Political News

అబ్బే పెళ్లిలో కలిశామంతే…

ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ విస్తరణకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తోట చంద్రశేఖర్ నాయకత్వంలో పార్టీలోకి కొత్త వారిని ఆహ్వానించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న కొందరు మాజీ అధికారులు వచ్చి కేసీఆర్ ను కలిసి వెళ్లారు. అందులో తమిళనాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రామ్మోహన్ రావు కుడా ఉన్నారు. త్వరలో విశాఖలో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అందు కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణకు బీఆర్ఎస్ గాలం వేసిసట్లు అర్థమవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, విశాఖలో ప్రత్యక్షమై వారిద్దరితో భేటీ అయ్యారు. కాపు, బలిజ వర్గాలే టార్గెట్ గా బీఆర్ఎస్ ఏపీ రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో వారిద్దరినీ గౌడ్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయాలు కూడా చర్చకు వచ్చాయని దగ్గరి వారు చెబుతున్నారు. వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించిట్లు వార్తలు కూడా వచ్చాయి.

నిజానికి గంటా కొంతకాలంగా టీడీపీలో అంటీముట్టనట్లు ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ, నిరసనోద్యమాల్లోనూ పాల్గొనడం లేదు. దానితో ఆయన వైసీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది. చివరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిసిన గంటా.. అనివార్య కారణాలతో క్రియాశీలంగా ఉండలేకపోయానని ఇకపై చిత్తశుద్ధితో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఇంతలోనే అయ్యన్న పాత్రుడు ఆయనపై విమర్శలు సంధించడం కూడా జరిగపోయింది. అయితే గంటా, టీడీపీలో క్రియాశీలంగా ఉన్నట్లు కనిపించలేదు.

జేడీ లక్ష్మీ నారాయణ ఐపీఎస్ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. విశాఖ లోక్ సభా స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఆయన టీవీ చర్చలకు, సామాజిక కార్యక్రమాలకు పరిమితమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి ఒక మంచి పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణ ఎమ్మెల్యే గౌడ్ తో భేటీ అయిన మాట నిజమేనని గంటా శ్రీనివాసరావు అంగీకరించారు. అయితే రాజకీయమేదీ లేదని చెప్పుకొచ్చారు. విశాఖలో జరిగిన ఒక పెళ్లి కార్యక్రమంలో కలిశామని, అప్పుడు కొందరు ఫోటోలు తీశారని వెల్లడించారు. అంతకు మించిన రాజకీయ ప్రాధాన్యమేదీ లేదని అన్నారు. తాను ముమ్మాటికి తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని మరోమారు స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసిన వార్తలు, ఆపై వచ్చిన ఉహాగానాలకు తెరదించేందుకు గంటా ప్రయత్నించినా విశ్వసించేందుకు రాజకీయ వర్గాలు సిద్ధంగా లేవు. ఎందుకంటే సొంత పార్టీ టీడీపీలోనే ఆయనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

2 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

3 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

4 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

6 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

11 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

13 hours ago