కొన్ని కొన్ని విషయాలు.. చూసేందుకు చాలా బాగుంటాయి. వినేందుకు ఇంకా బాగుంటాయి. కానీ, వాటి మాటున అసలు సిసలు రాజకీయం దాగి ఉంటుందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కూడా.. ఇదే రాజకీయ వ్యూహాన్ని చాలా మెత్తగా.. కమ్మగా.. ఆవిష్కరించింది. పైకి ఎంతోమెప్పుగా కూడా ఉన్న ఈ వ్యూహం ఫక్తు.. తన స్వలాభానికేనన్న విషయం సుస్పష్టం.
తాజాగా రెండుతెలుగు రాష్ట్రాలకు భారీ ఎత్తున పద్మ అవార్డులు ప్రకటించారు. ఇది చాలా సంతోషించాల్సిన విషయం. అంతకుమించి.. గత ప్రభుత్వాలు ఇలా ఎప్పుడూ చేయలేదని.. అప్పట్లో ఎంతో అన్యా యం జరిగిందని కళ్లు తుడుచుకోవాల్సిన అంశం కూడా! ఎందుకంటే.. గత చరిత్రలో ఇంకో మాటలో చెప్పాలంటే.. స్వాతంత్రం వచ్చిన తర్వాత.. ఇప్పటి వరకు కూడా ఎవరూ ఇవ్వని విధంగా పద్మాలు రాలాయి.
ఒకింత లోతుగా గమనిస్తే..రెండు తెలుగు రాష్ట్రాలకే కాదు.. దక్షిణాదిలో ఉన్న తమిళనాడు, కర్ణాటకపై కూడా పద్మాల వర్షం కురిసింది. ఇదంతా కూడా.. అన్సంగ్ హీరోస్ను.. అంటే.. మట్టిలో మాణిక్యాలను మోడీ గుర్తించి ఇచ్చిన ప్రత్యేక గుర్తింపుగా ప్రచారం చేసుకునేందుకు.. చాలా బాగుంది. అయితే, అదే సమయం లో దీనిని కొంత తరచి చూస్తే.. ఫక్తు రాజకీయం కళ్లకు కడుతోంది. పద్మాల మాట వేసిన రాజకీయ వ్యూహాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఒకటి.. తెలంగాణలోను, కర్నాటకలోనూ.. ఈ ఏడాది ఎన్నికలు వున్నాయి. వీటిలో తెలంగాణను ప్రాణప్రదంగా తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. ఇక్కడ పాగా వేయాలని భావిస్తోంది. అదేసమయంలో ఉన్న అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు కమల నాథులు కర్ణాటకలో చక్రం తిప్పుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే పద్మాల వ్యూహాన్ని అమలు చేశారనేది విశ్లేషకుల అంచనాగా ఉంది. ఇక్కడి ప్రజల సెంటిమెంటును రగించడంతోపాటు.. కాంగ్రెస్ వంటి బలమైన పక్షాలను తొక్కి పెట్టడం కూడా దీనివెనుక ఉందని అంటున్నారు. మొత్తానికి ఈ పద్మ వ్యూహానికి ఓట్ల తుమ్మెదలు ఎన్ని వాలుతాయో చూడాలి.
This post was last modified on January 26, 2023 10:56 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…