స్థానికసంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్ర ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో వైసీపీ కీలకమైన పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో ఘోర పరాజయం చవి చూసింది. ఇక, శాసన మండలిలో టీడీపీ గళం వినిపించదు.. అని భావించిన వైసీపీ.. ఇప్పుడు మూడు స్థానాల్లో టీడీపీ గెలుపు గుర్రం ఎక్కి.. వైసీపీ నేతలు భారీ ఎత్తున చతికిల పడిన దరిమిలా.. ఈ నెల 23న నిర్వహించనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎమ్మెల్యే కోటా కింద 7 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి.
మొత్తం ఏడుగురిని గెలిపించుకుని తీరాల్సిందేనని పార్టీ అధినేత సీఎం జగన్ భావిస్తున్నారు. గట్టి పంతం కూడా పట్టారు. ఇప్పటికే బీసీలకు ఎక్కువ స్థానాలు ఇచ్చామని.. చెప్పుకొంటున్న వైసీపీ వీరిని గెలిపించుకుని తీరాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. నిజానికి అసెంబ్లీలో సంఖ్యా బలం కూడా ఎక్కువగానే ఉంది. అయినప్పటికీ.. వైసీపీకి ఇప్పుడు రెబల్స్ బెడద.. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం రెండు కూడా ఇబ్బందిగా మారాయి. పైగా గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఘోర ఓటమి కూడా వైసీపీని కుంగదీసింది.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో తమ సత్తా చాటేందుకు వ్యూహ రచన రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పైకి కనిపిస్తున్న రెబల్స్ ఇద్దరే. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి. కానీ, పార్టీలో నివురుగప్పిన నిప్పులాగా మరింత మంది వ్యతిరేకులు ఉన్నారని పార్టీ అధినేత సీఎం జగన్ అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏ చిన్న తేడా వచ్చినా.. ఒక సీటు కోల్పోవడం ఖాయమనే అంచనాలు కూడా వేసుకుంటున్నారు.
మరోవైపు.. చంద్రబాబు ఇప్పటికే వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. ఆత్మప్రబోధాను సారం.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలంటూ.. వైసీపీ ఎమ్మెల్యే లను ఆయన కోరారు. కరడు గట్టిన వైసీపీ ఎమ్మెల్యేలను పక్కన పెడితే.. అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యే పైనే చంద్రబాబు వ్యూహాత్మకంగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే.. ఎవరు అసంతృప్తిగా ఉన్నారనేది మాత్రం గోప్యంగానే ఉంది. ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఫలితాలు రిపీట్ అవకుండా.. చూడాలని వైసీపీ అంచనా వేస్తోంది. మరి ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on March 19, 2023 8:21 am
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…