ఏపీ సర్కారులో మంత్రులకు మించి.. మరోమాటలో చెప్పాలంటే.. మంత్రి వర్గం కన్నా డబుల్ సంఖ్యలో ఉన్నారనేది అందరికీ తెలి సిందే. దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోయినా.. ప్రస్తుతం 56 నుంచి 62 మంది సలహాదారులు ఉన్నారు. అయితే.. వీరిపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. తెల్ల ఏనుగులను పోషిస్తున్నారనే కామెంట్లు కూడా వచ్చాయి. అంతేకాదు.. ఈ సలహాదారుల పరిస్థితి ఏంటంటూ.. హైకోర్టులో అనేక కేసులు కూడా పడ్డాయి. వీటిలో సజ్జల రామకృష్ణారెడ్డిపై సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణ దాఖలు చేసిన కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.
ఈ కేసు విచారణ సమయంలోనే అసలు ఆర్థికపరిస్థితిలో అధమంగా ఉన్న ఏపీకి ఇంత మంది సలహాదారులు అవసరమా? అని కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. రేపు తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమించేలా ఉన్నారంటూ.. వ్యంగ్యాస్త్రాలు కూడా సంధించింది. అయితే.. ఇవన్నీ లెక్కచేసేవారికి. కానీ, ఏపీ ప్రభుత్వం ఏనాడూ.. కోర్టు వ్యాఖ్యలను పట్టించుకోలేదు. దీంతో మళ్లీ మళ్లీ.. సలహాదారులను నియమిస్తూనే ఉన్నారు సీఎం జగన్. హైకోర్టు ఇంత మాట అనేశాక.. నటుడు అలీని ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమించారు.
మరి ఇప్పుడు ఎవరిని?
ఇక, ఇప్పుడు సీఎం జగన్ మరో సలహాదారును నియమించాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సమావేశమైన సీఎం.. వారిసమస్యలు విన్నారు. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ తరపున హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం ను కొనియాడారు. చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి… స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. చర్చిలు, వాటి ఆస్తుల రక్షణ కోసం తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చారు. జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి కూడా హామీ ఇచ్చారు. అదేసమయంల ఇకపై క్రిస్టియన్ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామని తేల్చి చెప్పారు. తద్వారా వారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని సీఎం చెప్పుకొచ్చారు. సో.. ఇదీ కథ!!
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…