Political News

అక్కడ ఎమ్మెల్యేపై వైసీపీ కమ్మ నేతల తిరుగుబాటు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన సంతనూతలపాడును గత రెండు ఎన్నికలుగా వైసీపీ సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైసీపీ నేత సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబును 2019లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు అభ్యర్థిగా ప్రకటించారు. పొరుగు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ జగన్ గాలిలో ఆ ఎన్నికల్లో గెలిచిన సుధాకర్ బాబు ఆ తరువాత క్యాడర్‌లో కొందరిని పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా సొంత పార్టీకే చెందిన కమ్మ నేతలను ఆయన ఏమాత్రం లెక్క చేయడం లేదన్నది వారి ఆరోపణ.

అధికారుల బదిలీలలో పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల మాట అస్సలు పట్టించుకోకపోవడం… తన వ్యక్తిగత సహాయకులలో అయిదుగురికి చీమకుర్తి నగర పంచాయతీ నుంచి జీతాల చెల్లింపులు చేస్తుండడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. అలాగే, తనకు అనుకూలమైన కొందరికే కాంట్రాక్టులు, ఇతర పనులు అప్పగిస్తూ కమ్మ నేతలెవరికీ ఏ పనీ ఇవ్వడం లేదన్న ఆరోపణ వచ్చింది.

ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు రెండు వర్గాలను పిలిచి మాట్లాడారు. కానీ, నాయకులు, ఎమ్మెల్యే మధ్య దూరం తగ్గలేదు. తాజాగా కొందరు నాయకులు ఆత్మగౌరవం పోరాటం పేరుతో రెండు రోజుల కిందట ఒంగోలు సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులో మీటింగ్ పెట్టి 12 మందితో ఓ కమిటీ ఏర్పాటుచేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 100 మంది కమ్మ సామాజికవర్గ నేతలు ఇక్కడ సమావేశమయ్యారట. 12 మందితో కమిటీ ఏర్పాటుచేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డిపై ఒత్తిడి తెచ్చి ఎమ్మెల్యే సుధాకర్ బాబు మెడలు వంచేందుకు వీరంతా నిర్ణయించినట్లు సమాచారం.

This post was last modified on February 9, 2023 9:36 am

Share
Show comments
Published by
satya

Recent Posts

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

5 hours ago

క్యారెక్టర్ ఆర్టిస్టులు హీరోలుగా మారితే

మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…

5 hours ago

ఏపీలో అవినీతి తప్ప ఏం లేదు – మోడీ

ఏపీలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారు రానుంద‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మే కేంద్రంలోనూ…

7 hours ago

వేటు మీద వేటు.. ఆయనొక్కరే మిగిలారు

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…

7 hours ago

రాజ్ తరుణ్ నిర్మాతల భలే ప్లాన్

కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…

7 hours ago

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. కేంద్రం ఏం చెప్పింది వీళ్లేం చేశారు?

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…

9 hours ago