Political News

దెబ్బ‌కు ఠా!.. బాబు వ్యూహంతో ఆ ‘న‌లుగురి’కి ఉక్కిరిబిక్కిరే!!

దెబ్బ‌కు ఠా.. దొంగ‌ల ముఠా!! అన్న‌ట్టుగా.. చంద్ర‌బాబు వేసిన తాజా ఎత్తుతో.. టీడీపీకి చెందిన న‌లుగురు రెబ‌ల్ ఎమ్మెల్యేలు.. బిక్క‌చ‌చ్చిపోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్‌తో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వైసీపీ పంచ‌న చేరిపోయారు. జ‌గ‌న్‌కు అనుకూలంగా అజెండా భుజాన వేసుకున్నారు.

మ‌రికొంద‌రు.. ఏకంగా చంద్ర‌బాబు కుటుంబంపైనే విమ‌ర్శ‌లు గుప్పించారు. వీరిలో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల స‌భ్యుడు కరణం బలరాం, గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన మద్దాల గిరి, విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఉన్నారు. ఈ న‌లుగురు వైసీపీలో చేరినా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. అంతేకాదు.. వీరు.. అసెంబ్లీ లెక్క‌ల ప్రకారం.. ఫైనాన్స్ స్టేట్‌మెంట్స్ ప్ర‌కారం.. టీడీపీ స‌భ్యులుగానే వేత‌నాలు పొందుతున్నారు.

అయినప్ప‌టికీ.. చంద్ర‌బాబు వీరిపై ఎలాంటి చ‌ర్య‌లూ ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకోలేదు. కాని.. ఇప్పుడు బాబుకు కూడా ఛాన్స్ ద‌క్కింది. ఈ నెల 23న జ‌రిగే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని చంద్ర‌బాబు తాజాగా నిర్ణ‌యించారు. ఇదే జ‌రిగితే.. టీడీపీ అభ్య‌ర్థి గెలిచేందుకు 23 మంది ఎమ్మెల్యేలు అవ‌స‌రం. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ 23 మందినే గెలుచుకుంది.

సో.. ఇప్పుడు వారంతా టీడీపీ అభ్య‌ర్థికి అనుకూలంగా ఓటేస్తే.. మండ‌లిలో టీడీపీ తర‌ఫున ఒక అభ్య‌ర్థి అడుగు పెట్ట‌డంఖాయం. కానీ, ఆ న‌లుగురు పార్టీకి దూర‌మ‌య్యారు. దీంతో ఎన్నికల్లో పోటీకి దిగితే తెలుగుదేశం అందరికీ విప్ జారీ చేయాల‌ని భావిస్తోంది. ఫ‌లితంగా రెబ‌ల్ ఎమ్మెల్యేలు కూడా విప్‌కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది.

ఒకవేళ ఓటు వేయకుండా విప్‌ను ఉల్లంఘిస్తే.. ఆయా ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మ‌రోవైపు వైసీపీలో అస‌మ్మ‌తి స్వ‌రం వినిపించిన‌.. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వంటివారు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవ‌కాశం ఉంద‌ని చంద్ర‌బాబు లెక్క‌లు వేసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం బరిలోకి దిగితే ఎన్నిక రసవత్తరం కానుంది.

This post was last modified on March 10, 2023 12:22 pm

Share
Show comments

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

41 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago