Political News

కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. త‌ర్వాత తుఫానే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. త‌ర్వాత ఏదో తుఫాను వ‌స్తుంద‌న్న‌మాటే. గ‌తం లో జ‌రిగిన ప‌రిణామాలు.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. కేసీఆర్ మౌనం.. చాలా కీల‌కమనే భావ‌న రాజ‌కీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. ప్ర‌స్తుతం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ క‌విత చుట్టూ.. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం చుట్టుకుంది. ఆమెను కూడా అరెస్టు చేసి.. తీహార్ జైలుకు త‌ర‌లిస్తార‌నే చ‌ర్చ కూడా సాగుతోంది.

గ‌తంలో 2జీ స్పెక్ట్ర‌మ్ కుంభకోణం జ‌రిగిన‌ప్పుడు.. త‌మిళ‌నాడు మాజీ సీఎం క‌రుణానిధి కుమార్తె క‌నిమొళి ని కూడా అరెస్టు చేసి .. తీహార్ జైలుకే త‌ర‌లించిన విష‌యాన్ని ప్ర‌స్తుతం నెటిజ‌న్లు గుర్తు చేసుకుంటున్నా రు.ఇప్పుడు కూడా అలానే జ‌రుగుతుందా? జ‌ర‌గ‌దా? అనే టెన్ష‌న్ అయితే కొన‌సాగుతోంది. మ‌రోవైపు.. కేసీఆర్ ఇంత జ‌రుగుతున్నా మౌనంగానే ఉన్నారు. ఆయ‌న ప‌న్నెత్తు మాట మాట్లాడ‌డం లేదు.

మ‌రి ఇంత ఉద్రిక్త‌త‌, భావావేశాలు పొంగుతున్న స‌మ‌యంలోనూ ఆయ‌న ఎందుకు ఇంత‌గా మౌనం వ‌హిస్తున్నార‌నేది ఆస‌క్తిగా మారింది. కేంద్రంలోని మోడీ స‌ర్కారు త‌మ‌ను అణిచి వేస్తోంద‌ని.. ఆయ‌న త‌ర‌చు గా చెబుతున్నారు. కానీ,లిక్క‌ర్ విష‌యాన్ని కానీ, త‌న కుమార్తెను ఈ కేసులో చేర్చ‌డంపై కానీ ఇప్ప‌టి వ‌ర కు ఆయ‌న నోరు విప్ప‌లేదు. దీనికి రీజ‌నేంటి? అంటే.. మోడీ చేస్తున్న త‌ప్పుల‌ను ఆయ‌న లెక్కిస్తున్నార‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు.

మ‌రో రెండు మాసాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. అప్పుడు.. మోడీపై మ‌రింత వేగం గా.. తీవ్రంగా కేసీఆర్ విజృంభించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. కేంద్రంలో మోడీని డైల్యూట్ చేసేందుకు.. అస్త్ర శ‌స్త్రాలు రెడీ చేసుకుంటున్నార‌ని.. అందుకే కేసీఆర్ మౌనంగా ఉన్నార‌ని.. ఇప్పుడు ఏం మాట్టాడినా.. క‌విత విచార‌ణ‌పై ప్రభావం ప‌డుతుంద‌ని నిమ్మ‌ళంగా ఉన్నార‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on March 9, 2023 5:56 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

38 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

2 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

3 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

3 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago