2002- సంవత్సరంలో దేశంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలేంటి? అనగానే వెంటనే గుజరాత్లో చోటు చేసు కున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అనేది తొలి వరుసలో ఉంటుంది. దీనికి కారణం.. అప్పట్లో దేశాన్ని ఈ ఘటన కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోడీనే ఉన్నారు.
దీంతో ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ వివాదం తిరిగింది. ఎట్టకేలకు రెండేళ్ల కిందట.. మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. దీంతో ఈ విషయం సమసిపోయిందని అందరూ భావిస్తున్న సమయం లో అనూహంగా ఇప్పుడు బ్రిటన్కు చెందిన బీబీసీ మీడియా ఇదే గుజరాత్ అల్లర్లపై “ద మోడీ క్వశ్చన్” పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో మోడీ సీఎంగా ఉన్న సమయాన్ని ప్రస్తావించారు.
విశ్వహిందూపరిషత్.. ఆర్ఎస్ఎస్లు కలిసి ఉమ్మడిగా ఈ దారుణ మారణహోమాన్ని సృష్టించాయని పేర్కొన్న ఈ డాక్యమెంటరీ.. దీనికి బలమైన ఊతం మోడీనేనని పేర్కొనడం భారత్కు మంటెత్తిస్తోంది. ముఖ్యంగా ‘విశ్వగురువుగా’ కీర్తించబడుతున్న మోడీకి భారీ సెగ పెట్టింది. అంతేకాదు.. మోడీ అండ చూసుకుని అవి రెచ్చిపోయాయని అందుకే 2002లో గుజరాత్ అట్టుడికిందని పేర్కొంది.
ఇక, ఈ డాక్యుమెంటరీ సిరీస్పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వసనీయత లేని డాక్యుమెంటరీ అంటూ దుయ్యబట్టింది. బ్రిటన్లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని కేంద్రం ఆరోపించింది. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నాని పేర్కొంది.
This post was last modified on January 20, 2023 8:56 am
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…
ఏపీలో పోలీసుల అత్యుత్సాహం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. వివిధ నేరాల్లో నిందితులను నడిరోడ్డుపై కొట్టడం, వారిని రోడ్డుపైనే నడిపించుకుంటూ వెళ్లడం,…
జనసేన పార్టీ కీలక నాయకుడు, ఎమ్మెల్సీ నాగబాబు.. బుధవారం చేసిన వ్యాఖ్యలు, దీనికి ముందు కొన్నాళ్ల కిందట ఆయన ఓ…
అంబటి రాంబాబు కాపు కులంలో ఒక టైగర్లాంటి వ్యక్తి అని, ప్రాణభయంతోనే ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చిందని వైఎస్సార్సీపీ…