దేశాన్ని కుదిపేస్తున్న కీలక కేసుల్లో ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మొదటి వరుసలో చేరింది. ఈ కేసులో తాజాగా ఏపీకి చెందిన ఒంగోలు అధికార పార్టీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అయితే.. ఆయనకు ఈ కేసుకు సంబంధం ఏంటి? ఎందుకు అరెస్టు చేశారు. అసలు ఢిల్లీలో జరిగిన స్కామ్కు ఒంగోలులో ఎందుకు తీగ కదిలింది? అనే అంశాలు ఆసక్తిగా మారాయి. వాటిని పరిశీలిస్తే.. అనేక ఆసక్తికర విషయాలు తెరమీదికివస్తున్నాయి.
1) మాగుంట కుటుంబం కొన్ని దశాబ్దాలుగా.. లిక్కర్ వ్యాపారంలో ఉంది. కేవలం ఏపీలో వారు చేసే వ్యాపారం 25 శాతం మాత్రమే. ఇతర రాష్ట్రాలైన మహారాష్ట్ర, గోవా, ఢిల్లీ, యూపీ వంటి రాష్ట్రాల్లోనే మెజారిటీ వ్యాపారం చేస్తున్నారు. ఇక, మాగుంట వారసుడిగా.. రాఘవరెడ్డి ఈ వ్యాపారాలను చక్కబెడుతున్నారు.
2) ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పాత్ర పోషించిన సౌత్ గ్రూప్(దక్షిణాది రాష్ట్రాలకు చెందిన బృందాలు)లో మాగుంట రాఘవరెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈ గ్రూపు నిర్వహించిన మీటింగ్ల్లో మాగుంట రాఘవ పాల్గొన్నారు.
3) మాగుంట శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఆగ్రో ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్పై గతంలో చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఢిల్లీలోని మాగుంట నివాసంపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడుల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
4) సౌత్ గ్రూపు తరఫున సుమారు 100 కోట్ల రూపాయలను చేతులు మార్చినట్టు తెలుస్తోంది. అదేసమయంలో రాఘవరెడ్డి కొందరికి ఫోన్లు సరఫరా చేశారని.. అదేవిధంగా సమావేశాలకు సంబంధించి షెడ్యూల్ను రూపొందించడం.. వెన్యూలు రెడీ చేయడం.. వ్యాపార డీల్స్ కుదర్చడంలోనూ రాఘవ ప్రధాన పాత్ర పోషించారు.
5) అదేవిధంగా గోవాకు తరలించిన రూ.100 కోట్ల నిధుల విషయంలోనూ రాఘవ కు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. బలమైన ఆధారాలతోనే ఆయనను అరెస్టు చేసినట్టు తెలిసింది.
This post was last modified on February 11, 2023 2:59 pm
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…