ప్రధాని నరేంద్ర మోడీ భేష్ అంటూ.. ఇటీవల కాలంలో కొన్ని సర్వేలు వస్తున్నాయి. వాస్తవం ఎలా ఉన్నా.. ఈ సర్వేలు మాత్రం సంచలనం రేపు తుండడం గమనార్హం. తాజాగా ఇలాంటి సర్వేనే ఒకటి మోడీకి 78 శాతం ప్రజామోదం ఉందని పేర్కొంది. ‘మార్నింగ్ కన్సల్ట్’ అనే సంస్థ ఈ సర్వే చేసింది. ప్రపంచ నాయకులు అందరికంటే అధిక జనాదరణ ఉన్న నేత మోడీనేనని పేర్కొంది. ఈ సర్వేలో మొత్తం 22 మంది దేశాధినేతలపై ప్రజల అభిప్రాయం కోరినట్టు సంస్థ తెలిపింది. వీరిలో మోడీ అత్యధిక రేటింగ్ సంపాదించుకున్నారని తెలిపింది.
వరుసగా రెండో ఏడాది అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మోడీ నిలిచారని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ పేర్కొంది. అమెరికాకు చెందిన ఈ సంస్థ గ్లోబల్ లీడర్ అప్రూవల్
పేరుతో దేశాల్లో నిర్వహించిన సర్వేలో ప్రధాని మోడీని 78శాతం మంది ప్రజలు ఆమోదించారని తెలిపింది. 68 శాతంతో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ రెండో స్థానంలో ఉన్నారని, అమెరికా అధినేత జోబైడెన్ ఈ సంవత్సరం ఒక స్థానం దిగజారి 40 శాతంతో ఏడో స్థానంలో నిలిచారని సర్వే పేర్కొంది.
అదేవిధంగా నార్వే ప్రధాని జోనాస్ గహర్ 21 శాతంతో చిట్టచివరి స్థానంలో నిలిచారని మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తెలిపింది. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సియోక్ యుల్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా వరుసగా 20, 21 స్థానాల్లో ఉన్నారు. ఇటలీ తొలి నూతన మహిళా ప్రధానమంత్రి జార్జియా మెలోని 52 శాతం ప్రజామోదంతో 6వ స్థానంలో నిలిచారు.
ఇక, ఈ సర్వేలో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 58 శాతం ఆమోదంతో 4వ స్థానంలో నిలవగా, బ్రెజిల్కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా 50 శాతం ఆమోదంతో 5వ స్థానంలో, కెనడా ప్రధాని 40 శాతం ఆమోదంతో 9వ స్థానంలో, యూకే ప్రధాని రిషి సునాక్ 30 శాతం ప్రజామోదంతో 12వ స్థానాన్ని సంపాదించుకున్నారని.. సర్వే స్పష్టం చేసింది. మొత్తం ప్రజల్లో మోడీకి ఉన్న ఆదరణ బాగుందని పేర్కొనడం గమనార్హం.
This post was last modified on February 4, 2023 10:27 pm
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం మాంచి ఊపుమీదున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం చిత్రాలతో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన…
గత ఐదేళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా తిరుమల లడ్డు నాణ్యత పడిపోయిందని.. లడ్డు తయారీలో వాడిన నెయ్యలో…
కూటమి సర్కారుకు వంద రోజులు పూర్తయ్యాయి. సంతృప్తి విషయంలో కూటమి పార్టీల నాయకులు తల కోమాట మాట్లాడుతున్నారు. ఇదేంటి? అంటున్నారా?…
దేవరతో టాలీవుడ్ కు పరిచయం కాబోతున్న జాన్వీ కపూర్ డెబ్యూలో ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లోనే కాదు ఇండస్ట్రీ…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరపున 8 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో కొందరు ఫైర్బ్రాండ్లు కూడా…
తమిళ హీరో ధనుష్ కేవలం ప్రతిభావంతుడైన నటుడు మాత్రమే.. తనలో మంచి అభిరుచి ఉన్న దర్శకుడు, కథా రచయిత, లిరిసిస్ట్,…