Political News

పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్‌లోనూ కేసీఆర్ కంటివెలుగు యాడ్స్ ఇచ్చారట

కేసీఆర్ కంటివెలుగు పథకంపై బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నర్సయ్య గౌడ్ ఇప్పుడు కేసీఆర్‌పై వేసిన సెటైర్లు బ్రహ్మాండంగా పేలుతున్నాయి.

కంటివెలుగు పథకం అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ చేస్తున్న హడావుడిగా ఆయన పేర్కొన్నారు. అసలు ఎన్నికలకు ముందు ప్రజలకు కంటి సమస్యలు ఎందుకు వస్తాయనేది ప్రపంచ ఆరోగ్య సంస్థ రీసెర్చ్ చేయాలని ఆయన అన్నారు.

అంతేకాదు.. కంటివెలుగును పూర్తిగా ప్రచార కార్యక్రమంగా పేర్కొన్న ఆయన కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకం ప్రచారానికి భారీగా ఖర్చు చేసిందని.. చివరకు పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్‌లో కూడా పేపర్లలో ప్రకటనలు ఇచ్చిందంటూ విమర్శలు కురిపించారు. కంటివెలుగు పథకానికి రూ. 200 కోట్లు కేటాయిస్తే అందులో 50 కోట్లు ప్రచారానికే వాడారని చెప్పారు.

ఈ పథకంలో భాగంగా కంటి సమస్యలున్నవారికి ఇచ్చే కళ్లద్దాల విలువ రూ. 35 కాగా కేసీఆర్ పెట్టుకునే కళ్లద్దాల విలువ రూ. 9 లక్షలని ఆయన ఆరోపించారు. గత కంటి వెలుగు కార్యక్రమం వల్ల తెలంగాణలో 18 మంది అంధులయ్యారని.. అలాంటిది జరగకుండా మళ్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో చెప్పాలని నర్సయ్యగౌడ్ అన్నారు. టెండర్లు పిలవకుండానే ఈ కళ్లద్దాల కాంట్రాక్టును ఓ బీఆర్ఎస్ నేతకు అప్పగించారని ఆయన ఆరోపించారు.

కంటివెలుగు కార్యక్రమం నిజంగా మంచి ఉద్దేశంతో చేపడితే అందుకోసం కొత్తగా డాక్టర్లను నియమించాల్సి ఉందని.. కొత్తగా తెలంగాణలో ఒక్క డాక్టరును కూడా నియమించలేదని బూర నర్సయ్యగౌడ్ అన్నారు. రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కొత్తగా ఒక్క ఆసుపత్రి కూడా కట్టలేదని బూర ఆరోపించారు.

మొత్తానికి బీజేపీలో చేరిన ఇన్ని నెలలకు బూర తన నోటికి పని చెప్పారని ఆ పార్టీ నేతలు సంతోషపడుతున్నారు. బూర ఇదే ఊపు కంటిన్యూ చేయాలని బీజేపీ నేతలు కోరుకుంటున్నారట. మరి.. వారి కోరికను ఆయన ఎంతవరకు తీర్చుతారో చూడాలి.

This post was last modified on January 22, 2023 12:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలుగు సినిమాకు పెద్ద దిక్కు లేదా?

ఇండ‌స్ట్రీ పెద్ద ఎవ‌రు..? ఈ ప్ర‌శ్న టాలీవుడ్లో త‌ర‌చుగా వినిపిస్తుంటుంది. ఒక‌ప్పుడు ద‌ర్శ‌క ర‌త్న దాస‌రి నారాయ‌ణరావు ఈ పాత్ర‌ను…

21 minutes ago

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్… లుక్ మార్చిన మోదీ

ఎన్నిక‌లు అన‌గానే నాయ‌కుల్లో మార్పులు స‌హ‌జం. మ‌రీ ముఖ్యంగా ప్ర‌ధాన మంత్రిన‌రేంద్ర మోడీ అయితే.. మ‌రింత ఎక్కువ‌గా శ్ర‌ద్ధ తీసుకుంటారు.…

2 hours ago

తమన్నాకు తెలుగులో మళ్లీ ఓ మంచి ఛాన్స్?

ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…

7 hours ago

8 వారాల వైపు సీరియస్ అడుగులు

థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…

7 hours ago

ఈసారి జ‌గ‌న్ వదిలిన ట్రోల్ పాయింట్?

అధికారంలోకి రావ‌డానికి ముందు వ‌ర‌కు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చాలా ఫెరోషియ‌స్‌గా క‌నిపించేవారు. అవినీతి కేసుల వ్య‌వ‌హారం పక్క‌న పెడితే…

8 hours ago

బన్నీ గ్లింప్స్ షారుఖ్ చేతుల మీదుగా?

‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…

8 hours ago