నాందేడ్ బహిరంగ సభలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. మేక్ ఇన్ ఇండియా పథకం జోక్ ఇన్ ఇండియాగా మారిపోయిందంటూ భారీ సెటైర్ వేశారు. అంతేకాదు.. చైనాను బూచిగా చూపుతూ ఓట్లు రాబట్టకుంటున్న బీజేపీ చిన్న విషయానికి కూడా చైనాపైనే ఆధారపడుతోందని ఆరోపించారు. గాలిపటానికి కట్టే దారం నుంచి జాతీయ జెండా వరకు అన్నీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. చిన్నచిన్న ఊళ్లలోనూ ఇప్పుడు చైనా బజార్లు ఉన్నాయంటే ఆ దేశంపై ఎంతగా ఆధారపడుతున్నామో అర్థమవుతోందని, ఇంకా మేక్ ఇన్ ఇండియా జోక్ కాకపోతే ఏమిటని అన్నారు. ఒక్క బటన్ నొక్కి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
రైతుల ఆత్మహత్యలకూ కేంద్రానిదే తప్పని కేసీఆర్ నిందించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయినా ఇంకా రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉండడం దారుణమన్నారు. దీనికి కారణం కాంగ్రెస్, బీజేపీలేనన్నారు. చాలా దేశాల్లో 5 వేల టీఎంసీలకంటే ఎక్కువ కెపాసిటీ ఉన్న ప్రాజెక్టులున్నాయని.. కానీ, ఇండియాలో ఇంత పెద్ద నదులున్నా అలాంటి ప్రాజెక్టు ఒక్కటి కూడా ఎందుకు లేదని కేసీఆర్ ప్రశ్నించారు. రైతులు నాగలి పట్టి దున్నడమే కాదు అధికారం చేపట్టి చరిత్ర తిరగరాయాలని అన్నారు.
మహారాష్ట్ర జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నాందేడ్ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న గురుగోవింద్ సింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.కేవలం ఒక్క బటన్ నొక్కండి.. దేశమంతా మారిపోతోంది అని కేసీఆర్ అన్నారు. మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ పరిష్కారం కావాలి. నా మాటల్లో నిజం ఉంది. గులాబీ జెండా భుజాన వేసుకుని కదలిరండి అని పిలుపునిచ్చారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలి.. కిసాన్ సర్కార్ రావాలి. మహారాష్ట్రలో ఊరురా కిసాన్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర అంతటా పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు.
This post was last modified on February 5, 2023 7:58 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…