దెబ్బకు ఠా.. దొంగల ముఠా!! అన్నట్టుగా.. చంద్రబాబు వేసిన తాజా ఎత్తుతో.. టీడీపీకి చెందిన నలుగురు రెబల్ ఎమ్మెల్యేలు.. బిక్కచచ్చిపోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్తో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు ఎన్నికలు ముగిసిన తర్వాత.. వైసీపీ పంచన చేరిపోయారు. జగన్కు అనుకూలంగా అజెండా భుజాన వేసుకున్నారు.
మరికొందరు.. ఏకంగా చంద్రబాబు కుటుంబంపైనే విమర్శలు గుప్పించారు. వీరిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, చీరాల సభ్యుడు కరణం బలరాం, గుంటూరు వెస్ట్ నుంచి గెలిచిన మద్దాల గిరి, విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఉన్నారు. ఈ నలుగురు వైసీపీలో చేరినా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదు. అంతేకాదు.. వీరు.. అసెంబ్లీ లెక్కల ప్రకారం.. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రకారం.. టీడీపీ సభ్యులుగానే వేతనాలు పొందుతున్నారు.
అయినప్పటికీ.. చంద్రబాబు వీరిపై ఎలాంటి చర్యలూ ఇప్పటి వరకు తీసుకోలేదు. కాని.. ఇప్పుడు బాబుకు కూడా ఛాన్స్ దక్కింది. ఈ నెల 23న జరిగే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరఫున అభ్యర్థిని నిలబెట్టాలని చంద్రబాబు తాజాగా నిర్ణయించారు. ఇదే జరిగితే.. టీడీపీ అభ్యర్థి గెలిచేందుకు 23 మంది ఎమ్మెల్యేలు అవసరం. గత ఎన్నికల్లో టీడీపీ 23 మందినే గెలుచుకుంది.
సో.. ఇప్పుడు వారంతా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటేస్తే.. మండలిలో టీడీపీ తరఫున ఒక అభ్యర్థి అడుగు పెట్టడంఖాయం. కానీ, ఆ నలుగురు పార్టీకి దూరమయ్యారు. దీంతో ఎన్నికల్లో పోటీకి దిగితే తెలుగుదేశం అందరికీ విప్ జారీ చేయాలని భావిస్తోంది. ఫలితంగా రెబల్ ఎమ్మెల్యేలు కూడా విప్కు అనుగుణంగా ఓటు వేయాల్సి ఉంటుంది.
ఒకవేళ ఓటు వేయకుండా విప్ను ఉల్లంఘిస్తే.. ఆయా ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయొచ్చని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. మరోవైపు వైసీపీలో అసమ్మతి స్వరం వినిపించిన.. కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వంటివారు ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉందని చంద్రబాబు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో తెలుగుదేశం బరిలోకి దిగితే ఎన్నిక రసవత్తరం కానుంది.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక సినిమాను గత ఏడాది అనౌన్స్ చేయడం గుర్తుండే…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…