మరో 10 మాసాల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. మరి ఇప్పుడు ఎన్నిస్థానాల్లో విజయం దక్కించుకోవాలి? ఎన్నిచోట్ల గెలుపుగుర్రం ఎక్కాలి..? ఇదీ.. అధికార పార్టీ బీఆర్ ఎస్లో జరుగుతున్న అంతర్మథనం. గత 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం దక్కించుకుంది. అదే సమయంలో 46.9 శాతం ఓటు బ్యాంకు ను సొంతం చేసుకుంది.
అయితే..అప్పటికి ఇప్పటికి పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ జాతీయ స్థాయిలో రాజకీయాలకు రెడీ అవుతున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీని మరింత దిగ్విజయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో వానపాములుగా భావించిన కొన్ని పార్టీలు ఇప్పుడు బుసలు కొడుతున్నాయి. అధికారమే పరమావధిగా దూసుకుపోతున్నాయి.
దీంతో గతంలో ఉన్న ఊపు, గత ఎన్నికల్లో ఉన్న హవా.. ఇప్పుడు బీఆర్ఎస్కు లభించే అవకాశం లేదన్నది ముందస్తుగా వస్తున్న అంచనాలు. ఈ నేపథ్యంలో అలెర్టయిన కేసీఆర్.. గత వారం రోజులుగా ఉన్నతాధికారులు సహా గత ఎన్నికల్లో పనిచేసిన కొందరుకీలక అధికారులతోనూ.. రహస్యంగా మంతనాలు సాగిస్తున్నారు. నిజానికి గత ఎన్నికల్లో చంద్రబాబు – కాంగ్రెస్ చేతులు కలపడం ద్వారా మరోసారి సెంటిమెంటును రగిల్చారు.
కానీ, ఇప్పుడు జాతీయ పార్టీ కావడంతో ప్రాంతీయ భావాలను ఆయన పక్కన పెట్టాల్సి వస్తోంది. అయినప్పటికీ.. అదే సెంటిమెంటు తప్ప.. మరో మార్గం లేదని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో కొందరు మంత్రులను సెంటిమెంటు దిశగా నడిపిస్తున్నారు. మానీళ్లు.. మా నేల అంటూ.. నిరంజన్ రెడ్డి వంటి మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, 100 స్థానాల్లో గెలిచి నిలవాలనే టార్గెట్ పెట్టుకుని బలంగా పనిచేయాలని తాజాగా ఒక అంచనాకు వచ్చినట్టు ప్రగతి భవన్ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి ఏం చేస్తారోచూడాలి.
This post was last modified on March 4, 2023 9:32 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…