కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన జోడోయాత్ర ముగిసింది. కేరళలోని వయనాడ్ నియోజవర్గం ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ దేశ ప్రజలనుకలపాలనే ఉద్దేశంతో చేపట్టిన యాత్ర కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్విఘ్నంగా ముందుకు సాగింది. అయితే.. యాత్ర ముగిసిన నేపథ్యంలో అసలు ఫలితం ఎంత? దీని నుంచి కాంగ్రెస్ ఆశించింది.. ఆశిస్తోంది.. ఎంత అనే చర్చ తెరమీదికి వచ్చింది.
వాస్తవానికి ఒక నాయకుడు కానీ, ఒక పార్టీ కానీ ఏం చేసినా.. తమ వ్యక్తిగత ప్రయోజనం లేకుండా ఏమీ ఉండదు. అలాంటి అత్యంత ఖరీదైన యాత్రగా పేరు తెచ్చుకున్న జోడో యాత్ర ద్వారా కాంగ్రెస్ సాధించింది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. యాత్రసాగుతున్న సమయంలోనే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు వచ్చాయి. అయితే, గుజరాత్లో ఉన్న సీట్లు కూడా పోగొట్టుకుని కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది.
ఇక, హిమాచల్ ప్రదేశ్లోనూ ప్రజలు మార్పును కోరుకున్నారు కాబట్టి ఇక్కడ ముక్కీమూలిగీ బొటాబొటి మార్కులతో అధికారంలోకి వచ్చిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. దీంతో జోడో యాత్ర ప్రభావం ఆ ఎన్నికల్లో కనిపించలేదనేది స్పష్టమైంది. ఇక, ఇప్పుడు ఫిబ్రవరిలో ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాం డ్, మణిపుర్ రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ యాత్ర ఏమేరకు ఫలితం ఇస్తుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.
మరోవైపు జోడో యాత్రకు కొనసాగింపుగా.. రాష్ట్రాల స్థాయిలో హాత్ సే హాత్ యాత్ర చేపట్టాలని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నాయకులకు సమాచారం ఇచ్చింది. ఇదిలావుంటే, ఏపీ విషయానికి వస్తే.. కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితికి ఏమైనా వచ్చిందా? ఏపీలోనూ జోడో యాత్ర సాగిన నేపథ్యంలో దీని ప్రభావం ఏమైనా ఉందా? అంటే.. ఏమీ లేదనే సమాధానమే వస్తుండడం గమనార్హం. ఇక, ఈ యాత్రతాలూకు ఖర్చు మాత్రం కోట్లలోనే ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం.
This post was last modified on January 30, 2023 10:12 pm
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…
టాలీవుడ్లో బిగ్గెస్ట్ సినీ ఫ్యామిలీ ఏది అంటే.. మెగా కుటుంబం గురించే ముందుగా చెప్పుకోవాలి. ఆ కుటుంబంలో ఉన్నంత మంది…
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మలయాళ పరిశ్రమను మినహాయిస్తే.. ప్రతి చోటా సినిమాల మేకింగ్ బాగా టైం తీసుకుంటోంది. కొంచెం స్టార్ ఇమేజ్…
టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీకి పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన దివంగత నందమూరి తారక రామారావుకు భారత దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలన్నమాట నిత్యం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కూటమి పార్టీలకు చెందిన నేతల మధ్య…