2002- సంవత్సరంలో దేశంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలేంటి? అనగానే వెంటనే గుజరాత్లో చోటు చేసు కున్న అల్లర్లు, గోద్రా రైలు దుర్ఘటన అనేది తొలి వరుసలో ఉంటుంది. దీనికి కారణం.. అప్పట్లో దేశాన్ని ఈ ఘటన కుదిపేసింది. కొన్ని ఏళ్ల తరబడి దీనిపై విచారణలు సాగాయి. అప్పటి ఈ మారణ హోమం జరిగిన సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రస్తుత ప్రధాని మోడీనే ఉన్నారు.
దీంతో ఈ వివాదం చుట్టూ ఆయన.. ఆయన చుట్టూ ఈ వివాదం తిరిగింది. ఎట్టకేలకు రెండేళ్ల కిందట.. మోడీకి కోర్టులు క్లీన్ చిట్ ఇచ్చాయి. దీంతో ఈ విషయం సమసిపోయిందని అందరూ భావిస్తున్న సమయం లో అనూహంగా ఇప్పుడు బ్రిటన్కు చెందిన బీబీసీ మీడియా ఇదే గుజరాత్ అల్లర్లపై “ద మోడీ క్వశ్చన్” పేరుతో డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. దీనిలో రెండు భాగాలు ఉన్నాయి. ఈ రెండు భాగాల్లో మోడీ సీఎంగా ఉన్న సమయాన్ని ప్రస్తావించారు.
విశ్వహిందూపరిషత్.. ఆర్ఎస్ఎస్లు కలిసి ఉమ్మడిగా ఈ దారుణ మారణహోమాన్ని సృష్టించాయని పేర్కొన్న ఈ డాక్యమెంటరీ.. దీనికి బలమైన ఊతం మోడీనేనని పేర్కొనడం భారత్కు మంటెత్తిస్తోంది. ముఖ్యంగా ‘విశ్వగురువుగా’ కీర్తించబడుతున్న మోడీకి భారీ సెగ పెట్టింది. అంతేకాదు.. మోడీ అండ చూసుకుని అవి రెచ్చిపోయాయని అందుకే 2002లో గుజరాత్ అట్టుడికిందని పేర్కొంది.
ఇక, ఈ డాక్యుమెంటరీ సిరీస్పై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశ్వసనీయత లేని డాక్యుమెంటరీ అంటూ దుయ్యబట్టింది. బ్రిటన్లోని అంతర్గత నివేదిక ఆధారంగా రూపొందించిన ఈ డాక్యుమెంటరీలో వలసవాద మనస్తత్వం, ఆలోచనా ధోరణి కనిపిస్తోందని పేర్కొంది. తప్పుదారి పట్టించే, పక్షపాతంతో కూడిన ప్రచారమని కేంద్రం ఆరోపించింది. పక్షపాతం ఉండటం, నిష్పాక్షికత లేకపోవడం, వలసవాద ఆలోచనా ధోరణిని యథేచ్ఛగా కొనసాగించడం ఆలస్యంగా స్పష్టమవుతున్నాయన్నాని పేర్కొంది.
This post was last modified on January 20, 2023 8:56 am
ఏదైనా క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేస్తారు. బొమ్మ పడుతుందా బొరుసు పడుతుందాని ఇరు జట్ల కెప్టెన్లు ఎదురు…
బీజేపీ, బీఎస్పీ అధినేత మాయావతిల మధ్య అంతర్గత ఒప్పందం ఉందన్నది బహిరంగ రహస్యం. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ బీఎస్పీ మాయావతి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ అభిమానులు డబుల్ ఇస్మార్ట్ విడుదల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అన్నీ సవ్యంగా…
400 సీట్ల నినాదం. 370 స్థానాలలో విజయం సాధించాలన్న ప్రణాళిక. మరి దక్షిణ భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో…
ఫొటోల పిచ్చి అనండి.. ప్రచార పిచ్చి అనండి.. ఏదేమైనా ఏపీలోని వైసీపీ ప్రభుత్వం చేజేతులా చేసుకున్న వ్యవహారం ఇప్పుడు పీకల…
నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న స్వయంభు షూటింగ్ వేగమందుకుంది. సుమరు ఎనిమిది కోట్ల బడ్జెట్…