రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.. ఇప్పుడు అదే జరుగుతోంది. టీడీపీ నేతలు చెబుతున్నట్టుగా.. ప్రస్తుతం ఆ పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రకు.. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్నారెడ్డి కుమారుడు భార్గవ రెడ్డికి మధ్య ఏదో సంబంధం ఉందా? అంటే.. తాజాగా జరుగుతున్న పరిణామాలకు ఔననే సమాధానమే వస్తోంది.
అక్కడెక్కడో జరుగుతున్న యువగళం పాదయాత్రకు, భార్గవ రెడ్డికి మధ్య రిలేషన్ ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. ఇదే విషయాన్ని టీడీపీ నాయకులు కూడా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న భార్గవ రెడ్డి.. యువగళం పాదయాత్రపై తనదైన శైలిలో దృష్టి పెట్టారని టీడీపీ నేతలు చెబుతున్నారు. అంటే.. ఒకవైపు యువగళం హిట్.. సూపర్ హిట్ .. అని టీడీపీ ప్రచారం చేస్తోంది. ఇది వాస్తవం కూడా!
అయితే.. ఇదేమీ లేదు.. ఇది ఫట్! అని వ్యతిరేక ప్రచారం చేయడంలో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్గా రాఘవరెడ్డి బాధ్యతలు తీసుకున్నారనేది టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. వైసీపీ అనుకూల మీడియాలోనూ ఇదే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా యువగళం జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులను కూడా రాఘవరెడ్డే నియంత్రిస్తున్నారని.. నిరంతరం వారితో టచ్లోకి వస్తున్నారని.. వారిని ఆయనే కంట్రోల్ చేస్తున్నారని కూడా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అందుకే.. లోకేష్ ప్రసంగాలు హైలెట్ కాకుండా.. మైకులు లాగేయడం.. సౌండ్ వాహనాలను స్వాధీనం చేసు కోవడం వంటివి చేస్తున్నారని కూడా జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక, లోకేష్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతాలకు దూరంగా డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి.. వాటితో తీసిన నిర్మానుష్య ప్రాంతాల ఫొటోలు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా యువగళం పెద్దగా సాగడం లేదనే వ్యతిరేక ప్రచారానికి తెరదీశారని.. దీని వెనుక మాస్టర్ మైండ్ రాఘవరెడ్డేనన్నది.. టీడీపీ నేతల ప్రధాన ఆరోపణ. మరి ఇదినిజమే.. అయితే.. ఇంతకన్నా.. దౌర్భాగ్యం ఉండదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on February 12, 2023 11:41 am
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…
గత వారం రోజులకు పైగా తిరుగుతున్న లీకులకు అధికారిక ముద్ర పడిపోయింది. టాక్సిక్ జూన్ 4 నుంచి వాయిదా వేస్తున్నట్టు…
నవ్యాంద్రప్రదేశ్ లో అధికార కూటమి రథ సారథి తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుదవారం నుంచి నవ శకం మొదలు…
లెనిన్ గురించి అప్డేట్స్ లేక అసహనానికి గురవుతున్న అభిమానులకు ఊరట కలిగిస్తూ నాగార్జున ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్…
ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది ‘గాయపడ్డ సింహం’. డైరెక్టర్ టర్న్డ్ యాక్టర్ తరుణ్ భాస్కర్…