ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తీసుకున్న నిర్ణయం వేతన జీవులకు ఒకింత ఊరట కల్పించిందనే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి.
అదే సమయంలో వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7 లక్షల వరకు పెంచారు. అయితే.. వివిధ శ్లాబుల్లో మార్పులు చేశారు.
కొత్తగా పన్ను చెల్లించేవారికి రూ.0- 3 లక్షల వరకు పన్ను 0
3 లక్షల నుంచి 6 లక్షల వేతనం పొందేవారికి 5 శాతం
6 లక్షల నుంచి 9 లక్షల వేతనం పొందేవారికి 10 శాతం
9 లక్షల నుంచి 12 లక్షల వేతనం పొందేవారికి 15 శాతం
12 లక్షల నుంచి 15 లక్షల వేతనం పొందేవారికి 30 శాతం
పన్నులు విధించనున్నారు. ఇవి ఇప్పుడున్న శ్లాబులతో పోలిస్తే.. కొంత వెసులుబాటు కల్పించినట్టయింది.
కోర్టుల పెంపు
ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7 వేల కోట్లు కేటాయింపు. ఇది ఒకరకంగా భారీ బడ్జెట్ అనే చెప్పాలి. దేశంలో పెరిగిపోతున్న పెండింగు కేసులను పరిష్కరించేందుకు అవకాశం ఉంది. కానీ, సిబ్బంది(న్యాయవాదులు, న్యాయమూర్తుల విషయం పై స్పష్టత రావాల్సిఉంది)
This post was last modified on February 1, 2023 1:24 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…