Political News

ఉద్యోగ సంఘాల టైమింగ్ అదుర్స్

తొందరలో జరగబోతున్న ఎంఎల్సీ ఎన్నికలపై ఉద్యోగుల దెబ్బ తప్పదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఈనెల 13వ తేదీన ఐదు ఎంఎల్సీ స్ధానాలకు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. సరిగ్గా అదును చూసుకుని తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగసంఘాల నేతలు ఆందోళనలకు పిలుపిచ్చారు. ఈ ఆందోళనలు 9వ తేదీ నుంచి మొదలవ్వబోతున్నాయి. నేపధ్యంలోనే ఎంఎల్సీ ఎన్నికలపై ఉద్యోగుల ఆందోళన ప్రభావం ఎంతుంటుందనే విషయమై ఉత్కంఠ పెరిగిపోతోంది.

మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్ల నియోజకవర్గాల ఎంఎల్సీలకు ఎన్నిక జరగబోతోంది. ఈ ఐదు స్ధానాలకు జరగబోయే ఎన్నికలు దాదాపు అన్ని జిల్లాలు కవర్ అవబోతున్నాయి. ఈ ఎన్నికలకు మామూలు పబ్లిక్ తో సంబంధంలేదు. ఇందులో ఓటర్లు గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్లు మాత్రమే. ఇప్పటికే టీచర్లు, ఉద్యోగులు ప్రభుత్వంపై బాగా మండిపోతున్నానే ప్రచారం తెలిసిందే. ఉద్యోగుల ఆర్ధికపరమైన డిమాండ్లను పరిష్కరించటంలో ప్రభుత్వం ఫెయిలైందని ఉద్యోగ సంఘాల నేతలు తీవ్రంగా మండిపోతున్నారు.

ఇదే సమయంలో ఫేషియల్ రికగ్నిషన్, థంబ్ ఇంప్రెషన్ లాంటి అటెండెన్స్ విధానంతో టీచర్లు కోపంతో ఉన్నారు. ఇలాంటి అనేక పాయింట్ల మీద ఉద్యోగులు, టీచర్లు ఇప్పటికే సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఇపుడు కూడా అవే డిమాండ్లతో ఆందోళనలకు పిలుపిచ్చారు. అసలే మంటమీదున్న ఉద్యోగులు, టీచర్లు ఆందోళనల పేరుతో ఎంఎల్సీ ఎన్నికల్లో అధికారపార్టీ అభ్యర్ధులకు వ్యతిరేకంగా ఓట్లేసే అవకాశాలున్నాయి.

అందుకే ఈ విషయాలను ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగసంఘాల నేతలతో సమావేశమయ్యేందుకు మంత్రుల కమిటీ రెడీ అయ్యింది. సమస్యల పరిష్కారం కావాలి కానీ సమావేశాలు ఎందుకని నేతలంటున్నారు. మరీ నేపథ్యంలో ఈరోజు సమావేశంలో ఏమి తేలుతుందో చూడాలి. ఏదేమైనా స్థానిక సంస్థల కోటాలో భర్తీ అయ్యే తొమ్మిది ఎంఎల్సీ స్ధానాలను ఖాతాలో వేసుకున్నంత తేలిక్కాదు ఐదు స్ధానాల ఎంఎల్సీ ఎన్నికలని ఇప్పటికే వైసీపీకి అర్ధమయ్యుండాలి. మరి దీనికి విరుగుడుగా, అన్నింటినీ గెలుచుకునేందుకు అధికార పార్టీ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందన్నది ఆసక్తిగా మారింది. ఉద్యోగ సంఘాల నేతల సమావేశ ఫలితం ఎలాగుంటుందో చూడాల్సిందే.

This post was last modified on March 7, 2023 12:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్రికెట్ మ్యాచ్ గురించి ఎందుకు జగన్?

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…

2 minutes ago

రక్తపాతం కోరుకుంటున్న విశ్వక్

ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…

34 minutes ago

సాక్షిపై రఘురామ దావా… అమరావతి రైతులకు కోటి

వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…

1 hour ago

వారణాసికి అన్నీ పక్కా ప్లానింగ్

రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఫస్ట్ టైమ్.. అసెంబ్లీలో చే’నేత’ స్టాళ్లు

ఏపీ అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌లు ఆసక్తిక‌ర ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ స‌మావేశాల‌కు విద్యార్థుల‌ను అనుమ‌తిస్తున్నారు. స‌మావేశాల‌ను వారు ప్ర‌త్య‌క్షంగా…

2 hours ago

ఈసారి డీఎస్సీలో వారిపైనే ప్రత్యేక దృష్టి?

ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…

3 hours ago