నిన్న చెప్పుకోదగ్గ అంచనాలతో రన్బీర్ కపూర్ కొత్త సినిమా తూ ఝూటి మై మక్కర్ రిలీజయ్యింది. హోలీ పండగతో పాటు లాంగ్ వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకుని భారీ ఎత్తున థియేటర్లకు తీసుకొచ్చారు. పఠాన్ యాభై రోజులకు దగ్గరగా ఉండటం, షెహజాదా – సెల్ఫీలు దారుణంగా డిజాస్టర్ కావడంతో అంచనాలన్నీ దీని మీదే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత భీభత్సంగా లేకపోయినా ట్రెండింగ్ లో ఉందంటూ, భారీ ఓపెనింగ్స్ ఖాయమంటూ మీడియా ఊదరగొట్టింది. దానికి తగ్గట్టే నిన్న పలువురు క్రిటిక్స్ ఏకంగా నాలుగు ఆపై రేటింగ్ ఇవ్వడంతో నిజంగా అంత గొప్పగా ఉందానే డౌట్ వచ్చింది..
వాస్తవానికి ఈ తూ ఝూటి మై మక్కర్ ఒక రెగ్యులర్ లవ్ డ్రామా. ప్రేమ జంట, వాళ్ళ మధ్య ఈగో, ఘాటు రొమాన్సు, విడిపోవడం తర్వాత మళ్ళీ ఇంకో చోట కలుసుకోవడం ఇలా ఆల్రెడీ చూసేసిన టెంప్లేట్ లోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ సహనానికి విపరీతమైన పరీక్ష పెడుతుంది. చివరి నలభై నిమిషాలు మాత్రమే ఓ మోస్తరుగా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది తప్ప ఇదేదో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే రేంజ్ లో మోస్తున్నంతగా మాత్రం ఖచ్చితంగా లేదు. రన్బీర్ కపూర్ నటన, శ్రద్ధ కపూర్ ఎక్స్ పోజింగ్ యూత్ ని ఆకట్టుకునేలా వచ్చాయి కానీ మిగిలినవి సోసోనే
దర్శకుడు లవ్ రంజన్ తన గత చిత్రం సోను కె టిటూ కె స్వీటీ స్థాయిలో ఇది లేకపోయినా ముందే ప్రిపేరయ్యి వెళ్తే తప్ప కనీస స్థాయిలో ఆస్వాదించేలా లేదు. పాటలు కూడా అంతంత మాత్రమే. కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్లకు ఇంత విచ్చలవిడిగా శ్రద్ధ కపూర్ అందాల ప్రదర్శన చేసింది ఇందులోనే. హిందీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి లేకపోయినా ఈ ఝూటి మక్కర్ లు పెద్దగా మేజిక్ చేయకపోవచ్చు. అయితే దగ్గరలో భారీ రిలీజ్ ఏదీ లేదు కాబట్టి ఆ ఒక్క అంశం కలిసి వచ్చేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి
This post was last modified on March 9, 2023 11:03 am
నిన్న ఇరుముడి ఓటిటిలో వచ్చేసింది. థియేటర్ రన్ ఇంకా కొనసాగుతున్నప్పటికీ ముందస్తు అగ్రిమెంట్ వల్ల కేవలం 28 రోజుల విండోతో…
తెలంగాణాలోని రైల్వే స్టేషన్ వద్ద చెత్త ఏరుకునే ఒక మహిళ మీద హోం గార్డు చేసిన దౌర్జన్యం తీవ్ర దుమారం…
ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…
నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…
పార్టీ ఏదైనా.. నాయకుడు ఎవరైనా సొంత సామాజిక వర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేకపోతే.. ప్రజాబలం అయినా…
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…