Political News

సాయిరెడ్డిని పక్కన పెట్టేశారు.. ఇదిగో రుజువు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతల్లో ఒకరైన విజయసాయిరెడ్డిలో కొత్త మనిషి కనిపిస్తున్నాడు అందరికీ. తన రాజకీయ ప్రత్యర్థులపై ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో ఆయన ఎలా విరుచుకుపడుతుంటారో.. ఎంతటి దారుణమైన భాష వాడుతుంటారో తెలిసిందే. కానీ కొంత కాలంగా ఆయన ట్విట్టర్ అకౌంట్ గమనిస్తే పరుషమైన విమర్శ ఒక్కటీ లేదు. అదే సమయంలో వైకాపాలో ఆయన ప్రాధాన్యం అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. అందులోనూ ఇటీవల తారకరత్న అనారోగ్యం పాలైనపుడు.. తర్వాత అతను మరణించినపుడు తనకు దగ్గరి బంధువైన సాయిరెడ్డి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది.

ఓవైపు తారకరత్న విషయంలో వైకాపా వాళ్లంతా దారుణమైన దుష్ప్రచారాలు చేస్తుంటే.. సాయిరెడ్డి మాత్రం బాలయ్యను పొగిడారు. తారకరత్న మరణించిన సమయంలో చంద్రబాబుతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. ఈ పరిణామాలు వైకాపా అధినేత, సీఎం జగన్‌కు ఏమాత్రం రుచించేవి కావని.. సాయిరెడ్డికి పంచ్ పడటం ఖాయమని అనుకున్నారు చాలామంది.
ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది. ఇప్పటికే పార్టీలో సాయిరెడ్డికి ప్రాధాన్యం బాగా తగ్గిపోగా.. ఇప్పుడు ఆయన్ని దాదాపుగా జీరోను చేసేశారు.

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నెట్‌వర్క్‌ను అట్టడుగు స్థాయిలో బలోపేతం చేసేందుకు వైకాపా నాయకత్వం జిల్లా స్థాయిలో పార్టీ అనుబంధ సంస్థలను తాజాగా ప్రకటించింది.అందులో వివిధ విభాగాలకు అధ్యక్షులను ప్రకటించింది. దీని సంబంధించి మీడియాకు విడుదల చేసేన ప్రకటనలో ఈ అనుబంధ విభాగాల రాష్ట్ర సమన్వయ కర్తగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పేర్కొనడం గమనార్హం.

ఇంతకుముందు ఇదే పదవిలో విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన కింద కో ఇన్ఛార్జిగా చెవిరెడ్డి ఉండేవారు. కానీ ఇప్పుడు సాయిరెడ్డిని పక్కకు తప్పించి చెవిరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి సాయిరెడ్డిని తప్పించి సజ్జల కుమారుడికి ఇచ్చేశారు. ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ పదవి నుంచి సాయరెడ్డిని పక్కన పెట్టడం అంటే ఆయన పూర్తిగా జగన్ విశ్వాసం కోల్పోయినట్లే కనిపిస్తోంది.

This post was last modified on February 26, 2023 2:22 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

43 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

1 hour ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago