Political News

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌.. ఎంపీ కుమారుడి అరెస్టుకు కార‌ణాలు ?

దేశాన్ని కుదిపేస్తున్న కీల‌క కేసుల్లో ఇప్పుడు ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణం మొద‌టి వ‌రుస‌లో చేరింది. ఈ కేసులో తాజాగా ఏపీకి చెందిన ఒంగోలు అధికార పార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘ‌వ‌రెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆయ‌న‌కు ఈ కేసుకు సంబంధం ఏంటి? ఎందుకు అరెస్టు చేశారు. అస‌లు ఢిల్లీలో జ‌రిగిన స్కామ్‌కు ఒంగోలులో ఎందుకు తీగ క‌దిలింది? అనే అంశాలు ఆస‌క్తిగా మారాయి. వాటిని పరిశీలిస్తే.. అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌మీదికివ‌స్తున్నాయి.

1) మాగుంట కుటుంబం కొన్ని ద‌శాబ్దాలుగా.. లిక్క‌ర్ వ్యాపారంలో ఉంది. కేవ‌లం ఏపీలో వారు చేసే వ్యాపారం 25 శాతం మాత్ర‌మే. ఇత‌ర రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర‌, గోవా, ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లోనే మెజారిటీ వ్యాపారం చేస్తున్నారు. ఇక‌, మాగుంట వార‌సుడిగా.. రాఘ‌వ‌రెడ్డి ఈ వ్యాపారాల‌ను చ‌క్క‌బెడుతున్నారు.

2) ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో కీల‌క పాత్ర పోషించిన సౌత్ గ్రూప్‌(ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన బృందాలు)లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ గ్రూపు నిర్వ‌హించిన మీటింగ్‌ల్లో మాగుంట రాఘ‌వ‌ పాల్గొన్నారు.

3) మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌‌పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

4) సౌత్ గ్రూపు త‌ర‌ఫున సుమారు 100 కోట్ల రూపాయ‌ల‌ను చేతులు మార్చిన‌ట్టు తెలుస్తోంది. అదేస‌మ‌యంలో రాఘ‌వ‌రెడ్డి కొంద‌రికి ఫోన్లు స‌ర‌ఫ‌రా చేశార‌ని.. అదేవిధంగా స‌మావేశాల‌కు సంబంధించి షెడ్యూల్‌ను రూపొందించ‌డం.. వెన్యూలు రెడీ చేయ‌డం.. వ్యాపార డీల్స్ కుద‌ర్చ‌డంలోనూ రాఘ‌వ ప్ర‌ధాన పాత్ర పోషించారు.

5) అదేవిధంగా గోవాకు త‌ర‌లించిన రూ.100 కోట్ల నిధుల విష‌యంలోనూ రాఘ‌వ కు ప్ర‌త్య‌క్ష సంబంధాలు ఉన్నాయ‌ని ఈడీ అధికారులు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. బ‌ల‌మైన ఆధారాల‌తోనే ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్టు తెలిసింది.

This post was last modified on February 11, 2023 2:59 pm

Share
Show comments

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

1 hour ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

5 hours ago