నందమూరి కుటుంబానికి టీడీపీ అధినేత చంద్రబాబు సంక్రాంతి కానుక ఇచ్చారా? ఆ కుటుంబంతో ఉన్న రాజకీయ అనుబంధాన్ని మరింత పెంచుకుంటున్నారా? అంటే.. ఔననే అంటున్నారు టీడీపీ నేతలు. కీలకమైన గుడివాడ నియోజకవర్గం టికెట్ను నందమూరి కుటుంబానికి కన్ఫర్మ్ చేసినట్టు పెద్ద ఎత్తున టీడీపీలో చర్చసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా చంద్రబాబు నందమూరి కుటుంబానికి ఈ కానుక ఇచ్చారని మీడియా వర్గాలకు సమాచారం అందింది. దీంతో టీడీపీ శ్రేణు్ల్లో ఉత్సాహం నెలకొంది.
వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గంపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారనేది తెలిసిందే. ఒకటి టీడీపీకి కంచుకోటగా ఉన్న ఒకప్పటి నియోజకవర్గాన్ని దక్కించుకోవడం ఒక లక్ష్యం అయితే.. మరొక ప్రధాన కారణం.. తనపైనా.. తనకుటుంబంపైనా తీవ్ర విమర్శలు చేసి.. తన కుటుంబాన్ని అవమానించిన మాజీ మంత్రి కొడాలి నానిని మట్టి కరిపించాలనేది మరో కారణం. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అనుకూల మైన వ్యక్తుల కోసం వెతుకుతున్నారు. ప్రస్తుతానికి రావి వెంకటేశ్వరరావుకు పగ్గాలు అప్పగించారు.
అయితే.. గతంలో ఆయన ఒకసారి మాత్రమే విజయం దక్కించుకుని ఉండడం.. ఇప్పుడు నాని మరింత బలంగా ఉండడంతో రావి గెలుపుపై చంద్రబాబు కొన్ని సందేహాలు నెలకొన్నాయి. దీంతో ఎన్నారై వ్యాపార వేత్తను ఇక్కడ నుంచినిలబెట్టాలని భావించారు. దీనికి అన్ని వైపుల నుంచి సంకేతాలు కూడా వస్తున్న క్రమంలో అనూహ్యంగా నందమూరి కుటుంబం నుంచి తారకరత్న ఎంట్రీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజకీయాల్లోకి వస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాదు.. ఆ వెంటనే ఆయన గుంటూరులోనూ పర్యటించారు.
ఇక, ఏదో ఒక నియోజకవర్గం అయితే.. పసలేదని భావిస్తున్న తారకతర్న.. తన తాత, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పుట్టిన నియోజకవర్గం (పొరుగునే ఉంది) నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. అయితే.. అది రిజర్వడ్ కావడంతో గుడివాడ నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. దీనిపై మొదట్లో తటపటాయించిన చంద్రబాబు.. ఇప్పుడు బాలయ్య ఎంట్రీతో సంక్రాంతి సందర్భంగా.. ఓకే చెప్పారని.. తెలిసింది. తారకరత్నను గెలిపించుకునే బాధ్యత నందమూరి కుటుంబం తీసుకుంటుందని బాలయ్య ప్రత్యక్షంగా చెప్పి హామీ ఇచ్చారని.. దీంతో బాబు ఓకే చేశారని టాక్.
This post was last modified on January 18, 2023 9:05 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…