మరో 10 మాసాల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. మరి ఇప్పుడు ఎన్నిస్థానాల్లో విజయం దక్కించుకోవాలి? ఎన్నిచోట్ల గెలుపుగుర్రం ఎక్కాలి..? ఇదీ.. అధికార పార్టీ బీఆర్ ఎస్లో జరుగుతున్న అంతర్మథనం. గత 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం దక్కించుకుంది. అదే సమయంలో 46.9 శాతం ఓటు బ్యాంకు ను సొంతం చేసుకుంది.
అయితే..అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయాలకు రెడీ అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని మరింత దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వానపాములుగా భావించిన కొన్ని పార్టీలు ఇప్పుడు బుసలు కొడుతున్నాయి. అధికారమే పరమావధిగా దూసుకుపోతున్నాయి.
దీంతో గతంలో ఉన్న ఊపు, గత ఎన్నికల్లో ఉన్న హవా.. ఇప్పుడు బీఆర్ఎస్కు లభించే అవకాశం లేదన్నది ముందస్తుగా వస్తున్న అంచనాలు. ఈ నేపథ్యంలో అలెర్టయిన కేసీఆర్.. గత వారం రోజులుగా ఉన్నతాధికారులు సహా గత ఎన్నికల్లో పనిచేసిన కొందరుకీలక అధికారులతోనూ.. రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో చంద్రబాబు – కాంగ్రెస్ చేతులు కలపడం ద్వారా మరోసారి సెంటిమెంటును రగిల్చారు.
కానీ, ఇప్పుడు జాతీయ పార్టీ కావడంతో ప్రాంతీయ భావాలను ఆయన పక్కన పెట్టాల్సి వస్తోంది. అయినప్పటికీ.. అదే సెంటిమెంటు తప్ప.. మరో మార్గం లేదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కొందరు మంత్రులను సెంటిమెంటు దిశగా నడిపిస్తున్నారు. మానీళ్లు.. మా నేల అంటూ.. నిరంజన్ రెడ్డి వంటి మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, 100 స్థానాల్లో గెలిచి నిలవాలనే టార్గెట్ పెట్టుకుని బలంగా పనిచేయాలని తాజాగా ఒక అంచనాకు వచ్చినట్టు ప్రగతి భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి ఏం చేస్తారోచూడాలి.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…