనా పార్టీలైనా.. ఎవ‌రైనా స‌రే..…

10 hours ago

ఈసారి కష్టపడి ఓడిన చెన్నై… పంజాబ్ పవర్ఫుల్ గేమ్

ఐపీఎల్ 2026 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు అస్సలు కలిసి రావడం లేదు. వరుసగా రెండో ఓటమిని…

11 hours ago

విజ‌య్‌ని డీగ్రేడ్ చేసేలా పొలిటిక‌ల్ మూవీ?

ఎన్నిక‌లు స‌మీపిస్తున్నపుడు కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎలివేష‌న్లు ఇస్తూ సినిమాలు వ‌స్తుంటాయి. అలాగే కొంద‌రు నేత‌ల‌ను టార్గెట్ చేస్తూ మూవీస్…

11 hours ago