వైసీపీ కీలక నాయకుడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ పీటముడులు మరిన్ని పెరుగుతున్నాయి. తాజాగా పరిణామాలు.. ఆయనను ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు తనపై ఓ వర్గం మీడియా దాడి చేస్తోందని చెబుతూ వచ్చిన అవినాష్.. ఇప్పుడు సీబీఐ లాగుతున్న కూపీలు.. సేకరిస్తున్న ఆధారాలతో ఊబిలో దిగిపోతున్నారనే వాదన వైసీపీలోనే వినిపిస్తోంది.
నిజానికి ఇప్పటి వరకు కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో పెదవి విప్పని వ్యక్తి అవినాష్ రెడ్డి ఒక్కరే. ఆయన ఎక్కడా కూడా ఎంత వత్తిడి వచ్చినా.. పెదవి విప్పలేదు. అయితే.. ఇప్పుడు సీబీఐ వేళ్ల న్నీ.. దృష్టంతా కూడా.. కడప ఎంపీ సీటు.. అనంతర పరిణామాలు.. షర్మిల ఇచ్చిన వాంగ్మూలం వంటి వాటి చుట్టూ తిరుగుతూ..వచ్చి వచ్చి అవినాష్ దగ్గర ఆగినట్టు మీడియా పేర్కొంది.
ఇక, ఇదే నిజమైతే.. సీబీఐ ఇప్పుడు విచారించనున్న నేపథ్యంలో అవినాష్ను అరెస్టు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇది అంత తేలిక విషయం కాదు. వైఎస్ కుటుంబంలో.. ముఖ్యుడిగా..పైగా సీఎం జగన్ తన తమ్ముడు అని సాక్షాత్తూ అసెంబ్లీలోనే పేర్కొన్న నాయకుడిగా.. ఉన్న అవినాష్.. ఈ కేసులో అరెస్టయితే.. మొత్తానికే డ్యామేజీ అవుతుంది. వచ్చే ఎన్నికలపైనా అది ప్రభావం చూపిస్తుంది.
అందుకే.. గతంలో జగన్ చెప్పినట్టుగా.. అవినాష్ ఈ కేసుముడులు పెరుగుతున్న కొద్దీ.. తన రాజకీయాల ను కూడా మార్చుకునే పరిస్థితి ఉందని కడప పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎలానూ.. ఇలాంటి నాయకులకు ఆపన్న హస్తం అందించేందుకు బీజేపీ రెడీగా ఉంటుందని కూడా కడప నాయకులు చెబుతున్నారు. గతంలో జరిగిన పరిణామాలు.. తర్వాత.. వారు బీజేపీలో చేరాక చోటు చేసుకున్న మార్పులను గమనిస్తే.. అవినాష్కు సేఫ్ పార్టీ ఇప్పుడు బీజేపీనేననే చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on February 23, 2023 12:06 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…