Political News

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. క‌విత చేసిన త‌ప్పేంటి?

ప్ర‌స్తుతం తెలంగాణ‌కు చెందిన రాజ‌కీయ నాయ‌కురాలు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత పేరు ఊరూ వాడా మార్మోగుతోంది. ఢిల్లీలో వెలుగు చూసిన‌.. లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆమె పాత్ర ఉంద‌ని.. పేర్కొంటూ.. ఈడీ ఇప్ప‌టికే ఆమెను ఒక‌సారి విచారించింది. ఇప్పుడుమ‌రోసారి విచార‌ణ‌కు రావాల‌ని పిలిచింది. ఈ విచార‌ణ త‌ర్వాత‌.. ఏం జ‌రుగుతుంది? అనేది ఉత్కంఠ‌గా మారింది. దీంతో అస‌లు క‌విత కు ఈ కేసుకు సంబంధం ఏంటి? అనేది సామాన్యుల ప్ర‌శ్న‌.

ఈ కోణంలో చూస్తే.. ఈడీ చెబుతున్న అంశాల‌ను బ‌ట్టి.. ఢిల్లీ లిక్క‌ర్ నూత‌న విధానం 2021-22 ప్ర‌కారం.. ద‌క్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ‌లు కూడా ఢిల్లీలో మ‌ద్యం వ్యాపారాన్ని ద‌క్కించుకున్నాయి. క‌విత నేతృత్వంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయ‌న కుమారుడు రాఘ‌వ‌రెడ్డి, శ‌ర‌త్‌చంద్రా రెడ్డిలు సౌత్ గ్రూప్‌గా ఏర్ప‌డ్డారు. వీరు ఇండో స్పిరిట్‌ కంపెనీ ద్వారా ఢిల్లీలో లిక్క‌ర్ వ్యాపారానికి సంబంధించి స‌రుకును ర‌వాణా చేస్తారు.

ఈ క్ర‌మంలో ఢిల్లీ లిక్క‌ర్ వ్యాపారాన్ని 65 శాతం ఈ గ్రూప్ ద‌క్కించుకుంద‌నేది ఈడీ ఆరోప‌ణ‌. అదేస‌మ యంలో 9 లిక్క‌ర్ జోన్ల‌పై నియంత్ర‌ణ ను కూడా ఈ గ్రూప్ ద‌క్కించుకుంది. త‌ద్వారా 30 శాతం వ్యాపారం ఇండో స్పిరిట్ క‌నుస‌న్న‌ల్లో నే సాగ‌నుంది. అంటే.. మ‌ద్యం ర‌వాణా 65 శాతం, మ‌ద్యం వ్యాపారం 30 శాతం కూడా క‌విత నేతృత్వంలోని గ్రూపే చూడ‌నుంది. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

అయితే.. ఇలా వ్యాపారం ద‌క్కించుకున్నందుకు.. సౌత్ గ్రూప్‌లో ఎక్కువ షేర్ ఉన్న క‌విత మొత్తంగా ఈ వ్య‌వ‌హారాన్ని మేనేజ్ చేశార‌నేది.. ఆమే ఢిల్లీలోనూ చ‌క్రం తిప్పార‌నేది ఈడీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌. వ‌చ్చే ఐదేళ్ల లో ఈ సౌత్ గ్రూప్ ఢిల్లీలో చేసే వ్యాపారం.. అంచ‌నా విలువ 2500 కోట్లుగా ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇంత పెద్ద వ్యాపారం త‌మ‌కు ఇచ్చిన ఆప్‌కు.. రూ.100 కోట్లు ముడుపులు ఇచ్చారని.. ఈ మొత్తంలో 75 శాతం క‌విత స‌మ‌కూర్చార‌నేది ఈడీ చెబుతున్న మాట‌.

మిగిలిన 25 శాతం నిధులు అంటే.. 25 కోట్లు మిగిలిన వారు పంచుకున్నారు. ఈ నిధులు ఆప్‌కు విజ‌య్ నాయ‌ర్ ద్వారా మాగుంట రాఘ‌వ‌రెడ్డి అందించార‌ని ఇప్ప‌టికే తేల్చింది. అంటే.. మొత్తంగా 100 కోట్ల వ్య‌వ‌హారంలో క‌విత పాత్రే ప్ర‌ధాన‌మ‌న్న‌ది ఈడీ చేస్తున్న కీల‌క ఆరోప‌ణ‌లు. దీంతోనే క‌విత‌కు ఇంత ప్రాధాన్యం ఏర్ప‌డింది. అంటే.. ఈడీ చెబుతున్న లెక్క ప్ర‌కారం.. సౌత్ గ్రూప్ మాస్ట‌ర్ మైండ్ అంతా కూడా క‌వితేన‌న్న‌మాట‌.

This post was last modified on March 9, 2023 12:56 pm

Share

Recent Posts

ఓటిటి అభిప్రాయాలు ఎందుకు మారుతున్నాయ్

నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…

1 hour ago

లాఠీలు గీత దాటుతున్నాయి రేవంత్ గారు

తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…

1 hour ago

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

4 hours ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

4 hours ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

4 hours ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

8 hours ago