ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తోట చంద్రశేఖర్ నాయకత్వంలో పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న కొందరు మాజీ అధికారులు వచ్చి కేసీఆర్ ను కలిసి వెళ్లారు. అందులో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు కుడా ఉన్నారు. త్వరలో విశాఖలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు బీఆర్ఎస్ గాలం వేసిసట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, విశాఖలో ప్రత్యక్షమై వారిద్దరితో భేటీ అయ్యారు. కాపు, బలిజ వర్గాలే టార్గెట్ గా బీఆర్ఎస్ ఏపీ రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో వారిద్దరినీ గౌడ్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయని దగ్గరి వారు చెబుతున్నారు. వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిట్లు వార్తలు కూడా వచ్చాయి.
నిజానికి గంటా కొంతకాలంగా టీడీపీలో అంటీముట్టనట్లు ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ, నిరసనోద్యమాల్లోనూ పాల్గొనడం లేదు. దానితో ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. చివరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసిన గంటా.. అనివార్య కారణాలతో క్రియాశీలంగా ఉండలేకపోయానని ఇకపై చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఇంతలోనే అయ్యన్న పాత్రుడు ఆయనపై విమర్శలు సంధించడం కూడా జరిగపోయింది. అయితే గంటా, టీడీపీలో క్రియాశీలంగా ఉన్నట్లు కనిపించలేదు.
జేడీ లక్ష్మీ నారాయణ ఐపీఎస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. విశాఖ లోక్ సభా స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన టీవీ చర్చలకు, సామాజిక కార్యక్రమాలకు పరిమితమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఒక మంచి పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు.
తెలంగాణ ఎమ్మెల్యే గౌడ్ తో భేటీ అయిన మాట నిజమేనని గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. అయితే రాజకీయమేదీ లేదని చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన ఒక పెళ్లి కార్యక్రమంలో కలిశామని, అప్పుడు కొందరు ఫోటోలు తీశారని వెల్లడించారు. అంతకు మించిన రాజకీయ ప్రాధాన్యమేదీ లేదని అన్నారు. తాను ముమ్మాటికి తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మరోమారు స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసిన వార్తలు, ఆపై వచ్చిన ఉహాగానాలకు తెరదించేందుకు గంటా ప్రయత్నించినా విశ్వసించేందుకు రాజకీయ వర్గాలు సిద్ధంగా లేవు. ఎందుకంటే సొంత పార్టీ టీడీపీలోనే ఆయనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…
This post was last modified on February 3, 2023 8:44 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…