Political News

కేసీఆర్ స‌ర్కారుకు ‘కుక్క‌ల’ సెగ‌!

తెలంగాణ‌లోని కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని ఒక‌వైపు. ప్ర‌తిప‌క్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. పాద‌యాత్ర‌లు.. విమ‌ర్శ‌లు.. స‌వాళ్ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. అయితే.. వీరికితోడు. ఇప్పుడు కుక్క‌ల‌ ఘ‌ట‌న కూడా స‌ర్కారును కుదిపేస్తోంది. హైద‌రాబాద్‌లోని అంబ‌ర్ పేట‌లో రెండు రోజుల కింద‌ట జ‌రిగిన వీధికుక్క‌ల ఘ‌ట‌న‌.. స‌ర్కారుపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చేలా చేసింది.పైగా ఈ ఘ‌ట‌న‌ను హైకోర్టు సుమోటోగా తీసుకోవ‌డంతో మ‌రింత‌గా ప్రాధాన్యం ఏర్ప‌డింది.

ఎక్క‌డో ఏదైనా చిన్న ఘ‌ట‌న జ‌రిగితే.. మ‌న‌సు పెట్టి స్పందించే తెలంగాణ మంత్రి కేటీఆర్.. అంబ‌ర్‌పేట లో వీధికుక్క‌లు ఒక చిన్నారిని చంపితినేసిన ఘ‌ట‌న‌పైనా స్పందించారు. అయితే..ఆయ‌న రియాక్ష‌న్ అనుకున్న విధంగా లేద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవడం.. క‌నీసం ప‌రామ‌ర్శించేందుకు ఎవ‌రినీ పంపించ‌క‌పోవ‌డంపైనా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక‌, ఈ ఘ‌ట‌న‌ను హైకోర్టు స్వ‌యంగా స్వీక‌రించి విచార‌ణ చేస్తామ‌ని చెప్ప‌డంపై వంద‌లాది మంది నెటిజ న్ల‌తోపాటు..సెల‌బ్రిటీలు కూడా స్వాగ‌తిస్తున్నారు. వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ అయితే.. ఏకంగా మేయ‌ర్‌ను ఆ కుక్క‌ల మ‌ధ్య వ‌దిలిపెడితే.. అప్పుడు బాధ తెలుస్తుంద‌ని అన్నారు. వీధి కుక్కల నియంత్రణలో గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ విఫలమైందని విమర్శించారు.

‘శునకాలకు ఆకలి వేయడం వల్లే చిన్నారిపై దాడి చేశాయి’ అని నగర మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఇచ్చిన వివరణపై ఆర్జీవీ మండిపడ్డారు. ‘‘శునకాల నుంచి ప్రజలకు హాని కలగకుండా ఉండాలంటే మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మికి నా ఆలోచన చెబుతా. నగరంలోని అన్ని శునకాలకూ ఈ వీడియో చూపిస్తే, ఆకలి వేసినప్పుడల్లా, చిన్నారులపై దాడి చేయకుండా మేయర్ఇంటికి వెళ్తాయి. అలాగే, ఆ హృదయ విదారక వీడియోను ఆమెకు తరచూ చూపించాలి. అప్పుడే ఆమె చెత్త సలహాలు ఇవ్వకుండా ఉంటారు. కిల్లర్‌ డాగ్స్‌కు ఆమె నిజమైన నాయకురాలేమోనని నాకు అనిపిస్తోంది“ అని ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు.

ఇక‌, నెటిజ‌న్లు కూడా తీవ్రంగానే స్పందించారు. మంత్రి కేటీఆర్‌, హైదరాబాద్‌ పోలీసులు దీనిపై విచారణ చేయాల‌ని కోరుతున్నారు. ఇంత జరిగినా జీహెచ్ ఎంసీ ఏమాత్రం బాధ్య‌త వ‌హించ‌డం లేద‌ని.. మ‌నుషు లంటే లెక్కేలేదా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. ఇక‌, ఈ పరిణామాన్నిత‌మ‌కు రాజ‌కీయ అస్త్రంగా మార్చుకు నేందుకు బీజేపీ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. బాధిత కుటుంబాన్ని పరామ‌ర్శించేందుకు బీజేపీ పెద్ద‌లు రెడీ అవుతున్న‌ట్టు స‌మాచారం.

This post was last modified on February 24, 2023 4:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

7 minutes ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

30 minutes ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

50 minutes ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

1 hour ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

1 hour ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

2 hours ago