Political News

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ గేలం.. చంద్ర‌బాబు ఏం చేశారంటే!

ప్ర‌స్తుతం ఏపీలో జంపింగుల కాలం ప్రారంభ‌మైంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో కి నేత‌లు జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవ‌ల వైసీపీ నుంచి తాను టీడీపీలోకి వెళ్తున్న‌ట్టుగా.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి ప్ర‌క‌టించారు. దీనికి విరుగుడుగా.. వైసీపీ కూడా టీడీపీలో ఉన్న కీల‌క నేత‌ల‌కు గేలం వేసే ప‌నిని ప్రారంభించింది. ఇలా.. అనుకున్న వెంట‌నే.. మాజీ మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు సోద‌రుడు.. తుని టీడీపీ ఇంచార్జ్ కృష్ణుడు ఉర‌ఫ్ ప‌ళ్ల కృష్ణుడుకు వైసీపీ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

పార్టీలోకి వ‌స్తే.. కీల‌క ప‌ద‌వి ఇస్తామ‌ని ఆయ‌నకు హామీ ఇచ్చిన‌ట్టు కొన్ని రోజులుగా ప్ర‌చారంలో ఉంది. అయితే..ఈ విష‌యంపై స‌మాచారం తెలిసిన వెంట‌నే టీడీపీ అధినేత చంద్ర‌బాబు రియాక్ట్ అయ్యారు. హుటాహుటిన య‌న‌మ‌ల సోద‌రులు ఇద్ద‌రినీ త‌న వ‌ద్ద‌కు పిలుచుకుని పంచాయ‌తీ పెట్టారు. వాస్త‌వానికి 2014, 2019లో తుని టీడీపీ టికెట్‌ను కృష్ణుడుకు ఇచ్చారు. అయితే, ఆయ‌న వ‌రుస‌గా ప‌రాజ‌యం పాల య్యారు. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ వ్యూహం మార్చాల‌ని నిర్ణ‌యించింది.

దీనిలో భాగంగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని టికెట్‌ను దాదాపు క‌న్ఫ‌ర్మ్ చేశారు. దీంతో కృష్ణుడు అల‌క వ‌హించారు. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకు చెప్పకుండా ఈ విధంగా చేయడంతో తనకు అన్యాయం జరిగిందని అనుచ‌రుల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కృష్ణుడుపై వైసీపీ గేలం వేసింది. పార్టీలో కీలక పదవి ఇస్తామని ఆశ చూపింది. కాగా, చంద్ర‌బాబు వ‌ద్ద జ‌రిగిన పంచాయ‌తీలో కృష్ణుడుకు బ‌ల‌మైన హామీ ఇచ్చార‌ని తెలిసింది. దీంతో వైసీపీ వేసిన వ్యూహానికి చంద్ర‌బాబు ఇలా చెక్ పెట్టార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రోవైపు కృష్ణుడు కూడా చంద్ర‌బాబు వ్యూహంతో సంతోషంతో ఉన్న‌ట్టు చెప్పారు.

This post was last modified on February 9, 2023 9:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

6 hours ago