తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల దూకుడుకు అడ్డుకట్టే ఉండడం లేదు. అధికారులంటే వారికి లెక్కే ఉండడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చాలామంది దాసోహం అంటుండడంతో ప్రతి అధికారీ అలాగే ఉండాలని నేతలు కోరుకుంటున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్లతో వివాదాలు పెట్టుకోగా.. మరికొందు ఎమ్మెల్యేలు టోల్ గేట్ సిబ్బందిపైనా చేయిచేసుకున్న ఉదంతాలున్నాయి. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు దేవాదాయ శాఖకు చెందని ఓ అధికారిని తీవ్రంగా బెదిరించారు. తనతో పెట్టుకుంటే 33 జిల్లాలలో ఎక్కడ పనిచేసినా వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
‘ఇంకా 30 ఏళ్లు నేనే గెలిచి అధికారంలో ఉంటాను. వచ్చేసారి మంత్రి కూడా అవుతాను. నువ్వు 33 జిల్లాలలో ఎక్కడ పనిచేసినా వదిలిపెట్టను’ అంటూ దేవాదాయ శాఖకు చెందిన జిల్లా స్థాయి అధికారిపై ఆగ్రహించారు.
అంతేకాదు… చీఫ్ సెక్రటరీనే తిట్టగలను… నువ్వెంత అంటూ చెలరేగిపోయారు. నల్లమలలోని చెంచుపెంటల్లో శివరాత్రి సందర్భంగా భ్రమరాంబ మల్లికార్జునుల కళ్యాణం కార్యక్రమంలో గువ్వల బాలరాజు రెచ్చిపోయారు. అధికారిపై విరుచుకుపడ్డారు. మీడియా ప్రతినిధులు కొందరు దీన్ని కెమేరాలలో షూట్ చేస్తుండగా వారిపైనా ఆగ్రహించారు.
కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోలు వివాదంలో గువ్వల బాలరాజు కూడా ఒకరు. ఆ ఘటన తరువాత కొద్దిరోజుల పాటు బాలరాజు కేసీఆర్ ఫాం హౌస్లోనే ఉంచారు. కానీ, కేసు రూపు మారుతుండడంతో కేసీఆర్ ఈ నలుగురు ఎమ్మెల్యేలను దూరం పెడుతున్నట్లు వినిపిస్తోంది.
ఫాం హౌస్ వ్యవహారం, ఎమ్మెల్యేల కొనుగోలు వివాదం ప్రభావం ఎలా ఉంటుందో అర్థం కానందున వచ్చే ఎన్నికల్లో బాలరాజుకు టికెట్ రావడం అనుమానమేనని వినిపిస్తోంది. ఈ ఫ్రస్టేషన్లోనే బాలరాజు ఆగ్రహానికి లోనవుతున్నారని వినిపిస్తోంది.
This post was last modified on February 20, 2023 6:18 am
రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…