లిక్కర్ స్కాం లో ఢిల్లీలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే ఏదో జరగబోతోందని మాత్రం అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో గురువారం కల్వకుంట్ల కవితను ఈడీ రెండో విడత విచారణ చేయబోతోంది. మొన్న 11వ తేదీన మొదటిసారి జరిగిన విచారణ దాదాపు తొమ్మిది గంటలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కవిత ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీసుకు చేరుకుంటారని సమాచారం.
విచారణ మొదలయ్యే సమయానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి చేరుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత విచారణ అంటేనే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ఢిల్లీకి వెళుతున్నదారు ? ఢిల్లీలో ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం కేసీఆర్ కూతురు కాబట్టే కవిత విచారణ సందర్భంగా ఇంతమంది ఇలా స్పందిస్తున్నారని అనుకోవాలి.
అసలు మొన్నటి 11వ తేదీనే కవితను ఈడీ అరెస్టు చేస్తుందని అందరు అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన హడావుడి ఆ విధంగా కనిపించింది. అందుకనే 10వ తేదీ హైదరాబాద్ లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో కేసీయార్ మాట్లాడుతూ కవితను ఈడీ అరెస్టు చేయవచ్చని ప్రకటించారు. దాంతో విచారణ విషయంలో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే ఆ రోజు అరెస్టు జరగలేదు. విచారణ ముగియగానే రాత్రికి రాత్రే కేటీయార్, హరీష్ తో కలిసి కవిత హైదరాబాద్ కు వచ్చేశారు.
అలాంటిది ఇపుడు మళ్ళీ కేటీయార్, హరీష్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నట్లు ? చూడబోతే యావత్ బీఆర్ఎస్ మొత్తం ఈడీపై మైండ్ గేమ్ ఆడుతోందా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. కవిత ఒంటరి కాదని మొత్తం బీఆర్ఎస్ అంతా తనకు మద్దతుగా ఉందని సంకేతాలు పంపుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతంలో దర్యాప్తసంస్ధలు మంత్రులు, ఎంపీలను విచారణ చేసినపుడు పార్టీ ఇలాంటి సంకేతాలు పంపలేదు. కవిత విషయంలో మాత్రం ఇలాంటి సంకేతాలు పంపుతోందని అర్ధమవుతోంది. మరి ఈడీ విచారణ సందర్భంగా ఏమిచేస్తుందో చూడాల్సిందే.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…