ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. తీసుకున్న నిర్ణయం వేతన జీవులకు ఒకింత ఊరట కల్పించిందనే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. టీవీ ప్యానెళ్లపై కస్టమ్స్ డ్యూటీ 2.5శాతం తగ్గించింది. టీవీలు, మొబైళ్లు, ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు భారీగా తగ్గనున్నాయి.
అదే సమయంలో వేతనజీవులకు కేంద్రం ఊరట లభించింది. ఆదాయ పన్ను పరిమితి పెంపు రూ.7 లక్షల వరకు పెంచారు. అయితే.. వివిధ శ్లాబుల్లో మార్పులు చేశారు.
కొత్తగా పన్ను చెల్లించేవారికి రూ.0- 3 లక్షల వరకు పన్ను 0
3 లక్షల నుంచి 6 లక్షల వేతనం పొందేవారికి 5 శాతం
6 లక్షల నుంచి 9 లక్షల వేతనం పొందేవారికి 10 శాతం
9 లక్షల నుంచి 12 లక్షల వేతనం పొందేవారికి 15 శాతం
12 లక్షల నుంచి 15 లక్షల వేతనం పొందేవారికి 30 శాతం
పన్నులు విధించనున్నారు. ఇవి ఇప్పుడున్న శ్లాబులతో పోలిస్తే.. కొంత వెసులుబాటు కల్పించినట్టయింది.
కోర్టుల పెంపు
ఈ-కోర్టుల ప్రాజెక్ట్కు రూ.7 వేల కోట్లు కేటాయింపు. ఇది ఒకరకంగా భారీ బడ్జెట్ అనే చెప్పాలి. దేశంలో పెరిగిపోతున్న పెండింగు కేసులను పరిష్కరించేందుకు అవకాశం ఉంది. కానీ, సిబ్బంది(న్యాయవాదులు, న్యాయమూర్తుల విషయం పై స్పష్టత రావాల్సిఉంది)
This post was last modified on February 1, 2023 1:24 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…