అవును..! ఇప్పుడు వైసీపీకి ఐడియాలు కావాలి. వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించే నాయకులు కావాలి. ప్రస్తుతం ఉన్న ఐప్యాక్పై సీఎం జగన్ గుస్సాగానున్నారని తెలుస్తోంది. విపక్షాల దూకుడును కట్టడి చేసేలా ఐప్యాక్ టీం.. దూసుకుపోయేలా వ్యూహాలు రచించలేకపోతోందన్నది వైసీపీ అధినేత మనోగతంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు పాతచింతకాయి మాదిరిగా ఉన్నారని అంటున్నారట.
వీటివల్ల.. ప్రయోజనం దక్కడం కష్టమేనని అంటున్నారు. ఈ క్రమంలో కొత్త ఐడియాలకు ఆహ్వానం పలు కుతున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకోవాలంటే.. ప్రస్తుతం ఉన్న వ్యూహాలకు మరింత మసాలా కలపాల్సిన అవసరం ఉందని.. జగన్ నిర్ణయించేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై గత రెండు రోజులుగా సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో కొత్తగా పార్టీని ముందుకు నడిపించేలా.. ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుకునేలా ఐడియాలు ఇవ్వాలంటూ.. ఆయన జిల్లా ఇంచార్జ్లుగా ఉన్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల తూర్పు, అనంతపురం, ఉమ్మడి కృష్ణాజిల్లాలకు చెందిన ఇంచార్జ్లను కలుసుకు నేందుకు నాయకులు వెళ్లగా.. ఈ సందర్భంగా వారు.. నాయకులకు ఇదే చెప్పారని సమాచారం.
“ఇదిగో.. మనం ఒక సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. కోడి పందేలకు అనుమతుల కోసం.. వెంపర్లాడుతున్నారు. జగన్ సార్.. అసలు పందేలపై దృష్టి పెట్టారు. మీ దగ్గర మంచి కోళ్లు ఉంటే (ఐడియాలు) చెప్పండి. వాటిని ఎలా అమలు చేయాలో.. ఎలా రంగంలోకి దింపాలో సీఎం సార్ చూసుకుంటారు” అని తూర్పు గోదావరికి చెందిన ఒక మంత్రి చమత్కరించారట. ఇదే విషయంపై ఇతర మంత్రులు కూడా.. వ్యాఖ్యానించారని తెలుస్తోంది. మొత్తంగా .. ఇప్పుడు ఐడియాలు ఇచ్చేవారి కోసం వైసీపీ గేట్లు తెరిచి ఉంచిందని అంటున్నారు.
లోక నాయకుడు కమల్ హాసన్ చాలా సందర్భాల్లో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. భవిషత్తుని కూడా చక్కగా అంచనా వేస్తారు. విశ్వరూపం…
హఠాత్తుగా ఇరుముడి విడుదల తేదీ ప్రకటించేశారు. ఆగస్ట్ 21 థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా…
సోషల్ మీడియా టాక్స్, యూట్యూబ్ రివ్యూల హడావిడి ఎలా ఉన్నా పెద్ది బలంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న వైనం స్పష్టం.…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ రాజకీయాలు వేడెక్కాయి. గత రెండేళ్ల పాల నలో తాను చేసిన అభివృద్ధిని చూపించేందుకు..…
ఏపీ రాజధాని అమరావతికి అంత భూమి ఎందుకు? ఇంత భూమి ఎందుకు? ఏం చేసుకుంటారు.? 500 ఎకరాలు చాలవా? వెయ్యి…
ఫాం హౌస్లో కేడీ- ఢిల్లీలో మోడీ.. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో అభివృద్ధిని ఆపలేరు అని సీఎం రేవంత్…