Political News

23 టెన్షన్ పెరిగిపోతోందా ?

గురువారం అంటే 23వ తేదీన జరగాల్సిన ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికలు రెండు పార్టీల్లో టెన్షన్ పెంచేస్తోందా ? పార్టీల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ఎంఎల్ఏ కోటాలో భర్తీ కావాల్సిన ఏడు ఎంఎల్సీ స్దానాలకు గురువారం పోలింగ్ జరగబోతోంది. మామూలుగా అయితే సంఖ్యా బలాన్ని చూసుకుంటే ఏడుస్ధానాలను వైసీపీ ఏకగ్రీవంగా ఖాతాలో వేసుకోవాలి. కానీ చివరి నిముషంలో టీడీపీ పోటీలోకి దిగటంతో ఎన్నిక అనివార్యమైంది.

గెలుపుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ పోటీకి దిగటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పోటీకి దిగటానికి కారణం ఏమిటంటే వైసీపీలోని అసంతృప్త ఎంఎల్ఏలే కారణమని తెలుస్తోంది. ప్రతి ఎంఎల్సీకి 22 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. ఈ లెక్కన చూస్తే టీడీపీకి ఉన్నది 19 మంది ఎంఎల్ఏలే. 23 మంది ఎంఎల్ఏలు గెలిచినా తర్వాత నలుగురు ఎంఎల్ఏలు దూరమైపోయారు. కాబట్టి దూరమైన ఎంఎల్ఏల ఓట్లు రావని అందరికీ తెలిసిందే.

అందుకనే వైసీపీ ఎంఎల్ఏలపైన టీడీపీ గురిపెట్టింది. ఇప్పటికే అధికారపార్టీలో ఇద్దరు ఎంఎల్ఏలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి రెబల్సుగా తయారయ్యారు. వీళ్ళు వైసీపీ అభ్యర్ధులకే ఓట్లేస్తారా లేకపోతే టీడీపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేస్తారా అన్నది సస్పెన్సుగా మారింది. వీళ్ళిద్దరు ఓట్లేసినా టీడీపీ గెలవదు. అందుకనే జగన్మోహన్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న ఎంఎల్ఏలు ఎవరైనా ఉన్నారా అని వెదుకుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో భాగంగా వైసీపీ ఓట్లకోసం టీడీపీ గాలమేస్తుంటే తమ ఓట్లను కాపాడుకునేందుకు వైసీపీ అవస్తలు పడుతోంది. గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలింగ్ మొదలై సాయంత్రం 4 గంటలకు ముగిసేంతవరకు రెండు పార్టీల్లో ఈ టెన్షన్ తగ్గేట్లులేదు. ఎంఎల్ఏలతో క్యాంపులు నిర్వహించటం లేదుకానీ దాదాపు అంత పనీ చేస్తున్నాయట రెండుపార్టీలు. సమయం దగ్గర పడుతున్నకొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే టీడీపీ ఓడిపోతే ఆ పార్టీకి వచ్చే నష్టమేమీలేదు. ఇదే సమయంలో వైసీపీ నుండి రెబల్ ఎంఎల్ఏల ఓట్లు కాకుండా మరో ఓటు అదనంగా క్రాస్ అయినా జగన్ కు ఇబ్బందులు తప్పవు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

Satya

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

21 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago