2002- సంవత్సరంలో దేశంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలేంటి? అనగానే వెంటనే గుజరాత్లో చోటు చేసు కున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అనేది తొలి వరుసలో ఉంటుంది. దీనికి కారణం.. అప్పట్లో దేశాన్ని ఈ ఘటన కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోడీనే ఉన్నారు.
దీంతో ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ వివాదం తిరిగింది. ఎట్టకేలకు రెండేళ్ల కిందట.. మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. దీంతో ఈ విషయం సమసిపోయిందని అందరూ భావిస్తున్న సమయం లో అనూహంగా ఇప్పుడు బ్రిటన్కు చెందిన బీబీసీ మీడియా ఇదే గుజరాత్ అల్లర్లపై “ద మోడీ క్వశ్చన్” పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో మోడీ సీఎంగా ఉన్న సమయాన్ని ప్రస్తావించారు.
విశ్వహిందూపరిషత్.. ఆర్ఎస్ఎస్లు కలిసి ఉమ్మడిగా ఈ దారుణ మారణహోమాన్ని సృష్టించాయని పేర్కొన్న ఈ డాక్యమెంటరీ.. దీనికి బలమైన ఊతం మోడీనేనని పేర్కొనడం భారత్కు మంటెత్తిస్తోంది. ముఖ్యంగా ‘విశ్వగురువుగా’ కీర్తించబడుతున్న మోడీకి భారీ సెగ పెట్టింది. అంతేకాదు.. మోడీ అండ చూసుకుని అవి రెచ్చిపోయాయని అందుకే 2002లో గుజరాత్ అట్టుడికిందని పేర్కొంది.
ఇక, ఈ డాక్యుమెంటరీ సిరీస్పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వసనీయత లేని డాక్యుమెంటరీ అంటూ దుయ్యబట్టింది. బ్రిటన్లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని కేంద్రం ఆరోపించింది. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నాని పేర్కొంది.
This post was last modified on January 20, 2023 8:56 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…