Political News

గుజ‌రాత్ అల్ల‌ర్లు-మోడీ-బీబీసీ.. తాజా వివాదం!

2002- సంవ‌త్స‌రంలో దేశంలో జ‌రిగిన కొన్ని కీల‌క ఘ‌ట్టాలేంటి? అన‌గానే వెంట‌నే గుజ‌రాత్‌లో చోటు చేసు కున్న అల్ల‌ర్లు, గోద్రా రైలు దుర్ఘ‌ట‌న అనేది తొలి వ‌రుస‌లో ఉంటుంది. దీనికి కార‌ణం.. అప్ప‌ట్లో దేశాన్ని ఈ ఘ‌ట‌న కుదిపేసింది. కొన్ని ఏళ్ల త‌ర‌బ‌డి దీనిపై విచార‌ణ‌లు సాగాయి. అప్ప‌టి ఈ మార‌ణ హోమం జ‌రిగిన స‌మ‌యంలో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీనే ఉన్నారు.

దీంతో ఈ వివాదం చుట్టూ ఆయ‌న‌.. ఆయ‌న చుట్టూ ఈ వివాదం తిరిగింది. ఎట్ట‌కేల‌కు రెండేళ్ల కింద‌ట‌.. మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. దీంతో ఈ విష‌యం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావిస్తున్న స‌మ‌యం లో అనూహంగా ఇప్పుడు బ్రిట‌న్‌కు చెందిన బీబీసీ మీడియా ఇదే గుజ‌రాత్ అల్ల‌ర్ల‌పై “ద మోడీ క్వ‌శ్చ‌న్‌” పేరుతో డాక్యుమెంట‌రీని ప్ర‌సారం చేసింది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో మోడీ సీఎంగా ఉన్న స‌మ‌యాన్ని ప్ర‌స్తావించారు.

విశ్వ‌హిందూప‌రిష‌త్‌.. ఆర్ఎస్ఎస్‌లు క‌లిసి ఉమ్మ‌డిగా ఈ దారుణ మార‌ణ‌హోమాన్ని సృష్టించాయ‌ని పేర్కొన్న ఈ డాక్య‌మెంట‌రీ.. దీనికి బ‌ల‌మైన ఊతం మోడీనేన‌ని పేర్కొన‌డం భార‌త్‌కు మంటెత్తిస్తోంది. ముఖ్యంగా ‘విశ్వ‌గురువుగా’ కీర్తించ‌బడుతున్న మోడీకి భారీ సెగ పెట్టింది. అంతేకాదు.. మోడీ అండ చూసుకుని అవి రెచ్చిపోయాయ‌ని అందుకే 2002లో గుజ‌రాత్ అట్టుడికింద‌ని పేర్కొంది.

ఇక‌, ఈ డాక్యుమెంటరీ సిరీస్‌పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వసనీయత లేని డాక్యుమెంటరీ అంటూ దుయ్యబట్టింది. బ్రిటన్‌లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని కేంద్రం ఆరోపించింది. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నాని పేర్కొంది.

Satya

Recent Posts

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

5 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

6 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

7 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

9 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

9 hours ago

పవన్ నోట మరోమారు ‘తెలంగాణ’ మాట

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…

10 hours ago