టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. సీఎం జగన్ దూకుడుపై ఆయన మండిపడ్డారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచినా కూడా.. అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఇవ్వలేదు. అంతేకాదు.. అర్ధరాత్రి అరెస్టులు చేయించారు.
ఏకంగా ఎన్నికల్లో గెలిచినట్టుగా ప్రకటించిన టీడీపీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డిని సైతం అరెస్టు చేయించారు. ఈ పరిణామాలు స్థానికంగా కాక రేపాయి. ఒకవైపు టీడీపీ సంబరాల్లో ఉన్న సమయంలో మరోవైపు.. ఇలా అరెస్టు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే.. తాజాగా ఈ ఘటనపై రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం బతుకయ్యా నీది జగన్ రెడ్డీ. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుపడతావా? పులి వెందుల టీడీపీ నేత రాంగోపాల్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడని అరెస్టు చేస్తావా? ఇంతకన్నా నువ్వు ఇంకేం భ్రష్టు పట్టి పోవాల్సి ఉంది. ప్రజాతీర్పును గౌరవించి క్షమాపణలు కోరు!అని చంద్రబాబు చండ్ర నిప్పులు కురిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
This post was last modified on March 19, 2023 5:18 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…