ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన పాలకొల్లు ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నాయకుడు నిమ్మల రామా నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన హెలెట్గా నిలిచారు. వాస్తవానికి బడ్జె ట్ ప్రసంగం రోజుకు ముందు రోజు.. ఆయనను, పయ్యావులకేశవ్ను కూడా సభ జరిగినన్నాళ్లు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. నిజానికి ఇలా సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు.. తీరిగ్గావారి పనులు చేసుకుంటారు.
తమ నియోజకవర్గాలకు వెళ్లినా వెళ్లకపోయినా.. ఇక, తమకు సభకు సంబంధం లేదన్నట్టుగా సస్పెండ్ అయిన వారు వ్యవహరిస్తారు. కానీ, నిమ్మల మాత్రం అలా వ్యవహరించలేదు. సభలో జరుగుతున్న కార్య క్రమాలను ఆయన ప్రత్యక్ష ప్రసారం చూశారు. వాటికి అనుగుణంగా ఆయన తన వ్యూహాలు ఏర్పాటు చేసుకుని ఒంటరిగానే ప్రభుత్వంపై దూకుడుగా వ్యవహరించారు.
వరుసగా ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొన్న నిమ్మల.. తాజాగా చేసిన నిరసన మొత్తంగా బిగ్ హిట్ కొట్టింది. తూర్పు కాపుల సమస్యలను ఆయన లేవనెత్తారు. నిజానికి మంత్రి బొత్స సత్యనారాయణ వంటివారు ఈ సామాజిక వర్గానికి చెందిన వారే. వీరి సమస్యలనే నిమ్మల ప్రస్తావించారు. తూర్పు కాపులను ఇతర జిల్లాల్లో బీసీలుగా పరిగణిస్తున్న ప్రభుత్వం ఒక్క ఉత్తరాంధ్రలో మాత్రం ఎందుకు వారిని ఓసీలుగా చూస్తోందని నిలదీశారు.
అసెంబ్లీ ఆవరణలోకి వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో అసెంబ్లీకి వచ్చిదారిలో చివరన ప్లకార్డు పట్టుకుని.. ఇదే విషయాన్ని మీడియాతోనూ మాట్లాడారు. సుమారుగా.. సభ కార్యక్రమాలు జరుగుతున్నంత సేపూ.. నిమ్మల ప్లకార్డును పట్టుకని నిలబడి.. నిరసన వ్యక్తం చేశారు. ఒకవైపు చినుకులు పడుతున్నా కూడా.. తను తడుస్తున్నా.. కూడా ఆయన పట్టించుకోకుండా.. ఈ నిరసనను కొనసాగించడం గమనార్హం. దీంతో దటీజ్ నిమ్మల!! అని టీడీపీ నేతలు ప్రశంసించారు.
This post was last modified on March 18, 2023 1:34 pm
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…