మనిషిని పోలిన మనుషులు ఉంటారంటారు. అప్పుడప్పుడు అలాంటి వారిని చూస్తుంటాం. అయితే.. ఏదైనా రంగానికి చెందిన ప్రముఖులను పోలిన వారు చాలా తక్కువగా ఉంటారు. దగ్గర పోలికలు ఉండటం ఒక ఎత్తు. చూసేందుకు ఒకే మాదిరి ఉండటం మరో ఎత్తు. తాజాగా అలాంటి కాంబినేషన్ ఒకటి ఆవిష్క్రతమైంది. దీనికి జోడో యాత్ర వేదికగా మారింది.
కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరు.. గాంధీ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీని పోలినట్లుగా ఉంటే ఛోటా రాహుల్ తాజాగా కలవటం.. ఇద్దరు చేతులు బిగించి ఫోటోలకు ఫోజులు ఇవ్వటం అందరిని ఆకర్షిస్తోంది. రాహుల్ గాంధీ యూత్ లో ఉంటే ఎలా ఉంటారన్న దానికి తగ్గట్లే.. ఛోటా రాహుల్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఈ ఛోటా రాహుల్ యువరైతుగా సుపరిచితుడు.
తన జీవితకాలంలో ఎప్పుడైనా ఒకసారి రాహుల్ గాంధీని కలవాలన్నది ఆయన ఆశ. అతడు ఉండే మేరఠ్ జిల్లా మవానా.. ఆ చుట్టుపక్కల వారంతా కూడా రాహుల్ పోలికలతో కనిపించే ఇతన్ని చూసి ఛోటా రాహుల్ గా పిలుస్తుంటారు. ఈ ఇమేజ్ తో అతని అసలు పేరైన మహమ్మద్ ఫైసల్ ఛౌదరి అన్న పేరును కూడా మర్చిపోతుంటారని చెబుతారు. ఛోటా రాహుల్ తండ్రి కాంగ్రెస్ కు వీరాభిమాని.
తండ్రి మరణంతో చదువుతున్న బీఏ కోర్సును మధ్యలో ఆపేసి.. వ్యవసాయం చేస్తున్న ఫైసల్.. భారత జోడో యాత్ర ఢిల్లీలో ఉన్న వేళలో రాహుల్ టీంతో కలిశారు. రాహుల్ ను కలిసి ఒక్క ఫోటో దిగాలన్న అతడి కోరిక ఎట్టకేలకు తీరింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. రాహుల్ వద్దకు వెళ్లాలన్న ఫైసల్ ఆత్రుతను గమనించిన రాహుల్.. అతన్ని తనకు దగ్గరగా పిలుచుకొని ఐదు నిమిషాలు మాట్లాడటమే కాదు.. కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. దీంతో.. బడా రాహుల్ ను ఛోటా రాహుల్ కలిశారన్న మాట ఇప్పుడు అందరి నోటా వినిపిస్తోంది.
This post was last modified on January 30, 2023 11:26 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…