నారా లోకేష్ పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. యువగళానికి అన్ని వర్గాల మద్దతు లభిస్తోంది. జగన్ ప్రభుత్వ తప్పిదాలను ప్రస్తావించడంతో పాటు టీడీపీ అధికారానికి వచ్చిన తర్వాత వాటిని ఎలా సరిదిద్దుతామో లోకేష్ వివరిస్తున్నారు. తమ హామిలు జనానికి గుర్తుండిపోయేలా శిలాఫలకాలు ఏర్పాటు చేస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోనే పాదయాత్ర 520 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. 40 రోజులకు పైగా ప్రయాణంలో 13 నియోజకవర్గాలు తిరిగింది. ప్రతీ చోట ప్రజాస్పందన పెల్లుబికింది. లోకేష్ ను చూసేందుకు జనం ఎగబడ్డారు.
వైసీపీ ప్రభుత్వం మాత్రం పాదయాత్రపై ఎప్పటికప్పుడు అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. పోలీసు, రెవెన్యూ సహా అన్ని శాఖలను యాత్రపైకి ఉసిగొల్పుతోంది.
40 రోజుల పాదయాత్రలో మొత్తం 22 కేసులు నమోదు చేశారు. అంటే సగటున రెండు రోజులకు ఒక కేసు పెట్టినట్లయ్యింది. 11 కేసులు పోలీసు శాఖే పెట్టింది. వీఆర్ఓల చేత మూడు కేసులు పెట్టించారు. తహసీల్దారు ఒక కేసు పెట్టారు. మరో కేసులో మున్సిపల్ కమీషనర్ , రెండు కేసుల్లో ఎంపీడీఓ , ఒక కేసులో గజిటెడ్ అఫీసర్ ఫిర్యాదు దారులుగా ఉన్నారు. విశేషమేమిటంటే అన్ని కేసుల్లోనూ ప్రధాన నిందితుడిగా లోకేషే ఉన్నారు. లోకేష్ ను ఇబ్బంది పెట్టేందుకే ఇలా చిల్లర కేసులు పెడుతున్నారని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి..
ఎన్నికేసులు పెట్టినా ప్రజల కోసం వాటిని భరిస్తానని లోకేష్ చెప్పుకుంటున్నారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అన్న ఆలోచనతోనే తాను యాత్రను ప్రారంభించానని, వైసీపీ కబంద హస్తాల నుంచి ఏపీ ప్రజలకు విముక్తి కలిగించడమే తన కర్తవ్యమని లోకేష్ అంటున్నారు. కేసులకు భయపడేవాళ్లమైతే ఎప్పుడో రాజకీయాల నుంచి తప్పుకునే వాళ్లమని లోకేష్ అంటున్నారు.
This post was last modified on March 11, 2023 11:12 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…