Political News

వైసీపీలో క‌డ‌ప‌.. కుదుపు!

ఏపీ అధికార పార్టీ వైసీపీకి ఎక్కడ ఏ జిల్లా ఎలా ఉన్నా.. పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప మాత్రం కంచు కోట‌. ఇక్క‌డ వైసీపీకి ఎదురులేద‌నే ప‌రిస్థితి ఉంది. 2019లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రెండు ఎంపీ స్తానాలు(క‌డ‌ప‌, రాజంపేట‌) స‌హా 10 ఎమ్మెల్యే స్థానాల్లోనూ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అలాంటి ప‌రిస్థితి నుంచి ఇప్పుడు జ‌రిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఈ జిల్లాతో ముడిప‌డిన రాయ‌ల‌సీమ తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో మాత్రం వైసీపీ ఘోర ప‌రాజ‌యం పాలైంది.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ(క‌డ‌ప‌-అనంత‌పురం-క‌ర్నూలు) టీడీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ముఖ్యంగా క‌డ‌ప ప‌రిధిలో నూ వైసీపీ అభ్య‌ర్థుల‌కు ఆశించిన ఓట్లు ప‌డ‌లేదు. ఈ రెండు చోట్ల కూడా వారికి ఎదురుగాలి వీచింది. దీంతో క‌డ‌ప‌లో వైసీపీ పునాదులు క‌దులుతున్నాయా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఓటరు మూడ్‌ను తెలియజేశాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కడప జిల్లాలో 58,560 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పట్టభద్రుల ఓటింగ్‌ పరిశీలిస్తే ఓటర్‌ మూడేంటో ఇట్టే అర్థమవుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. డబ్బు పంచి, అధికార బలం ఉపయోగించినా.. ప్రస్తుత పరిస్థితిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అభివృద్ధిని మరచి నవరత్నాలు నమ్ముకున్నామని, కేవలం బటన్‌ నొక్కడం వల్ల మా వెంటే ఉన్నారనుకున్నామనే భ్రమలో ఉన్నామని వాపోతున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఓటరు తీరుతో జనం నాడి అర్థమవుతోందని… డేంజర్‌ బెల్స్‌ మోగినట్లేనని వైసీపీ నేతలు అంటున్నారు. ప్ర‌ధానంగా సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాలోనే ఇలా జ‌ర‌గ‌డం ప‌ట్ల నాయ‌కులు ఏమీ మాట్లాడ‌లేని ప‌రిస్తితి రావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి దీనిని వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి స‌రిచేసుకుంటారో లేదో చూడాలి.

This post was last modified on March 18, 2023 9:16 pm

Share
Show comments
Published by
Satya
Tags: YSRCP

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

44 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

47 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago