Political News

బాబు వాళ్ల‌ను మేనేజ్ చేశారా.. వారే మేనేజ్ అయ్యారా… !


గుంటూరు పాలిటిక్స్‌లో ఇదో పెద్ద అద్భుత‌మనే చెప్పాలి. ఎందుకంటే.. విరుద్ధ స్వ‌భావాలు.. భావాలు ఉన్న నాయ‌కులు ఇప్పు డు క‌లిసిపోబోతున్నారు. అంతేకాదు.. క‌త్తులు దూసుకున్న నేత‌లు.. చేతులు క‌ల‌ప‌నున్నారు. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శలు చేసు కున్న స్వ‌రాలు.. ఆప్యాయ‌త‌ను కుమ్మ‌రించుకోనున్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు.. ఇది ఎలా సాధ్య‌మైంది? ఎలా ముందుకు సాగ‌గ‌లుగుతున్నారు? ఎలా సాగుతారు? అనేవి ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లుగా ఉన్నాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు బీజేపీలో ఉన్న సీనియ‌ర్ నాయ‌కుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ .. టీడీపీ సైకిల్ ఎక్కుతుండ‌డ‌మే…!

రెండు క‌త్తులు ఒకే ఒర‌లో ఇమ‌డ‌డం ఎంత క‌ష్ట‌మో.. అదేవిధంగా ఒక‌ప్పుడు టీడీపీని లేకుండా చేస్తాన‌ని.. టీడీపీ నేత‌లు ఎలా తిరుగుతారో చూస్తాన‌ని స‌వాళ్లు రువ్విన క‌న్నా.. ఇప్పుడు అదే టీడీపీలోకి చేరారు. మ‌రీ ముఖ్యంగా స్థానిక టీడీపీ నేత‌ల‌తో ఏమాత్రం పొస‌గ‌ని.. ముఖ్యంగా ఇటు రాయ‌పాటి నుంచి అటు.. కొమ్మాల‌పాటి వంటి వారితో క‌న్నాకు ద‌శాబ్దాలుగా వైరం ఉంది. అలాంటివారు కూడా ఇప్పుడు మౌనంగా ఉన్నారు. క‌న్నా వ‌చ్చినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని రాయ‌పాటి సాంబ‌శివ‌రావు బాహాటంగానే ప్ర‌క‌ట‌న చేశారు.

మ‌రి ఇంత‌లా వీరు మారారా? లేక వీరిని చంద్ర‌బాబు మార్చారా? అనేది ఆస‌క్తికర అంశం. దీనిని ప‌రిశీలిస్తే.. వారుకాదు.. చంద్ర బాబే మేనేజ్ చేశార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం త‌ప్ప‌.. చంద్ర‌బాబు కంటికి ఇప్పుడు ఏదీ క‌ని పించ‌డం లేదు. మ‌హాభార‌తంలో అర్జ‌నుడికి చెట్టుపై ఉన్న ప‌క్షి-దాని క‌న్ను.. క‌నిపించిన చందంగానే చంద్ర‌బాబుకు ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు మాత్ర‌మే క‌నిపిస్తోంది. అందుకే.. ఎవ‌రు వ‌చ్చినా.. ఎవ‌రు క‌లుస్తామ‌న్నా..ఆయ‌న రెడీగా ఉన్నారు. “ముందు అధికారంలోకి రావాలి. త‌ర్వాత ఏమైనా చేయొచ్చు” అనే పాల‌సీని గ‌తంలో జ‌గ‌న్ అవ‌లంభించారు.

ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే పాల‌సీని చంద్ర‌బాబు అవ‌లంభిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న క‌న్నాను పార్టీలోకి ఆహ్వానించే ముందే.. పార్టీ నేత‌ల‌ను అలెర్ట్ చేశార‌ని.. అంద‌రూ మౌనంగా ఉండాల‌ని చెప్పార‌ని గుంటూరులో పెద్ద ఎత్తున చ‌ర్చ‌సాగుతోంది. పార్టీని బ‌లోపేతం చేసేందుకు.. ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గాన్ని ప్ర‌భావితం చేసుకునేందుకు ఉన్న అవ‌కాశాన్ని జార‌విడుచుకోవ‌ద్ద‌ని.. ఆయ‌న కీల‌క నేత‌ల‌కు ఫోన్ల ద్వారా సందేశం ఇచ్చార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే అధినేత మాట‌కు అనుగుణంగా.. నేత‌లు మౌనంగా ఉన్నార‌ని అంటున్నారు. ఇదీ.. సంగతి..!

Satya

Recent Posts

NBK 111… ఎప్పుడు వస్తే బాగుంటుంది

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…

52 minutes ago

వరుణ్ తేజ్ పూర్తిగా రూటు మార్చేశాడు

వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…

1 hour ago

చెన్నై లవ్ స్టోరీ హీరోయిన్… అమ్మ కన్నీటి కథ

‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…

4 hours ago

పుష్ప విలన్ కామెడీ చేస్తే…

మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్‌గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…

5 hours ago

ఏపీలో మాజీ మంత్రి ఓటు గల్లంతు… ఇప్పుడెలా ‘సర్’?

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…

5 hours ago

నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణమా..?

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…

6 hours ago