Political News

పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్‌లోనూ కేసీఆర్ కంటివెలుగు యాడ్స్ ఇచ్చారట

కేసీఆర్ కంటివెలుగు పథకంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నర్సయ్య గౌడ్ ఇప్పుడు కేసీఆర్‌పై వేసిన సెటైర్లు బ్రహ్మాండంగా పేలుతున్నాయి.

కంటివెలుగు పథకం అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేస్తున్న హడావుడిగా ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్నికలకు ముందు ప్రజలకు కంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెర్చ్ చేయాలని ఆయన అన్నారు.

అంతేకాదు.. కంటివెలుగును పూర్తిగా ప్రచార కార్యక్రమంగా పేర్కొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకం ప్రచారానికి భారీగా ఖర్చు చేసిందని.. చివరకు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌లో కూడా పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందంటూ విమర్శలు కురిపించారు. కంటివెలుగు పథకానికి రూ. 200 కోట్లు కేటాయిస్తే అందులో 50 కోట్లు ప్రచారానికే వాడారని చెప్పారు.

ఈ పథకంలో భాగంగా కంటి సమస్యలున్నవారికి ఇచ్చే కళ్లద్దాల విలువ రూ. 35 కాగా కేసీఆర్ పెట్టుకునే కళ్లద్దాల విలువ రూ. 9 లక్షలని ఆయన ఆరోపించారు. గత కంటి వెలుగు కార్యక్రమం వల్ల తెలంగాణలో 18 మంది అంధులయ్యారని.. అలాంటిది జరగకుండా మళ్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాలని నర్సయ్యగౌడ్ అన్నారు. టెండర్లు పిలవకుండానే ఈ కళ్లద్దాల కాంట్రాక్టును ఓ బీఆర్ఎస్ నేతకు అప్పగించారని ఆయన ఆరోపించారు.

కంటివెలుగు కార్యక్రమం నిజంగా మంచి ఉద్దేశంతో చేపడితే అందుకోసం కొత్తగా డాక్టర్లను నియమించాల్సి ఉందని.. కొత్తగా తెలంగాణలో ఒక్క డాక్టరును కూడా నియమించలేదని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కొత్తగా ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదని బూర ఆరోపించారు.

మొత్తానికి బీజేపీలో చేరిన ఇన్ని నెలలకు బూర తన నోటికి పని చెప్పారని ఆ పార్టీ నేతలు సంతోషపడుతున్నారు. బూర ఇదే ఊపు కంటిన్యూ చేయాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారట. మరి.. వారి కోరికను ఆయన ఎంతవరకు తీర్చుతారో చూడాలి.

This post was last modified on January 22, 2023 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దురంధర్ 2 మూడో వేట మొదలు

మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…

6 minutes ago

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…

25 minutes ago

లేడీ డైరెక్టర్ ట్రెండ్ సెట్ చేస్తుందా?

సినీ రంగంలో మహిళలు నటనలోకి పెద్ద సంఖ్యలోనే వస్తారు కానీ.. టెక్నికల్ సైడ్ వెళ్లే వాళ్లు తక్కువ. అందులోనూ దర్శకత్వం వైపు అడుగులు…

2 hours ago

చివరి బంతి వరకు ఆడబోతున్న పెద్ది

పెద్ది వాయిదా గురించి కథనాలు వస్తూనే ఉన్నాయి. లేట్ లేదని రాకాస ప్రమోషన్ వీడియోలో రామ్ చరణ్ స్వయంగా చెప్పినా…

2 hours ago

‘జగన్ – కేసీఆర్’ జోడిని తలపించిన నాని

2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…

2 hours ago

సమయం మించిపోతోంది స్వయంభు

ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త  రిలీజ్…

3 hours ago