Political News

పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్‌లోనూ కేసీఆర్ కంటివెలుగు యాడ్స్ ఇచ్చారట

కేసీఆర్ కంటివెలుగు పథకంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నర్సయ్య గౌడ్ ఇప్పుడు కేసీఆర్‌పై వేసిన సెటైర్లు బ్రహ్మాండంగా పేలుతున్నాయి.

కంటివెలుగు పథకం అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేస్తున్న హడావుడిగా ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్నికలకు ముందు ప్రజలకు కంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెర్చ్ చేయాలని ఆయన అన్నారు.

అంతేకాదు.. కంటివెలుగును పూర్తిగా ప్రచార కార్యక్రమంగా పేర్కొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకం ప్రచారానికి భారీగా ఖర్చు చేసిందని.. చివరకు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌లో కూడా పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందంటూ విమర్శలు కురిపించారు. కంటివెలుగు పథకానికి రూ. 200 కోట్లు కేటాయిస్తే అందులో 50 కోట్లు ప్రచారానికే వాడారని చెప్పారు.

ఈ పథకంలో భాగంగా కంటి సమస్యలున్నవారికి ఇచ్చే కళ్లద్దాల విలువ రూ. 35 కాగా కేసీఆర్ పెట్టుకునే కళ్లద్దాల విలువ రూ. 9 లక్షలని ఆయన ఆరోపించారు. గత కంటి వెలుగు కార్యక్రమం వల్ల తెలంగాణలో 18 మంది అంధులయ్యారని.. అలాంటిది జరగకుండా మళ్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాలని నర్సయ్యగౌడ్ అన్నారు. టెండర్లు పిలవకుండానే ఈ కళ్లద్దాల కాంట్రాక్టును ఓ బీఆర్ఎస్ నేతకు అప్పగించారని ఆయన ఆరోపించారు.

కంటివెలుగు కార్యక్రమం నిజంగా మంచి ఉద్దేశంతో చేపడితే అందుకోసం కొత్తగా డాక్టర్లను నియమించాల్సి ఉందని.. కొత్తగా తెలంగాణలో ఒక్క డాక్టరును కూడా నియమించలేదని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కొత్తగా ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదని బూర ఆరోపించారు.

మొత్తానికి బీజేపీలో చేరిన ఇన్ని నెలలకు బూర తన నోటికి పని చెప్పారని ఆ పార్టీ నేతలు సంతోషపడుతున్నారు. బూర ఇదే ఊపు కంటిన్యూ చేయాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారట. మరి.. వారి కోరికను ఆయన ఎంతవరకు తీర్చుతారో చూడాలి.

This post was last modified on January 22, 2023 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago