అవును..! ఇప్పుడు వైసీపీకి ఐడియాలు కావాలి. వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కించే నాయకులు కావాలి. ప్రస్తుతం ఉన్న ఐప్యాక్పై సీఎం జగన్ గుస్సాగానున్నారని తెలుస్తోంది. విపక్షాల దూకుడును కట్టడి చేసేలా ఐప్యాక్ టీం.. దూసుకుపోయేలా వ్యూహాలు రచించలేకపోతోందన్నది వైసీపీ అధినేత మనోగతంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు పాతచింతకాయి మాదిరిగా ఉన్నారని అంటున్నారట.
వీటివల్ల.. ప్రయోజనం దక్కడం కష్టమేనని అంటున్నారు. ఈ క్రమంలో కొత్త ఐడియాలకు ఆహ్వానం పలు కుతున్నట్టు తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లోనూ విజయం దక్కించుకోవాలంటే.. ప్రస్తుతం ఉన్న వ్యూహాలకు మరింత మసాలా కలపాల్సిన అవసరం ఉందని.. జగన్ నిర్ణయించేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై గత రెండు రోజులుగా సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు.
ఈ క్రమంలో కొత్తగా పార్టీని ముందుకు నడిపించేలా.. ప్రజల్లో మరింత విశ్వాసం పెంచుకునేలా ఐడియాలు ఇవ్వాలంటూ.. ఆయన జిల్లా ఇంచార్జ్లుగా ఉన్న మంత్రులకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల తూర్పు, అనంతపురం, ఉమ్మడి కృష్ణాజిల్లాలకు చెందిన ఇంచార్జ్లను కలుసుకు నేందుకు నాయకులు వెళ్లగా.. ఈ సందర్భంగా వారు.. నాయకులకు ఇదే చెప్పారని సమాచారం.
“ఇదిగో.. మనం ఒక సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. కోడి పందేలకు అనుమతుల కోసం.. వెంపర్లాడుతున్నారు. జగన్ సార్.. అసలు పందేలపై దృష్టి పెట్టారు. మీ దగ్గర మంచి కోళ్లు ఉంటే (ఐడియాలు) చెప్పండి. వాటిని ఎలా అమలు చేయాలో.. ఎలా రంగంలోకి దింపాలో సీఎం సార్ చూసుకుంటారు” అని తూర్పు గోదావరికి చెందిన ఒక మంత్రి చమత్కరించారట. ఇదే విషయంపై ఇతర మంత్రులు కూడా.. వ్యాఖ్యానించారని తెలుస్తోంది. మొత్తంగా .. ఇప్పుడు ఐడియాలు ఇచ్చేవారి కోసం వైసీపీ గేట్లు తెరిచి ఉంచిందని అంటున్నారు.
This post was last modified on January 23, 2023 6:30 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…