Political News

వైసీపీకి షాకిచ్చిన టీడీపీ

అధికార వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ అనూహ్యంగా షాకిచ్చింది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ ఎన్నికల్లో నాలుగు రైండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అందుబాటులోని సమాచారం ప్రకారం అన్నీ రౌండ్లలోను టీడీపీయే మంచి లీడ్ లో ఉంది. ఉత్తరాంధ్రలో మొత్తం 1.12 లక్షల ఓట్లున్నాయి. వీటిల్లో 4,644 ఓట్లు ఇన్ వాలీడ్ అయ్యాయి. మిగిలిన ఓట్లలో మొదటి రౌండ్ నుండి టీడీపీ అభ్యర్ధి చిరంజీవిరావుకు స్పష్టమైన ఆధిక్యత కనబడింది.

ఇక్కడ వైసీపీ, టీడీపీ, బీజేపీ, పీడీఎఫ్ అభ్యర్ధులు పోటీచేశారు. వీళ్ళమధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. అయితే అంతిమపోరాటం వైసీపీ-టీడీపీ మధ్యే అన్నట్లుగా తయారైంది. ఇందులో వైసీపీ అభ్యర్ధిగా రంగంలోకి దిగిన సీతంరాజు సుధాకర్ పై చిరంజీవి మంచి ఆధిక్యతతో కంటిన్యు అవుతున్నారు. ఇప్పటికి అయ్యింది నాలుగు రౌండ్లు మాత్రమే. ఇంకా లెక్కించాల్సిన రౌండ్లు చాలానే ఉన్నాయి. మళ్ళీ ఇందులో కూడా మొదటి ప్రాధానత్యని రెండో ప్రధాన్యతని ఇలా రకరకాల కాంబినేషన్లుంటాయి.

ఎంఎల్సీ గ్రాడ్యుయేట్, టీచర్ల ఓట్ల లెక్కింపు చాలా సంక్లిష్టంగా ఉంటుంది. మామూలుగా ఎంఎల్ఏ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులాగ కాదు. అందుకనే ఈ ఎన్నికల ఫలితం ఫైనల్ అయ్యేందుకు కనీసం 48 గంటలు పడుతుంది. మొదటి నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు అయ్యేసమయానికి చిరంజీవికి 49,512 ఓట్లొచ్చాయి. అలాగే సుధాకర్ కు 31,282 ఓట్లొచ్చాయి. అంటే చిరంజీవికి 18 వేల ఓట్ల స్పష్టమైన ఆధిక్యత కనబడుతోంది. అలాగే పీడీఎఫ్ అభ్యర్ధి రమాప్రభకు 18,110 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి మాధవ్ కు 5,193 ఓట్లు మాత్రమే వచ్చాయి.

నిజానికి తన గెలుపు ఖాయమని మాధవ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అలాంటిది నాలుగోస్ధానంలో ఉన్నారు. ఇదే సమయంలో వైసీపీని ఓడించటమే ధ్యేయంగా టీడీపీ-పీడీఎఫ్ పొత్తుపెట్టుకున్నాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికి వారు వేసుకునేట్లు, రెండో ప్రాధాన్యత ఓట్లు ఒక పార్టీ మరోపార్టీకి వేసేట్లు అనుకున్నారు. అయితే రెండుపార్టీల మధ్య ఓట్ల ట్రాన్సఫర్ జరిగినట్లు లేదు. ఎందుకంటే టీడీపీ అభ్యర్ధి మొదటిస్ధానంలో ఉంటే పీడీఎఫ్ అభ్యర్ధి మూడోస్ధానంలో నిలిచారు. అన్నీ రౌండ్లు పూర్తయ్యేసరికి ఏమవుతుందో  చూడాల్సిందే. 

This post was last modified on March 17, 2023 10:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

37 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

57 minutes ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago

నేనే ‘కింగ్’ అంటున్న దళపతి విజయ్

నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…

4 hours ago