Political News

వైసీపీలో క‌డ‌ప‌.. కుదుపు!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎక్కడ ఏ జిల్లా ఎలా ఉన్నా.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప మాత్రం కంచు కోట‌. ఇక్క‌డ వైసీపీకి ఎదురులేద‌నే ప‌రిస్థితి ఉంది. 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ స్తానాలు(క‌డ‌ప‌, రాజంపేట‌) స‌హా 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు జ‌రిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ జిల్లాతో ముడిప‌డిన రాయ‌ల‌సీమ తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ(క‌డ‌ప‌-అనంత‌పురం-క‌ర్నూలు) టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ముఖ్యంగా క‌డ‌ప ప‌రిధిలో నూ వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఆశించిన ఓట్లు ప‌డ‌లేదు. ఈ రెండు చోట్ల కూడా వారికి ఎదురుగాలి వీచింది. దీంతో క‌డ‌ప‌లో వైసీపీ పునాదులు క‌దులుతున్నాయా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటరు మూడ్‌ను తెలియజేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కడప జిల్లాలో 58,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పట్టభద్రుల ఓటింగ్‌ పరిశీలిస్తే ఓటర్‌ మూడేంటో ఇట్టే అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డబ్బు పంచి, అధికార బలం ఉపయోగించినా.. ప్రస్తుత పరిస్థితిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిని మరచి నవరత్నాలు నమ్ముకున్నామని, కేవలం బటన్‌ నొక్కడం వల్ల మా వెంటే ఉన్నారనుకున్నామనే భ్రమలో ఉన్నామని వాపోతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటరు తీరుతో జనం నాడి అర్థమవుతోందని… డేంజర్‌ బెల్స్‌ మోగినట్లేనని వైసీపీ నేతలు అంటున్నారు. ప్ర‌ధానంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోనే ఇలా జ‌ర‌గ‌డం ప‌ట్ల నాయ‌కులు ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్తితి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌రిచేసుకుంటారో లేదో చూడాలి.

Satya

Recent Posts

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

3 minutes ago

పాజిటివ్ టాక్ ఉన్నా పనవ్వడం లేదా

బాక్సాఫీస్ వద్ద లెనిన్ తప్ప జనాలకు వేరే ఆప్షన్ కనిపించడం లేదు. ఇతర కొత్త సినిమాలు విడుదలైనా వాటి గురించి…

4 minutes ago

బీఆర్ఎస్ `బ్లెడ్` పాలిటిక్స్‌.. ఇంత అవ‌స‌ర‌మా?

తెలంగాణ‌లో రైతుల‌ను ఆదుకునేందుకు ప్ర‌భుత్వం ముందుకు రావ‌డం లేద‌ని, ప్రాజెక్టుల‌కు నీటిని విడుద‌ల చేయ‌డం లేద‌ని ఆరోపిస్తూ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం…

22 minutes ago

నరరూప రాక్షసుడు రాజ్ కుమార్ మృతి

షాబాద్ లో ఆరుగురిని పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్ దారుణంగా హత్య చేసిన వైనం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన…

52 minutes ago

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

2 hours ago

వరుణ్ తేజ్ పూర్తిగా రూటు మార్చేశాడు

వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…

2 hours ago