Political News

విజయసాయి పై జగన్ సీరియస్?

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ అవసరం వచ్చినా కేంద్రం వైపు చూస్తుంటారు. రాష్ట్ర ఖజానా పూర్తిగా ఒట్టిపోయి పైసా కూడా లేని టైములో ఢిల్లీ వెళ్లి లాబీయింగ్ చేసి వెయ్యి కోట్లు తెచ్చుకుంటారు. ఏదో విధంగా గట్టేక్కేందుకు ప్రయత్నిస్తారు. కేంద్రానికి అత్యంత ప్రీతిపాత్రుడిగా ఉన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి, కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కట్టబెట్టారు. ఏ కష్టమొచ్చినా ఢిల్లీ పరిగెత్తే జగన్ పై హస్తిన పెద్దలు ఈ సారి మాత్రం శీతకన్నేశారనే చెప్పాలి..

మూడు రాజధానులను ఏర్పాటుచేసే విషయంలో జగన్‌ ప్రభుత్వం తమను సంప్రదించలేదని రాజ్యసభ వేదికగా కేంద్రం స్పష్టంచేసింది. 2014లో చేసిన ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 5, 6 కింద ఏపీకి నూతన రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంపై ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని తెలిపింది.

ఈ కమిటీ నివేదికను తదుపరి చర్యలకోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపామని వివరించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనితో ఇప్పుడు వైసీపీ పరిస్థితి అడకత్తెరలో పడిన పోకచెక్కలా తయారైంది. అడిగి నిజం చెప్పించుకున్నట్లయ్యిందని వైసీపీ వర్గాలు విజయసాయిపై మండిపడుతున్నట్లు సమాచారం.

విభజన చట్టంలోని నియమాల ప్రకారం ఇప్పటికీ అమరావతే రాజధాని అని కూడా కేంద్రం తేల్చిచెప్పింది. 2015లో అప్పటి రాష్ట్రప్రభుత్వం రాజధాని నిర్మాణానికి పూనుకుందని పార్లమెంటులో చెప్పడం ద్వారా కేంద్రం తన మనసులోని మాట బయటపెట్టిందని టీడీపీ వర్గాలు అంటుండగా, అవసరంగా విజయసాయి కదిలించి కంపు చేశారని వైసీపీ వర్గాలు వాపోతున్నాయ్. ఇంతకాలం కేంద్రం అనుకూలంగా లేకపోయినా తటస్థంగా ఉంటుందని అనుకుంటే విజయసాయి అడిగిన ప్రశ్న ద్వారా.. జగన్ ఏకపక్ష నిర్ణయం బయటపడిందని. అది మున్ముందు తమకు ఇబ్బందిగా మారుతుందని వైసీపీ వర్గాలు భయపడుతున్నాయి. ఇకనైనా విజయసాయి సంయమనం పాటిస్తే మంచిదని వైసీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

7 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago