ప్రస్తుతం ఏపీలో జంపింగుల కాలం ప్రారంభమైంది. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో కి నేతలు జంప్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవల వైసీపీ నుంచి తాను టీడీపీలోకి వెళ్తున్నట్టుగా.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. దీనికి విరుగుడుగా.. వైసీపీ కూడా టీడీపీలో ఉన్న కీలక నేతలకు గేలం వేసే పనిని ప్రారంభించింది. ఇలా.. అనుకున్న వెంటనే.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు.. తుని టీడీపీ ఇంచార్జ్ కృష్ణుడు ఉరఫ్ పళ్ల కృష్ణుడుకు వైసీపీ ఆఫర్ ప్రకటించింది.
పార్టీలోకి వస్తే.. కీలక పదవి ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్టు కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. అయితే..ఈ విషయంపై సమాచారం తెలిసిన వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. హుటాహుటిన యనమల సోదరులు ఇద్దరినీ తన వద్దకు పిలుచుకుని పంచాయతీ పెట్టారు. వాస్తవానికి 2014, 2019లో తుని టీడీపీ టికెట్ను కృష్ణుడుకు ఇచ్చారు. అయితే, ఆయన వరుసగా పరాజయం పాల య్యారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ వ్యూహం మార్చాలని నిర్ణయించింది.
దీనిలో భాగంగా.. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యకు తుని టికెట్ను దాదాపు కన్ఫర్మ్ చేశారు. దీంతో కృష్ణుడు అలక వహించారు. తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకు చెప్పకుండా ఈ విధంగా చేయడంతో తనకు అన్యాయం జరిగిందని అనుచరుల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కృష్ణుడుపై వైసీపీ గేలం వేసింది. పార్టీలో కీలక పదవి ఇస్తామని ఆశ చూపింది. కాగా, చంద్రబాబు వద్ద జరిగిన పంచాయతీలో కృష్ణుడుకు బలమైన హామీ ఇచ్చారని తెలిసింది. దీంతో వైసీపీ వేసిన వ్యూహానికి చంద్రబాబు ఇలా చెక్ పెట్టారని అంటున్నారు పరిశీలకులు. మరోవైపు కృష్ణుడు కూడా చంద్రబాబు వ్యూహంతో సంతోషంతో ఉన్నట్టు చెప్పారు.
This post was last modified on February 9, 2023 9:43 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…