తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కు ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో అనూహ్యమైన ఆదరణ దక్కింది. ప్రధాని మోదీ స్వయంగా ఆయన్ను అభినందించడంతో పాటు ఆయన్ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తున్నారంటూ ప్రశంసలు కురిపించారు.
సోమవారం ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో బండి సంజయ్ తెలంగాణలో పార్టీ పనితీరును వివరించడమే కాకుండా తాను చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర గురించి నివేదిక సమర్పించారు. దాంతో ప్రజాసంగ్రామ యాత్ర గురించి అందరికీ వివరించాలని మోదీ సూచించడంతో బండి తన యాత్ర గురించి చెప్పడం ప్రారంభించారు. తొలుత హిందీలో మాట్లాడిన ఆయన కొద్దిసేపటికే ఆపేసి తనయాత్ర ఎన్నో భావోద్వేగాలతో కూడినదని… హిందీలో తాను చెప్పేటప్పుడు ఆ భావోద్వేగాలను వ్యక్తీకరించలేకపోతున్నానని అన్నారు. దాంతో మోదీ స్పందించి.. హిందీలో వద్దు మీ మాతృభాష తెలుగులోనే చెప్పండని సూచించారు. దాంతో బండి సంజయ్ తన యాత్ర వివరాలన్నీ తెలుగులోనే చెప్తుండగా బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ దాన్ని హిందీలోకి అనువదించారు.
మొత్తం సావధానంగా విన్న మోదీ ఇతర రాష్ట్రాల నేతలంతా బండి చేపట్టిన యాత్ర ప్రాంతాలలో తిరిగి అధ్యయనం చేయాలని.. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల యువమోర్చా నేతలను ఆ ప్రాంతాలకు పంపితే అది వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఇతర రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు సూచించారు. బండి సంజయ్ను భుజం తట్టి అభినందించారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా తన ప్రసంగంలో బండి పాదయాత్రను ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు.
మోదీ, నడ్డాలు బండిని ప్రత్యేకంగా ప్రశంసించడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టీ బండి సంజయ్పై పడింది. జాతీయ రాజకీయాలంటూ తొడ గొడుతున్న కేసీఆర్ను వెంటపడి తరుముతున్న నేతగా బండి సంజయ్ను ఇతర రాష్ట్రాల బీజేపీ నేతలు ప్రశంసించడం కనిపించింది.
కాగా తాజా పరిణామాలతో బండి సంజయ్ను మారుస్తారంటూ కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడుతూ ఆయన్నే ఎన్నికల వరకు కొనసాగిస్తారన్న ప్రచారం మొదలైంది.
This post was last modified on January 18, 2023 8:52 am
చిన్న సినిమాలకు ఉన్న అతి పెద్ద సమస్య ఓపెనింగ్స్ తెచ్చుకోవడం. ప్రమోషన్ టైంలో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వకపోతే…
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థాన పాలకమండలిలో సీనియర్ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు సభ్యురాలిగా చోటు కల్పించడంపై మాజీ ఎంపీ…
వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలన రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ 3500…
ఏళ్లకేళ్లు ఎదురు చూస్తున్న విశ్వంభర అక్టోబర్ లో వచ్చే అవకాశాలు దాదాపు సున్నా. ఇది తెలిసే మైత్రి సంస్థ రణబాలిని…
అర్ధరాత్రి దాటింది.. రహదారిపై వాహనాల రాకపోకలు తగ్గిపోయాయి. కళ్లపై నిద్రమత్తు.. దృష్టి రహదారిపైనే ఉన్నా.. మెదడు మాత్రం నెమ్మదిగా స్పందించడం…
మాజీ మంత్రి జోగి రమేష్ కు సన్ స్ట్రోక్ గట్టిగానే తగిలేలా వుంది. కొడుకు రాజీవ్ వివాహం విషయంలో ఏర్పడ్డ…