Political News

విడదల రజినిపై నందమూరి కుటుంబం నుంచి పోటీ

ఏపీ మంత్రి విడదల రజిని వచ్చే ఎన్నికలలో గట్టి పోటీ ఎదుర్కొనక తప్పేలాలేదు. మర్రి రాజశేఖర్‌కు రీసెంటుగా ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వడంతో వచ్చే ఎన్నికలలో విడదల రజినికి చిలకలూరిపేట సీటు గ్యారంటీ అని తేలిపోయింది. దీంతో ఆమె టికెట్ విషయంలో ఉన్న అనుమానాలన్నీ పటాపంచలై ఫ్రీ అయిపోయారు.

టీడీపీ నుంచి పాత ప్రత్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుకే టికెట్ వస్తుందన్న లెక్కలలో ఉంటూ అందుకు తగ్గ వ్యూహాలు రచిస్తూ వెళ్తున్నారు. అయితే… ఇప్పుడు టీడీపీ అభ్యర్థి మారొచ్చన్న సంకేతాలు వస్తుండడంతో పాటు టీడీపీ అభ్యర్థి నందమూరి కుటుంబానికి చెందినవారు కావొచ్చన్న ప్రచారం జరుగుతుండడంతో విడదల రజినికి కొత్త టెన్షన్ మొదలైందట.

నందమూరి హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని వచ్చే ఎన్నికలలో టీడీపీ తరఫున చిలకలూరిపేట నియోజకవర్గంలో పోటీ చేస్తారని తాజాగా వినిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ ఇప్పటికే దౌత్యం నెరపడంతో చంద్రబాబు కూడా అంగీకరించారని.. ప్రత్తిపాటికి రాజ్యసభ పదవి కానీ, ఎమ్మెల్సీ కానీ ఇచ్చి సుహాసినిని చిలకలూరిపేట నుంచి పోటీచేయించడానికి అంగీకరించారని వినిపిస్తోంది.

ఇదే నిజమైతే విడదల రజినికి గట్టి పోటీ తప్పదు. ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకతకు నందమూరి ఫ్యామిలీ అభ్యర్థి తోడైతే టీడీపీ విజయాన్ని ఆపడం సాధ్యంకాదని స్థానికంగా వినిపిస్తోంది. చిలకలూరిపేటలో కమ్మ ఓట్లు పెద్దసంఖ్యలో ఉన్నాయి. సోమేపల్లి సాంబయ్య, మర్రి రాజశేఖర్, ప్రత్తిపాటి పుల్లారావు వంటి కమ్మ సామాజికవర్గ నేతలే ఇక్కడ దశాబ్దాలుగా గెలుస్తూ వచ్చారు. గత ఎన్నికలలో మాత్రమే ముదిరాజ్ కులానికి చెందిన విడదల రజిని ఇక్కడ విజయం సాధించారు. ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ ప్రతిసారీ కమ్మ నేతలకే టికెట్లు ఇస్తాయి. గత ఎన్నికల్లో ముదిరాజ్ కులానికి చెందిన విడదల రజినికి టికెట్ ఇవ్వగా జగన్ వేవ్‌లో ఆమె విజయం సాధించారు.

ప్రస్తుతం పల్నాడు జిల్లా పరిధిలోకి వచ్చిన చిలకలూరిపేట నియోజకవర్గంలో కమ్మ ఓట్ల తరువాత ముస్లిం ఓట్లు కూడా కీలకమే. ఇక్కడి ముస్లిం ఓటర్లు మొదటి నుంచి కాంగ్రెస్ మద్దతుదారులుకాగా గత ఎన్నికలో వైసీపీకి ఓట్లేశారు. అయితే.. వైసీపీ కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతుండడంతో విద్యావంతులైన ముస్లింలు చాలామంది వైసీపీకి దూరమైనట్లు స్థానికంగా వినిపిస్తోంది.

ఈ అన్ని సమీకరణల నేపథ్యంలో కమ్మ కులానికి చెందిన నందమూరి సుహాసినికి టీడీపీ ఇక్కడ టికెట్ ఇస్తే విడదల రజినికి కష్టమవుతుంది. అయితే… ఎన్నికలు సమీపించేవరకు సుహాసిని అభ్యర్థిత్వాన్ని ప్రకటించరాదని.. అలా ప్రకటిస్తే వైసీపీ వ్యూహం మార్చుకోవచ్చని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు దగ్గరలో చిలకలూరిపేట అభ్యర్థిగా సుహాసిని పేరు ప్రకటిస్తారని వినిపిస్తోంది.

This post was last modified on March 22, 2023 12:57 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 సీట్లు ఎలా వచ్చాయన్నదానిపై కోటి సంతకాలు చేయించాలి

ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్‌లైన్‌ను మళ్లీ…

34 minutes ago

రాజా సాబ్ సంగీతానికి అభిమానుల సూచనలు

సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…

1 hour ago

అమరావతి రైతులు… హ్యాపీనా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో కీల‌క స‌మ‌స్య‌గా ఉన్న రైతుల అంశాన్ని ప్ర‌భుత్వం దాదాపు ప‌రిష్క‌రించింది. ముగ్గురు స‌భ్యుల‌తో కూడిన క‌మిటీని…

3 hours ago

కోటి సంతకాలు తెస్తాం.. ఒక్క సంతకం పెట్టండి!

రాష్ట్రంలో కొత్త మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…

5 hours ago

అక్కడ మెస్సీ అభిమానుల విధ్వంసం.. ఇక్కడి మ్యాచ్ పై ఉత్కంఠ!

కోల్‌కతా సాల్ట్‌లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…

6 hours ago

శుక్రవారం రికార్డును తొక్కి పడేసింది

బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…

6 hours ago