Political News

23 టెన్షన్ పెరిగిపోతోందా ?

గురువారం అంటే 23వ తేదీన జరగాల్సిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలు రెండు పార్టీల్లో టెన్షన్ పెంచేస్తోందా ? పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎంఎల్ఏ కోటాలో భర్తీ కావాల్సిన ఏడు ఎంఎల్సీ స్దానాలకు గురువారం పోలింగ్ జరగబోతోంది. మామూలుగా అయితే సంఖ్యా బలాన్ని చూసుకుంటే ఏడుస్ధానాలను వైసీపీ ఏకగ్రీవంగా ఖాతాలో వేసుకోవాలి. కానీ చివరి నిముషంలో టీడీపీ పోటీలోకి దిగటంతో ఎన్నిక అనివార్యమైంది.

గెలుపుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ పోటీకి దిగటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోటీకి దిగటానికి కారణం ఏమిటంటే వైసీపీలోని అసంతృప్త ఎంఎల్ఏలే కారణమని తెలుస్తోంది. ప్రతి ఎంఎల్సీకి 22 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. ఈ లెక్కన చూస్తే టీడీపీకి ఉన్నది 19 మంది ఎంఎల్ఏలే. 23 మంది ఎంఎల్ఏలు గెలిచినా తర్వాత నలుగురు ఎంఎల్ఏలు దూరమైపోయారు. కాబట్టి దూరమైన ఎంఎల్ఏల ఓట్లు రావని అందరికీ తెలిసిందే.

అందుకనే వైసీపీ ఎంఎల్ఏలపైన టీడీపీ గురిపెట్టింది. ఇప్పటికే అధికారపార్టీలో ఇద్దరు ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రెబల్సుగా తయారయ్యారు. వీళ్ళు వైసీపీ అభ్యర్ధులకే ఓట్లేస్తారా లేకపోతే టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేస్తారా అన్నది సస్పెన్సుగా మారింది. వీళ్ళిద్దరు ఓట్లేసినా టీడీపీ గెలవదు. అందుకనే జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న ఎంఎల్ఏలు ఎవరైనా ఉన్నారా అని వెదుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో భాగంగా వైసీపీ ఓట్లకోసం టీడీపీ గాలమేస్తుంటే తమ ఓట్లను కాపాడుకునేందుకు వైసీపీ అవస్తలు పడుతోంది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలై సాయంత్రం 4 గంటలకు ముగిసేంతవరకు రెండు పార్టీల్లో ఈ టెన్షన్ తగ్గేట్లులేదు. ఎంఎల్ఏలతో క్యాంపులు నిర్వహించటం లేదుకానీ దాదాపు అంత పనీ చేస్తున్నాయట రెండుపార్టీలు. సమయం దగ్గర పడుతున్నకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే ఆ పార్టీకి వచ్చే నష్టమేమీలేదు. ఇదే సమయంలో వైసీపీ నుండి రెబల్ ఎంఎల్ఏల ఓట్లు కాకుండా మరో ఓటు అదనంగా క్రాస్ అయినా జగన్ కు ఇబ్బందులు తప్పవు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on March 22, 2023 12:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

11 minutes ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

26 minutes ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

35 minutes ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

48 minutes ago

కొడాలి రీప్లేస్.. ఖాయమంటున్న కేడర్..!

కొడాలి నాని. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ హయాంలో ప్రత్యర్థులు ఆయనకు “బూతుల మంత్రి” అనే…

1 hour ago

నేరుగా వంటింటికే.. రైతు బజార్!

డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం ఆన్‌లైన్ రైతు బజార్‌ను ప్రారంభించింది. పైలట్ ప్రాజెక్ట్‌గా విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ రైతు బజార్…

2 hours ago