Political News

దేశ‌మంతా ఉచిత విద్యుత్‌: కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

ఖమ్మంలో జ‌రిగిన‌ బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వ‌స్తే.. దేశం మొత్తం రైతుల‌కు ఉచితంగా క‌రెంటు ఇస్తామ‌న్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేత‌లు దేశంలో మతపిచ్చి లేపుతున్నారని మండిప‌డ్డారు. బీఆర్ఎస్‌ను ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తే.. కేంద్రం తీసుకువ‌చ్చిన ‘అగ్నిపథ్’ పథకాన్ని రద్దు చేస్తామని కూడా కేసీఆర్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. నష్టాలు సమాజానికి.. లాభాలు ప్రైవేటు వ్యక్తులకా? అని ప్రశ్నించారు. ఎల్‌ఐసీని అడ్డికి పావుసేరుకు అమ్ముతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌ఐసీ కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఎల్‌ఐసీ ఏజెంట్లు, ఉద్యోగులు బీఆర్ఎస్‌ను బలపరచాలన్నారు. “విద్యుత్ కార్మికులారా? పిడికిలి బిగించండి. విద్యుత్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచుతాం. ఇంకా దేశంలో లక్ష కోట్ల మెగావాట్ల జల విద్యుత్‌కు అవకాశం ఉంది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

దళితబంధును దేశమంతా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నా.. మీరు ఇవ్వకపోతే మేము దేశమంతా దళితబంధు ఇస్తామ‌ని మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలో ఆంధ్రుల హ‌క్కుగా ఏర్ప‌డిన విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటుపరం కానివ్వమని కేసీఆర్ తేల్చి చెప్పారు. విశాఖ ఉక్కును మోడీ అమ్మితే బీఆర్ఎస్‌ అధికారంలోకి వచ్చాక కొంటామని అన్నారు. లొడలొడ మాట్లాడే ప్రధానికి ప్ర‌జ‌ల‌కు మంచి నీళ్లు ఇవ్వడం చేతకాదా? అని విమర్శించారు.

మేక్ ఇన్‌ ఇండియా.. జోక్‌ ఇన్‌ ఇండియాగా మారిందని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కొద్దిరోజుల్లోనే బీఆర్ఎస్ విధానాలు ప్రజల ముందుంచుతామని తెలిపారు. 150 మంది మేధావులు బీఆర్ఎస్ విధానాలు రూపొందిస్తున్నారన్నారు. తెలంగాణ మోడల్‌ దేశమంతా అమలు చేస్తామ‌ని చెప్పారు.

This post was last modified on January 18, 2023 9:06 pm

Share

Recent Posts

రవితేజకు డబ్బులే డబ్బులు

మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…

3 hours ago

దృశ్యం 4… ఇంకెన్నిసార్లు సాగదీస్తారో

ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…

3 hours ago

హైదరాబాద్ వచ్చిన జాంబీరెడ్డి ఏం చేయబోతున్నాడు

కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…

3 hours ago

మహిళను చంపి…. బిర్యానీ వండి…

ఏమైందో ఏమో కానీ ఆ దంపతులు ఒక మహిళను హత్య చేశారు. హత్య చేసి తీరిగ్గా ఆ మహిళ దేహాన్ని…

4 hours ago

బాలయ్య తీసుకునేది తెలివైన నిర్ణయమే

ప్రమాదంలో కలిగిన గాయం వల్ల చికిత్స చేయించుకుని విశ్రాంతిలో ఉన్న బాలకృష్ణ డాక్టర్లు చెప్పిన టైం కన్నా ముందే షూటింగ్…

4 hours ago

హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఐమాక్స్?

దేశంలో సినీ అభిమానం పరంగా టాప్‌లో నిలిచే తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యమే. గతంలో ప్రసాద్స్‌లో ఈ…

4 hours ago