తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే.. తర్వాత ఏదో తుఫాను వస్తుందన్నమాటే. గతం లో జరిగిన పరిణామాలు.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తే.. కేసీఆర్ మౌనం.. చాలా కీలకమనే భావన రాజకీయాల్లో వినిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చుట్టూ.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం చుట్టుకుంది. ఆమెను కూడా అరెస్టు చేసి.. తీహార్ జైలుకు తరలిస్తారనే చర్చ కూడా సాగుతోంది.
గతంలో 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం జరిగినప్పుడు.. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి ని కూడా అరెస్టు చేసి .. తీహార్ జైలుకే తరలించిన విషయాన్ని ప్రస్తుతం నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నా రు.ఇప్పుడు కూడా అలానే జరుగుతుందా? జరగదా? అనే టెన్షన్ అయితే కొనసాగుతోంది. మరోవైపు.. కేసీఆర్ ఇంత జరుగుతున్నా మౌనంగానే ఉన్నారు. ఆయన పన్నెత్తు మాట మాట్లాడడం లేదు.
మరి ఇంత ఉద్రిక్తత, భావావేశాలు పొంగుతున్న సమయంలోనూ ఆయన ఎందుకు ఇంతగా మౌనం వహిస్తున్నారనేది ఆసక్తిగా మారింది. కేంద్రంలోని మోడీ సర్కారు తమను అణిచి వేస్తోందని.. ఆయన తరచు గా చెబుతున్నారు. కానీ,లిక్కర్ విషయాన్ని కానీ, తన కుమార్తెను ఈ కేసులో చేర్చడంపై కానీ ఇప్పటి వర కు ఆయన నోరు విప్పలేదు. దీనికి రీజనేంటి? అంటే.. మోడీ చేస్తున్న తప్పులను ఆయన లెక్కిస్తున్నారని చెబుతున్నారు పరిశీలకులు.
మరో రెండు మాసాల్లో ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అప్పుడు.. మోడీపై మరింత వేగం గా.. తీవ్రంగా కేసీఆర్ విజృంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. కేంద్రంలో మోడీని డైల్యూట్ చేసేందుకు.. అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటున్నారని.. అందుకే కేసీఆర్ మౌనంగా ఉన్నారని.. ఇప్పుడు ఏం మాట్టాడినా.. కవిత విచారణపై ప్రభావం పడుతుందని నిమ్మళంగా ఉన్నారని పరిశీలకులు అంచనా వేస్తుండడం గమనార్హం. మరి చివరకు ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on March 9, 2023 5:56 pm
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…