నందమూరి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి కానుక ఇచ్చారా? ఆ కుటుంబంతో ఉన్న రాజకీయ అనుబంధాన్ని మరింత పెంచుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నేతలు. కీలకమైన గుడివాడ నియోజకవర్గం టికెట్ను నందమూరి కుటుంబానికి కన్ఫర్మ్ చేసినట్టు పెద్ద ఎత్తున టీడీపీలో చర్చసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నందమూరి కుటుంబానికి ఈ కానుక ఇచ్చారని మీడియా వర్గాలకు సమాచారం అందింది. దీంతో టీడీపీ శ్రేణు్ల్లో ఉత్సాహం నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారనేది తెలిసిందే. ఒకటి టీడీపీకి కంచుకోటగా ఉన్న ఒకప్పటి నియోజకవర్గాన్ని దక్కించుకోవడం ఒక లక్ష్యం అయితే.. మరొక ప్రధాన కారణం.. తనపైనా.. తనకుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేసి.. తన కుటుంబాన్ని అవమానించిన మాజీ మంత్రి కొడాలి నానిని మట్టి కరిపించాలనేది మరో కారణం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అనుకూల మైన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతానికి రావి వెంకటేశ్వరరావుకు పగ్గాలు అప్పగించారు.
అయితే.. గతంలో ఆయన ఒకసారి మాత్రమే విజయం దక్కించుకుని ఉండడం.. ఇప్పుడు నాని మరింత బలంగా ఉండడంతో రావి గెలుపుపై చంద్రబాబు కొన్ని సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఎన్నారై వ్యాపార వేత్తను ఇక్కడ నుంచినిలబెట్టాలని భావించారు. దీనికి అన్ని వైపుల నుంచి సంకేతాలు కూడా వస్తున్న క్రమంలో అనూహ్యంగా నందమూరి కుటుంబం నుంచి తారకరత్న ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఆ వెంటనే ఆయన గుంటూరులోనూ పర్యటించారు.
ఇక, ఏదో ఒక నియోజకవర్గం అయితే.. పసలేదని భావిస్తున్న తారకతర్న.. తన తాత, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన నియోజకవర్గం (పొరుగునే ఉంది) నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే.. అది రిజర్వడ్ కావడంతో గుడివాడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. దీనిపై మొదట్లో తటపటాయించిన చంద్రబాబు.. ఇప్పుడు బాలయ్య ఎంట్రీతో సంక్రాంతి సందర్భంగా.. ఓకే చెప్పారని.. తెలిసింది. తారకరత్నను గెలిపించుకునే బాధ్యత నందమూరి కుటుంబం తీసుకుంటుందని బాలయ్య ప్రత్యక్షంగా చెప్పి హామీ ఇచ్చారని.. దీంతో బాబు ఓకే చేశారని టాక్.
This post was last modified on January 18, 2023 9:05 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…