ఈసారి ప్రెస్ మీట్లో జగన్ ఏం మాట్లాడాడు?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అనగానే సోషల్ మీడియా జనాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. జగన్ నోటి నుంచి ఈసారి ఏం ఆణిముత్యాలు దొర్లుతాయి.. వాటి మీద ఏం మీమ్స్ వేద్దాం.. ఎలా ట్రోల్ చేద్దామని మీమ్ క్రియేటర్లతో పాటు వ్యతిరేకులు కాచుకుని కూర్చుని ఉన్నారు.

కరోనా వైరస్ నేపథ్యంలో జగన్ పెడుతున్న ప్రెస్ మీట్లు అంత కామెడీగా.. వివాదాస్పదంగా మారుతున్నాయి మరి. పది రోజుల కిందట ‘పారాసిటమాల్’, ‘బ్లీచింగ్ పౌడర్’, ‘దట్ కమ్స్.. దట్ గోస్’.. ‘దిస్ ఈజ్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ’, ‘కరోనాతో ఎవరూ చనిపోరు’ లాంటి కామెంట్లతో జగన్ ఎంతగా అన్ పాపులర్ అయ్యాడో తెలిసింది. తర్వాతి ప్రెస్ మీట్లో కరోనా పుట్టింది దక్షిణ కొరియాలో అంటూ మరోసారి వ్యతిరేక వర్గాలకు దొరికిపోయాడు.

దీంతో జగన్ లేటెస్ట్ ప్రెస్ మీట్ కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గురువారం సాయంత్రం జగన్ కరోనా మీద మళ్లీ ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రధానంగా జగన్ ఇచ్చిన సందేశం.. జనాలు ఎక్కడి వాళ్లు అక్కడే ఉండాలని. దేశ ప్రధాని చెప్పిన మాటల్నే ఆయనా వల్లె వేశాడు. బుధవారం సాయంత్రం తెలంగాణ నుంచి వస్తున్న ఏపీ విద్యార్థులను కృష్ణా జిల్లాలో ఆపేయడం మీద జగన్ నర్మగర్భంగా స్పందించాడు.

తీవ్ర విమర్శలకు దారి తీసిన ఈ వ్యవహారంపై జగన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం వాళ్లను చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదన్నాడు. నిన్న జరిగిన ఘటనలు తన మనసును కలచి వేశాయన్నాడు. ఐతే ఎప్పట్లాగే జగన్ మాటల్లో కొన్ని తప్పులు దొర్లడంతో సోషల్ మీడియా జనాలకు పని పడింది. ‘27 వేల 7 వందల పద్దెనిమిది వందల పందొమ్మిది మంది’ అంటూ ఒక నంబర్ చెప్పాడు జగన్. ఇంకా ఇలాంటి కొన్ని తప్పులు దొర్లడంతో వాటిపై కామెడీ చేస్తున్నారు జనాలు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

తండెల్ దర్శకుడి సినిమాకు పెద్ద బ్రేక్?

చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన…

42 minutes ago

జగన్ ‘మావిగన్ జోకర్’ అంటున్న షర్మిల

వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్…

1 hour ago

వెక్కివెక్కి ఏడ్చిన బొత్స

వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు.…

2 hours ago

వైఎస్ మృతిపై అచ్చన్నాయుడు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.…

2 hours ago

ప్రదీప్ ఇమేజ్ సరిపోవడం లేదు

రేపు విడుదల కాబోతున్న సినిమాల్లో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. లవ్ టుడే, డ్రాగన్,…

2 hours ago

ఆ ముగ్గురిపై లోకేష్ సీరియస్?

టీడీపీ ఎమ్మెల్యేల ప‌నితీరుపై త‌ర‌చుగా స‌మీక్షిస్తున్న ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్‌.. తాజాగా జిల్లాల…

5 hours ago