Political News

జగనన్నకిది హెచ్చరికా ?

వాపును బలుపుగా అనుకుని జగన్ బొక్కబోర్లా పడ్డారు. సాధారణంగా ఎక్కడైనా గెలిస్తే భారీ విజయమంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం వైసీపీకి భారీ పరాజయమని చెప్పుకోవాలి. మూడింటికి మూడు ఓడిపోవడమంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్యూర్ అవుతుంది. అదీ జగన్ కూడా ఊహించి ఉండకపోవచ్చు. లేని పక్షంలో ఎంత ఖర్చు చేసిన ఫర్వాలేదు… మునుగోడు తరహాలో విజయం సాధించాలని ఆదేశించి ఉండే వారు..

పెత్తందార్లే సమస్య

ప్రస్తుతం వైసీపీలో పెత్తందార్లు ఎక్కువగా ఉన్నారని చెబుతున్నారు. పని చేసే వారి కంటే కూర్చుని పని చేయించాలనుకునే వారే ఎక్కువగా ఉంటడంతో క్షేత్ర స్థాయిలోకి ఎవరూ వెళ్లడం లేదని తేలిపోయింది. కార్యకర్తలతో కనెక్షన్ కట్ అయిపోయింది. ముందే కింది స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. జగన్ ఛరిస్మా మీద గెలిచిన ఎన్నికలనే ప్రాతిపదికగా తీసుకుని నేతలు పెత్తనాలు చేస్తూ వచ్చారు. కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలను ఉత్తేజ పరిచేందుకు కావాల్సిందేమిటో, కొత్తగా కార్యకర్తలను చేర్చుకునేందుకు చేయాల్సిందేమిటో ఆలోచించనే లేదు. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం మూట గట్టుకుంది..

జాగ్రత్త పడే అవకాశం…

అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చావు దెబ్బ తగిలిందనుకోవాలి. ఈ పరాజయాన్ని ఒక హెచ్చరికగా తీసుకునే అవకాశం, సమయమూ కలిగిందనుకోవాలి. పార్టీ బలాలు, బలహీనతలు లెక్కలేసుకుని అన్ని వర్గాల్లో నెలకొన్న అసంతృప్తిని దూరం చేసేందుకు ప్రయత్నించే వెసులుబాటును వైసీపీకి ఈ ఎన్నికలు కలిగించాయి. క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పులు సరిదిద్దుకునే అవకాశమూ ఈ ఎన్నికలు కల్పించాయి. పాపులిస్టు పథకాలు గెలిపించలేవని మరో సారి నిరూపితమైనందున విశాల జనహితానికి అవసరమైన కార్యక్రమాలు ఇప్పటికైనా చేపట్టాలి. రాష్ట్రాన్ని పీకల్లోతు అప్పుల్లో ముంచారన్న సంగతి గుర్తించి ఆ భారాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను ఇకనైనా చల్లబరిచేందుకు ప్రయత్నించాలి. అప్పుడే వచ్చే ఎన్నికల్లో పరువైనా దక్కుతుంది.

ఏదేమైనా బంతి జగన్ కోర్టులో ఉంది. దాన్ని ఎటు కొడతారో ఆయన ఇష్టం. లేకపోతే అంతా కష్టం..

This post was last modified on March 20, 2023 10:29 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

33 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago