Political News

డిల్లీలో ఏమి జరుగుతోంది ?

లిక్కర్ స్కాం లో ఢిల్లీలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్ధం కావటం లేదు. అయితే ఏదో జరగబోతోందని మాత్రం అనుమానం పెరిగిపోతోంది. ఎందుకంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆఫీస్ లో గురువారం కల్వకుంట్ల కవితను ఈడీ రెండో విడత విచారణ చేయబోతోంది. మొన్న 11వ తేదీన మొదటిసారి జరిగిన విచారణ దాదాపు తొమ్మిది గంటలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న కవిత ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ ఆఫీసుకు చేరుకుంటారని సమాచారం.

విచారణ మొదలయ్యే సమయానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి చేరుకోబోతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులు ఢిల్లీకి చేరుకున్నారు. కవిత విచారణ అంటేనే మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ఢిల్లీకి వెళుతున్నదారు ? ఢిల్లీలో ఎందుకింత హడావుడి చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేవలం కేసీఆర్ కూతురు కాబట్టే కవిత విచారణ సందర్భంగా ఇంతమంది ఇలా స్పందిస్తున్నారని అనుకోవాలి.

అసలు మొన్నటి 11వ తేదీనే కవితను ఈడీ అరెస్టు చేస్తుందని అందరు అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన హడావుడి ఆ విధంగా కనిపించింది. అందుకనే 10వ తేదీ హైదరాబాద్ లో జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో కేసీయార్ మాట్లాడుతూ కవితను ఈడీ అరెస్టు చేయవచ్చని ప్రకటించారు. దాంతో విచారణ విషయంలో ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే ఆ రోజు అరెస్టు జరగలేదు. విచారణ ముగియగానే రాత్రికి రాత్రే కేటీయార్, హరీష్ తో కలిసి కవిత హైదరాబాద్ కు వచ్చేశారు.

అలాంటిది ఇపుడు మళ్ళీ కేటీయార్, హరీష్ ఢిల్లీకి ఎందుకు వెళుతున్నట్లు ? చూడబోతే యావత్ బీఆర్ఎస్ మొత్తం ఈడీపై మైండ్ గేమ్ ఆడుతోందా అనే సందేహాలు కూడా పెరిగిపోతున్నాయి. కవిత ఒంటరి కాదని మొత్తం బీఆర్ఎస్ అంతా తనకు మద్దతుగా ఉందని సంకేతాలు పంపుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గతంలో దర్యాప్తసంస్ధలు మంత్రులు, ఎంపీలను విచారణ చేసినపుడు పార్టీ ఇలాంటి సంకేతాలు పంపలేదు. కవిత విషయంలో మాత్రం ఇలాంటి సంకేతాలు పంపుతోందని అర్ధమవుతోంది. మరి ఈడీ విచారణ సందర్భంగా ఏమిచేస్తుందో చూడాల్సిందే.

This post was last modified on March 16, 2023 11:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

43 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

57 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago