టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. సీఎం జగన్ దూకుడుపై ఆయన మండిపడ్డారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచినా కూడా.. అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఇవ్వలేదు. అంతేకాదు.. అర్ధరాత్రి అరెస్టులు చేయించారు.
ఏకంగా ఎన్నికల్లో గెలిచినట్టుగా ప్రకటించిన టీడీపీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డిని సైతం అరెస్టు చేయించారు. ఈ పరిణామాలు స్థానికంగా కాక రేపాయి. ఒకవైపు టీడీపీ సంబరాల్లో ఉన్న సమయంలో మరోవైపు.. ఇలా అరెస్టు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే.. తాజాగా ఈ ఘటనపై రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం బతుకయ్యా నీది జగన్ రెడ్డీ. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుపడతావా? పులి వెందుల టీడీపీ నేత రాంగోపాల్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడని అరెస్టు చేస్తావా? ఇంతకన్నా నువ్వు ఇంకేం భ్రష్టు పట్టి పోవాల్సి ఉంది. ప్రజాతీర్పును గౌరవించి క్షమాపణలు కోరు!అని చంద్రబాబు చండ్ర నిప్పులు కురిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
This post was last modified on March 19, 2023 5:18 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…