Political News

వైసీపీలో క‌డ‌ప‌.. కుదుపు!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎక్కడ ఏ జిల్లా ఎలా ఉన్నా.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప మాత్రం కంచు కోట‌. ఇక్క‌డ వైసీపీకి ఎదురులేద‌నే ప‌రిస్థితి ఉంది. 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ స్తానాలు(క‌డ‌ప‌, రాజంపేట‌) స‌హా 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు జ‌రిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ జిల్లాతో ముడిప‌డిన రాయ‌ల‌సీమ తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ(క‌డ‌ప‌-అనంత‌పురం-క‌ర్నూలు) టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ముఖ్యంగా క‌డ‌ప ప‌రిధిలో నూ వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఆశించిన ఓట్లు ప‌డ‌లేదు. ఈ రెండు చోట్ల కూడా వారికి ఎదురుగాలి వీచింది. దీంతో క‌డ‌ప‌లో వైసీపీ పునాదులు క‌దులుతున్నాయా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటరు మూడ్‌ను తెలియజేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కడప జిల్లాలో 58,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పట్టభద్రుల ఓటింగ్‌ పరిశీలిస్తే ఓటర్‌ మూడేంటో ఇట్టే అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డబ్బు పంచి, అధికార బలం ఉపయోగించినా.. ప్రస్తుత పరిస్థితిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిని మరచి నవరత్నాలు నమ్ముకున్నామని, కేవలం బటన్‌ నొక్కడం వల్ల మా వెంటే ఉన్నారనుకున్నామనే భ్రమలో ఉన్నామని వాపోతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటరు తీరుతో జనం నాడి అర్థమవుతోందని… డేంజర్‌ బెల్స్‌ మోగినట్లేనని వైసీపీ నేతలు అంటున్నారు. ప్ర‌ధానంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోనే ఇలా జ‌ర‌గ‌డం ప‌ట్ల నాయ‌కులు ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్తితి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌రిచేసుకుంటారో లేదో చూడాలి.

This post was last modified on March 18, 2023 9:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

2 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

3 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

4 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

5 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

6 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

8 hours ago