టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. సీఎం జగన్ దూకుడుపై ఆయన మండిపడ్డారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచినా కూడా.. అధికారులు ఆయనకు డిక్లరేషన్ ఇవ్వలేదు. అంతేకాదు.. అర్ధరాత్రి అరెస్టులు చేయించారు.
ఏకంగా ఎన్నికల్లో గెలిచినట్టుగా ప్రకటించిన టీడీపీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డిని సైతం అరెస్టు చేయించారు. ఈ పరిణామాలు స్థానికంగా కాక రేపాయి. ఒకవైపు టీడీపీ సంబరాల్లో ఉన్న సమయంలో మరోవైపు.. ఇలా అరెస్టు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అయితే.. తాజాగా ఈ ఘటనపై రియాక్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏం బతుకయ్యా నీది జగన్ రెడ్డీ. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థికి డిక్లరేషన్ ఇవ్వకుండా అడ్డుపడతావా? పులి వెందుల టీడీపీ నేత రాంగోపాల్రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచాడని అరెస్టు చేస్తావా? ఇంతకన్నా నువ్వు ఇంకేం భ్రష్టు పట్టి పోవాల్సి ఉంది. ప్రజాతీర్పును గౌరవించి క్షమాపణలు కోరు!
అని చంద్రబాబు చండ్ర నిప్పులు కురిపించడం గమనార్హం. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.
This post was last modified on March 19, 2023 5:18 pm
నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్నా అదిగో ఇదిగో అనడమే తప్ప హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజనే సంగతి ఎంతకీ తేలక అభిమానులు దాని…
అవును. అల్లరి నరేష్ తో పాటు ఈ శుక్రవారం వస్తున్న పోటీ సినిమాలకు టాలీవుడ్ ఇదే విన్నపం చేస్తోంది. చాలా…
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల పోరు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య నిప్పులు చెరుగుకునే…
కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…
జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…