తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనూహ్యమైన ఆదరణ దక్కింది. ప్రధాని మోదీ స్వయంగా ఆయన్ను అభినందించడంతో పాటు ఆయన్ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.
సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్ తెలంగాణలో పార్టీ పనితీరును వివరించడమే కాకుండా తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి నివేదిక సమర్పించారు. దాంతో ప్రజాసంగ్రామ యాత్ర గురించి అందరికీ వివరించాలని మోదీ సూచించడంతో బండి తన యాత్ర గురించి చెప్పడం ప్రారంభించారు. తొలుత హిందీలో మాట్లాడిన ఆయన కొద్దిసేపటికే ఆపేసి తనయాత్ర ఎన్నో భావోద్వేగాలతో కూడినదని… హిందీలో తాను చెప్పేటప్పుడు ఆ భావోద్వేగాలను వ్యక్తీకరించలేకపోతున్నానని అన్నారు. దాంతో మోదీ స్పందించి.. హిందీలో వద్దు మీ మాతృభాష తెలుగులోనే చెప్పండని సూచించారు. దాంతో బండి సంజయ్ తన యాత్ర వివరాలన్నీ తెలుగులోనే చెప్తుండగా బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ దాన్ని హిందీలోకి అనువదించారు.
మొత్తం సావధానంగా విన్న మోదీ ఇతర రాష్ట్రాల నేతలంతా బండి చేపట్టిన యాత్ర ప్రాంతాలలో తిరిగి అధ్యయనం చేయాలని.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల యువమోర్చా నేతలను ఆ ప్రాంతాలకు పంపితే అది వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఇతర రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు సూచించారు. బండి సంజయ్ను భుజం తట్టి అభినందించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తన ప్రసంగంలో బండి పాదయాత్రను ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు.
మోదీ, నడ్డాలు బండిని ప్రత్యేకంగా ప్రశంసించడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ బండి సంజయ్పై పడింది. జాతీయ రాజకీయాలంటూ తొడ గొడుతున్న కేసీఆర్ను వెంటపడి తరుముతున్న నేతగా బండి సంజయ్ను ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రశంసించడం కనిపించింది.
కాగా తాజా పరిణామాలతో బండి సంజయ్ను మారుస్తారంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడుతూ ఆయన్నే ఎన్నికల వరకు కొనసాగిస్తారన్న ప్రచారం మొదలైంది.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…