దమ్ముంటే ఒంటరిగా 175 స్థానాల్లో పోటీ చేయాలంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాలుపై తెలుగు తమ్ముళ్లు ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. మేం ఎలా పోటీ చేయాలో నువ్వు చెప్పేదేంటి? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మిగిలిన నేతల కౌంటర్లు ఎలా ఉన్నా.. టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి ఘాటుగా రియాక్టు అయ్యారు. జగన్ కు సవాలు చేసేంత సీన్ లేదన్న ఆయన.. “నువ్వు డైపర్స్ వేసుకునేటప్పుడు పుట్టిన పార్టీ” అంటూ మండిపడ్డారు.
చరిత్ర సృష్టించిన పార్టీపై సవాళ్లు చేయడమా? అని ప్రశ్నించిన ఆయన.. చరిత్ర తెలుసుకొని సవాలు చేస్తే బాగుండేదన్నారు. “నువ్వు సవాలు విసిరేంత సీన్ నీకు లేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎందుకు నమోదు చేసుకోలేదో చెప్పే ధైర్యం ఉందా? పదో తరగతి ఫెయిల్ కావటం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోలేదు” అంటూ ఫైర్ అయ్యారు.
నెల్లూరు యాసలో మాట్లాడే ఆనం మాటల్లో రిథమ్ ఉండటం.. ఆయన మాటలు వినేలా ఉండటం తెలిసిందే. మిగిలిన తెలుగు తమ్ముళ్లతో పోలిస్తే.. ఆనం మాటలు కాస్తంత భిన్నమని చెబుతుంటారు. అయితే..తాజా ఎపిసోడ్ లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం గమనార్హం. ఆనం మాటలకు బదులిస్తూ.. 1983 నుంచి 2019 ఎన్నికల వరకు ఏయే పార్టీలతో టీడీపీ పొత్తుపెట్టుకుందో చెప్పుకుంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు పలువురు నెటిజన్లు.
దీనిపై మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ.. తెలుగుదేశం మీద ఫైర్ అయ్యే ముందు.. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది టీఆర్ఎస్.. కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవటం వల్లనే కదా? ఆ విషయాన్ని ఎలా మర్చిపోతారు? ఒంటరిగా పోటీ చేయాలని సవాలు విసిరే జగన్.. మరి.. వాళ్ల నాన్న ఆ పని ఎందుకు చేయలేకపోయారో చెప్పాలంటున్నారు.
అంతేకాదు.. జగన్ తనకు తానుగా ఎదిగిన నేత కాదని.. తన తండ్రి పేరును.. బొమ్మను పెట్టుకొని ప్రజల్లోకి వచ్చాడే తప్పించి.. సొంతంగా చేసిందేమీ లేదంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి.. ఆ పార్టీ నేతల్ని వెంట పెట్టుకొని మాట్లాడే జగన్ మాటల్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందా? అంటూ ఘాటుగా రియాక్టు అవుతున్నారు. సీఎం జగన్ సవాలు చేయటం ఏమో కానీ.. ఆయన మాటలపై మాత్రం భారీ ఎత్తున చర్చ పేరుతో రచ్చ జరుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.
This post was last modified on March 2, 2023 10:36 am
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. తద్వారా ఉద్యోగాలకు పొంచి…
తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…
తెలంగాణ లో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా విషాదాన్ని…
సంచలనంగా మారిన అనంతపురం హనీట్రాప్ గుట్టు రట్టైంది. ప్లాన్ చేసి.. టార్గెట్ చేసి ముగ్గులోకి దించటం.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే…
బాక్సాఫీస్ యమా నీరసంగా ఉంది. సరైన కొత్త సినిమాలు లేక చాలా థియేటర్లలో సగం షోలు కూడా పడటం లేదు.…
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…