Political News

రాహుల్ ను కలిసిన ఛోటా రాహుల్

మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తుంటాం. అయితే.. ఏదైనా రంగానికి చెందిన ప్రముఖులను పోలిన వారు చాలా తక్కువగా ఉంటారు. దగ్గర పోలికలు ఉండటం ఒక ఎత్తు. చూసేందుకు ఒకే మాదిరి ఉండటం మరో ఎత్తు. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి ఆవిష్క్రతమైంది. దీనికి జోడో యాత్ర వేదికగా మారింది.

కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరు.. గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని పోలినట్లుగా ఉంటే ఛోటా రాహుల్ తాజాగా కలవటం.. ఇద్దరు చేతులు బిగించి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం అందరిని ఆకర్షిస్తోంది. రాహుల్ గాంధీ యూత్ లో ఉంటే ఎలా ఉంటారన్న దానికి తగ్గట్లే.. ఛోటా రాహుల్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ ఛోటా రాహుల్ యువరైతుగా సుపరిచితుడు.

తన జీవితకాలంలో ఎప్పుడైనా ఒకసారి రాహుల్ గాంధీని కలవాలన్నది ఆయన ఆశ. అతడు ఉండే మేరఠ్ జిల్లా మవానా.. ఆ చుట్టుపక్కల వారంతా కూడా రాహుల్ పోలికలతో కనిపించే ఇతన్ని చూసి ఛోటా రాహుల్ గా పిలుస్తుంటారు. ఈ ఇమేజ్ తో అతని అసలు పేరైన మహమ్మద్ ఫైసల్ ఛౌదరి అన్న పేరును కూడా మర్చిపోతుంటారని చెబుతారు. ఛోటా రాహుల్ తండ్రి కాంగ్రెస్ కు వీరాభిమాని.

తండ్రి మరణంతో చదువుతున్న బీఏ కోర్సును మధ్యలో ఆపేసి.. వ్యవసాయం చేస్తున్న ఫైసల్.. భారత జోడో యాత్ర ఢిల్లీలో ఉన్న వేళలో రాహుల్ టీంతో కలిశారు. రాహుల్ ను కలిసి ఒక్క ఫోటో దిగాలన్న అతడి కోరిక ఎట్టకేలకు తీరింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. రాహుల్ వద్దకు వెళ్లాలన్న ఫైసల్ ఆత్రుతను గమనించిన రాహుల్.. అతన్ని తనకు దగ్గరగా పిలుచుకొని ఐదు నిమిషాలు మాట్లాడటమే కాదు.. కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో.. బడా రాహుల్ ను ఛోటా రాహుల్ కలిశారన్న మాట ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది.

Satya

Recent Posts

డిజిటల్ పాఠం నేర్పిస్తున్న పెద్ది ఫలితం

థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…

17 minutes ago

పోక్సో కేసు నిందితుడికి బెయిలు రానివ్వకూడదు: రేవంత్ తో పవన్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘ‌ట‌న దారుణం`` అని…

44 minutes ago

ప్రజాధనం అంటే పవన్ ఒప్పుకోరు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…

44 minutes ago

ముద్ర‌గ‌డ పాడె మోసిన జ‌గ‌న్‌

కాపు ఉద్య‌మ నాయ‌కుడు, మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అంత్య‌క్రియ‌లు ముగిశాయి. తూర్పుగోదావ‌రి జిల్లా కిర్లంపూడిలోని ఆయ‌న ఇంటి ప్రాంగ‌ణంలోనే…

1 hour ago

బాబు సర్కారును పొగిడిన కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల విధానాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. ఎల్‌నినో పరిస్థితుల్లోనూ నీటి సమస్య…

1 hour ago

అభిమానం తోడుతో… ఇంటికి చేరిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ముంబైలోని కోకిలా బెన్ ఆసుప‌త్రి నుంచి  డిశ్చార్జ్ అయి..…

2 hours ago