తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. తర్వాత ఏదో తుఫాను వస్తుందన్నమాటే. గతం లో జరిగిన పరిణామాలు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. కేసీఆర్ మౌనం.. చాలా కీలకమనే భావన రాజకీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చుట్టూ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చుట్టుకుంది. ఆమెను కూడా అరెస్టు చేసి.. తీహార్ జైలుకు తరలిస్తారనే చర్చ కూడా సాగుతోంది.
గతంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు.. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి ని కూడా అరెస్టు చేసి .. తీహార్ జైలుకే తరలించిన విషయాన్ని ప్రస్తుతం నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నా రు.ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా? జరగదా? అనే టెన్షన్ అయితే కొనసాగుతోంది. మరోవైపు.. కేసీఆర్ ఇంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నారు. ఆయన పన్నెత్తు మాట మాట్లాడడం లేదు.
మరి ఇంత ఉద్రిక్తత, భావావేశాలు పొంగుతున్న సమయంలోనూ ఆయన ఎందుకు ఇంతగా మౌనం వహిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. కేంద్రంలోని మోడీ సర్కారు తమను అణిచి వేస్తోందని.. ఆయన తరచు గా చెబుతున్నారు. కానీ,లిక్కర్ విషయాన్ని కానీ, తన కుమార్తెను ఈ కేసులో చేర్చడంపై కానీ ఇప్పటి వర కు ఆయన నోరు విప్పలేదు. దీనికి రీజనేంటి? అంటే.. మోడీ చేస్తున్న తప్పులను ఆయన లెక్కిస్తున్నారని చెబుతున్నారు పరిశీలకులు.
మరో రెండు మాసాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు.. మోడీపై మరింత వేగం గా.. తీవ్రంగా కేసీఆర్ విజృంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్రంలో మోడీని డైల్యూట్ చేసేందుకు.. అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నారని.. అందుకే కేసీఆర్ మౌనంగా ఉన్నారని.. ఇప్పుడు ఏం మాట్టాడినా.. కవిత విచారణపై ప్రభావం పడుతుందని నిమ్మళంగా ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తుండడం గమనార్హం. మరి చివరకు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 9, 2023 5:56 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…