మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తుంటాం. అయితే.. ఏదైనా రంగానికి చెందిన ప్రముఖులను పోలిన వారు చాలా తక్కువగా ఉంటారు. దగ్గర పోలికలు ఉండటం ఒక ఎత్తు. చూసేందుకు ఒకే మాదిరి ఉండటం మరో ఎత్తు. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి ఆవిష్క్రతమైంది. దీనికి జోడో యాత్ర వేదికగా మారింది.
కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరు.. గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని పోలినట్లుగా ఉంటే ఛోటా రాహుల్ తాజాగా కలవటం.. ఇద్దరు చేతులు బిగించి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం అందరిని ఆకర్షిస్తోంది. రాహుల్ గాంధీ యూత్ లో ఉంటే ఎలా ఉంటారన్న దానికి తగ్గట్లే.. ఛోటా రాహుల్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ ఛోటా రాహుల్ యువరైతుగా సుపరిచితుడు.
తన జీవితకాలంలో ఎప్పుడైనా ఒకసారి రాహుల్ గాంధీని కలవాలన్నది ఆయన ఆశ. అతడు ఉండే మేరఠ్ జిల్లా మవానా.. ఆ చుట్టుపక్కల వారంతా కూడా రాహుల్ పోలికలతో కనిపించే ఇతన్ని చూసి ఛోటా రాహుల్ గా పిలుస్తుంటారు. ఈ ఇమేజ్ తో అతని అసలు పేరైన మహమ్మద్ ఫైసల్ ఛౌదరి అన్న పేరును కూడా మర్చిపోతుంటారని చెబుతారు. ఛోటా రాహుల్ తండ్రి కాంగ్రెస్ కు వీరాభిమాని.
తండ్రి మరణంతో చదువుతున్న బీఏ కోర్సును మధ్యలో ఆపేసి.. వ్యవసాయం చేస్తున్న ఫైసల్.. భారత జోడో యాత్ర ఢిల్లీలో ఉన్న వేళలో రాహుల్ టీంతో కలిశారు. రాహుల్ ను కలిసి ఒక్క ఫోటో దిగాలన్న అతడి కోరిక ఎట్టకేలకు తీరింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. రాహుల్ వద్దకు వెళ్లాలన్న ఫైసల్ ఆత్రుతను గమనించిన రాహుల్.. అతన్ని తనకు దగ్గరగా పిలుచుకొని ఐదు నిమిషాలు మాట్లాడటమే కాదు.. కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో.. బడా రాహుల్ ను ఛోటా రాహుల్ కలిశారన్న మాట ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది.
This post was last modified on January 30, 2023 11:26 am
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా సింగిల్ థియేటర్ల రెవెన్యూ విషయమై నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఎంత గొడవ నడుస్తోందో తెలిసిందే.…
నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో…