ఏపీకి కొత్త గవర్నర్ వచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేసి.. ఈ ఏడాది ప్రారంభంలో వాలం టరీ రిటైర్మెంట్ ప్రకటించిన జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ఏపీ గవర్నర్గా నియమితులయ్యారు. అయితే . ఈయన స్టయిల్ వేరని.. ఈయన గురించి తెలిసిన న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆయన ఎక్కువగా ఆడంబరాలకు పోరు. ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టుకుంటారు. పైగా.. కష్టపడి పనిచేసి.. సంపాయించుకో వాలనే తత్వం ఉన్న వారట.
దీనికి కొన్ని ఉదాహరణలు కూడా న్యాయనిపుణులు చెబుతున్నారు. జస్టిస్ నజీర్కు సొంతగా కారు ఉంది. దీనినే ఆయన న్యాయమూర్తిగా ఉన్నన్నాళ్లు వినియోగించారట. ప్రభుత్వం వాస్తవానికి సుప్రీం న్యాయమూ ర్తులకుకొత్త కొత్త కార్లు ఇస్తుంది. కానీ..జస్టిస్ నజీర్ మాత్రం ప్రభుత్వానికి భారం ఎందుకని.. తనకు ఆ మా త్రం స్థాయి ఉందని.. ఆయన తన సొంత కారునే వినియోగించేవారట. ఇక, ఆయన వ్యక్తిగత సిబ్బందిని కూడా చాలా చాలా తక్కువగా వినియోగించేవారు.
సుప్రీం కోర్టులో ఒక్కొక్క న్యాయమూర్తికి నలుగురేసి చొప్పున వ్యక్తిగత సిబ్బందిని ఇస్తారు. జస్టిస్ నజీర్ మాత్రం ఇద్దరినే వినియోగించుకునేవారు. మిగిలిన ఇద్దరినీ ప్రభుత్వానికి సరెండర్ చేశారనిన్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. విదేశీ, స్వదేశీ పర్యటనలు చేసేందుకు కేంద్రం న్యాయమూర్తుల కు నిధులు ఇస్తుంది. దీంతో వారు సమ్మర్ హాలీడేస్కు విదేశాలకు వెళ్తుంటారు.
కానీ, జస్టిస్ నజీర్ మాత్రం ఎప్పుడూ.. విదేశాలకు వెళ్లలేదు. అంతేకాదు.. ఆయనకు అసలు పాస్ పోర్టు కూడా లేదు. ఇటీవల కేంద్రమే బలవంతం చేసి.. పాస్పోర్టు ఇప్పించిందట. అదికూడా అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితిలో! ఈ మొత్తం ఎపిసోడ్లో అర్థమైంది.. ఏంటంటే జస్టిస్ నజీర్ చాలా చాలా మితభాషి మాత్రమే కాదు.. ఖర్చులు కూడా తగ్గించుకునే రకం. అంతేకాదు.. కష్టపడి పనిచేయాలనే తత్వం ఉన్నవారు.
మరి అలాంటి గవర్నర్ వచ్చినందకు హ్యాపీనే కానీ.. ఏపీ ప్రభుత్వానికి ఆయనకు పడుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే..ఏపీలో అనేక సంక్షమ పథకాల ద్వారా.. ప్రజాధనాన్ని ఉచితాలకు పంచుతున్నారనే వాదన ప్రతిపక్షాలు వినిపిస్తున్నాయి. అనేక వేల కోట్లను ప్రజలు ఉచితాల కింద ఇచ్చామని.. జగనే చెబుతున్నారు. ఈ ఉచితాలు గిట్టని వ్యక్తి గవర్నర్గా వచ్చిన నేపథ్యంలో జగన్ దూకుడుకు బ్రేకులేమైనా పడతాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on February 24, 2023 9:43 am
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…