Political News

గుజ‌రాత్ అల్ల‌ర్లు-మోడీ-బీబీసీ.. తాజా వివాదం!

2002- సంవ‌త్స‌రంలో దేశంలో జ‌రిగిన కొన్ని కీల‌క ఘ‌ట్టాలేంటి? అన‌గానే వెంట‌నే గుజ‌రాత్‌లో చోటు చేసు కున్న అల్ల‌ర్లు, గోద్రా రైలు దుర్ఘ‌ట‌న అనేది తొలి వ‌రుస‌లో ఉంటుంది. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో దేశాన్ని ఈ ఘ‌ట‌న కుదిపేసింది. కొన్ని ఏళ్ల త‌ర‌బ‌డి దీనిపై విచార‌ణ‌లు సాగాయి. అప్ప‌టి ఈ మార‌ణ హోమం జ‌రిగిన స‌మ‌యంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీనే ఉన్నారు.

దీంతో ఈ వివాదం చుట్టూ ఆయ‌న‌.. ఆయ‌న చుట్టూ ఈ వివాదం తిరిగింది. ఎట్ట‌కేల‌కు రెండేళ్ల కింద‌ట‌.. మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. దీంతో ఈ విష‌యం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావిస్తున్న స‌మ‌యం లో అనూహంగా ఇప్పుడు బ్రిట‌న్‌కు చెందిన బీబీసీ మీడియా ఇదే గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై “ద మోడీ క్వ‌శ్చ‌న్‌” పేరుతో డాక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసింది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో మోడీ సీఎంగా ఉన్న స‌మ‌యాన్ని ప్ర‌స్తావించారు.

విశ్వ‌హిందూప‌రిష‌త్‌.. ఆర్ఎస్ఎస్‌లు క‌లిసి ఉమ్మ‌డిగా ఈ దారుణ మార‌ణ‌హోమాన్ని సృష్టించాయ‌ని పేర్కొన్న ఈ డాక్య‌మెంట‌రీ.. దీనికి బ‌ల‌మైన ఊతం మోడీనేన‌ని పేర్కొన‌డం భార‌త్‌కు మంటెత్తిస్తోంది. ముఖ్యంగా ‘విశ్వ‌గురువుగా’ కీర్తించ‌బడుతున్న మోడీకి భారీ సెగ పెట్టింది. అంతేకాదు.. మోడీ అండ చూసుకుని అవి రెచ్చిపోయాయ‌ని అందుకే 2002లో గుజ‌రాత్ అట్టుడికింద‌ని పేర్కొంది.

ఇక‌, ఈ డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వసనీయత లేని డాక్యుమెంటరీ అంటూ దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని కేంద్రం ఆరోపించింది. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నాని పేర్కొంది.

This post was last modified on January 20, 2023 8:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎల‌క్ష‌న్ మూడ్‌: మోడీ మ్యానియా ఫ‌లించేనా?

దేశంలో ప్ర‌స్తుతం ఎన్నిక‌ల మూడ్ నెల‌కొంది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వీటిలో బీజేపీ పాలిత అస్సాం, బీజేపీ…

45 minutes ago

అభిమానులను ఊరిస్తున్న ‘ఉస్తాద్’ తొలిప్రేమ

ఉస్తాద్ భగత్ సింగ్ బయటికి చెప్పని కొన్ని సర్ప్రైజులు ఒక్కొక్కటిగా రివీల్ అవుతున్నాయి. తాజాగా మా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో…

2 hours ago

రీల్ కోసం స్టంట్… ప్రాణం తీసిన తుపాకీ

ఢిల్లీలో సోషల్ మీడియా పిచ్చి ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తుపాకీతో స్టంట్ చేస్తూ…

3 hours ago

పిఠాపురానికి ప్ర‌త్యేకం.. ప‌వ‌న్ ఏం చేశారంటే ..!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాతీయ‌ల‌పై ప‌ట్టు పెంచుకునే విధంగా కార్యాచ‌ర‌ణ ప్రారంభించిన…

4 hours ago

దేవి కోసమే తమన్‌‌ రాలేదట

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పని చేసిన సంగతి తెలిసిందే. దేవిశ్రీ ప్రసాద్ పాటలు…

5 hours ago

చివరి నిమిషం ఒత్తిడిలో దురంధర్ రివెంజ్

రేపు సాయంత్రం విడుదల కాబోతున్న దురంధర్ ది రివెంజ్ ని చివరి నిమిషం ఒత్తిళ్లు ఇబ్బంది పెడుతున్నాయని బాలీవుడ్ టాక్.…

5 hours ago