నిన్న చెప్పుకోదగ్గ అంచనాలతో రన్బీర్ కపూర్ కొత్త సినిమా తూ ఝూటి మై మక్కర్ రిలీజయ్యింది. హోలీ పండగతో పాటు లాంగ్ వీకెండ్ ని టార్గెట్ గా పెట్టుకుని భారీ ఎత్తున థియేటర్లకు తీసుకొచ్చారు. పఠాన్ యాభై రోజులకు దగ్గరగా ఉండటం, షెహజాదా – సెల్ఫీలు దారుణంగా డిజాస్టర్ కావడంతో అంచనాలన్నీ దీని మీదే ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత భీభత్సంగా లేకపోయినా ట్రెండింగ్ లో ఉందంటూ, భారీ ఓపెనింగ్స్ ఖాయమంటూ మీడియా ఊదరగొట్టింది. దానికి తగ్గట్టే నిన్న పలువురు క్రిటిక్స్ ఏకంగా నాలుగు ఆపై రేటింగ్ ఇవ్వడంతో నిజంగా అంత గొప్పగా ఉందానే డౌట్ వచ్చింది..
వాస్తవానికి ఈ తూ ఝూటి మై మక్కర్ ఒక రెగ్యులర్ లవ్ డ్రామా. ప్రేమ జంట, వాళ్ళ మధ్య ఈగో, ఘాటు రొమాన్సు, విడిపోవడం తర్వాత మళ్ళీ ఇంకో చోట కలుసుకోవడం ఇలా ఆల్రెడీ చూసేసిన టెంప్లేట్ లోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ సహనానికి విపరీతమైన పరీక్ష పెడుతుంది. చివరి నలభై నిమిషాలు మాత్రమే ఓ మోస్తరుగా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది తప్ప ఇదేదో దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే రేంజ్ లో మోస్తున్నంతగా మాత్రం ఖచ్చితంగా లేదు. రన్బీర్ కపూర్ నటన, శ్రద్ధ కపూర్ ఎక్స్ పోజింగ్ యూత్ ని ఆకట్టుకునేలా వచ్చాయి కానీ మిగిలినవి సోసోనే
దర్శకుడు లవ్ రంజన్ తన గత చిత్రం సోను కె టిటూ కె స్వీటీ స్థాయిలో ఇది లేకపోయినా ముందే ప్రిపేరయ్యి వెళ్తే తప్ప కనీస స్థాయిలో ఆస్వాదించేలా లేదు. పాటలు కూడా అంతంత మాత్రమే. కెరీర్ మొదలుపెట్టిన ఇన్నేళ్లకు ఇంత విచ్చలవిడిగా శ్రద్ధ కపూర్ అందాల ప్రదర్శన చేసింది ఇందులోనే. హిందీ బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి లేకపోయినా ఈ ఝూటి మక్కర్ లు పెద్దగా మేజిక్ చేయకపోవచ్చు. అయితే దగ్గరలో భారీ రిలీజ్ ఏదీ లేదు కాబట్టి ఆ ఒక్క అంశం కలిసి వచ్చేలా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వసూళ్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…